రాజకీయం మారుతోంది..!
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది
ఎన్నికల వేళ అధికార పార్టీకి ఎదురుదెబ్బ
తెదేపా గూటికి చేరుతున్న వైకాపా నేతలు
తెదేపాలో చేరిన వైకాపా జిల్లా కోశాధికారి తులసీవరప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో మామిడి గోవిందరావు
న్యూస్టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం), పొందూరు, రణస్థలం, మెళియాపుట్టి, కొత్తూరు: జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది. ప్రచారాలు సైతం ఊపందుకున్నాయి. మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగనున్న తరుణంలో అధికార వైకాపాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కీలక నేతలంతా గడప దాటుతున్నారు. అసంతృప్తిని తట్టుకోలేక ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున వైకాపా కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాయి. గురువారం పెద్దఎత్తున వైకాపా నుంచి తెదేపాలో చేరికలు కొనసాగాయి.
తెదేపాలో చేరిన కొత్తూరు ఉప ఎంపీపీ
పాతపట్నం నియోజకవర్గ రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామం గురువారం చోటు చేసుకుంది. కొత్తూరు మండలంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వైకాపా తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ నాయకుడు ఎల్.తులసీవరప్రసాద్తో పాటు వైకాపా ఎంపీటీసీ సభ్యులు చింతాడ శ్రావణి, వీర్రాజు, కృష్ణవేణి, సింహాచలం, గౌరీకుమార్, సుమతి, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, వందలాది మంది వైకాపాను వీడారు. ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరావు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా తులసీవరప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.
- మెళియాపుట్టికి చెందిన పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. మెళియాపుట్టి సర్పంచి కుమారుడు రేఖాన వాసు, ఉప సర్పంచి మాడుగుల భానూజీరావు, వార్డు సభ్యులు గాలి రామారావును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
- శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ తెదేపా బలం పెరుగుతోంది. పలువురు తటస్థులు, వైకాపా నాయకులు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ను కలిసి మద్దతు తెలిపారు. నగరంలోని ఆయన కార్యాలయంలో గుత్తు చిన్నారావు, అల్లంశెట్టి జనార్దనరావు, పేట పద్మ, బెవర రమణ, రెడ్డి ఎర్రయ్య, తదితరులకు కండువాలు వేసి శంకర్ పార్టీలోకి ఆహ్వానించారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేస్తామని వారంతా పేర్కొన్నారు.
- పొందూరు మండలంలో వైకాపాబలహీనపడుతోంది. కింతలి గ్రామంలో సర్పంచి పైడి రాంప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు కూటికుప్పల హనుమంతురావు ఆధ్వర్యంలో 95 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. తెదేపా ఆమదాలవలస అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
- లావేరు మండలం లింగాలవలస వైకాపా సర్పంచి లుకలాపు అప్పలనాయుడు ఎచ్చెర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావును కలిశారు. త్వరలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు. మెంటాడలో 110 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవునల్తాడలో ఉద్రిక్తత!
[ 02-05-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎంపీ, పలాస ఎమ్మెల్యే అభ్యర్థులు కె.రామ్మోహన్నాయుడు, గౌతు శిరీష గ్రామంలో ప్రచారం చేశారు. -
దారుణం..!
[ 02-05-2024]
భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. తల్లి మానసిక స్థితి బాలేదు.. తనకేమైనా అయితే బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని ఆ తండ్రి మనస్తాపం చెందాడు. -
సారథులు.. ‘సేతు’లెత్తేశారు..!
[ 02-05-2024]
వారంతా అధికార పార్టీ నాయకులు..ఐదేళ్ల పాటు కనీసం వారధులు కూడా నిర్మించలేకపోయిన సారథులు..గత ఎన్నికల్లో ఓట్లేయండి..మీ కష్టాలు తీర్చుతామంటూ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు..అందలమెక్కి హామీల ఊసే మరిచారు..కాలం కరిగింది తప్ప వారి మనసు కరగలేదు. -
జగన్ మద్యం.. జీవితాలు ఛిద్రం..!
[ 02-05-2024]
జగనన్న మాటలు నమ్మి అక్కచెల్లెమ్మలు దగాపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ ఆ ఊసే మరిచిపోయారు. అధికారంలోకి రాగానే వైకాపా ప్రభుత్వమే అమ్మకాలు మొదలు పెట్టింది. -
అవ్వాతాతలకు పింఛను పాట్లు
[ 02-05-2024]
జిల్లాలో అవ్వాతాతలకు పింఛను నగదు కోసం పాట్లు తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం 3,20,886 మంది లబ్ధిదారుల్లో 2,42,957 మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. -
త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు
[ 02-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం 17వ వార్డులో తెదేపా ఆధ్వర్యంలో, మే డే వేడుకలు, ఎన్నికల ప్రచారం జరిగింది. -
దళితద్రోహి జగన్ను ఓడించండి
[ 02-05-2024]
దళితులకు చెందిన 27 పథకాలను రద్దుచేసిన దళితద్రోహి జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రాత్రి 10 తర్వాత మంత్రి అప్పలరాజు ప్రచారం!
[ 02-05-2024]
మందస మండలం రాంపురం పంచాయతీ బిడిమిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు -
ఇది జగనన్నఆడిన వికృత క్రీడ..!
[ 02-05-2024]
భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కలియుగ భీముడు కోడిరామ్మూర్తి పేరుతో శ్రీకాకుళం నగరంలో నిర్మించిన మైదానంలో తర్ఫీదు పొంది దేశానికి ప్రథమంగా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి, అంతర్జాతీయ, జాతీయ పతకాలు సాధించిన పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మి, విక్రాంత్ వంటి మేటి క్రీడాకారులు వందలకొద్దీ వెలుగులోకి వచ్చారు -
ఉపాధికి సమాధి
[ 02-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి, ప్రతి కుటుంబానికి వంద రోజుల పని చూపాలని ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో వంద రోజుల పని కొందరికే దక్కుతోంది
తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM