Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,652

Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది.

Updated : 02 May 2024 09:46 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలున్నప్పటికీ.. దేశీయ సూచీలు (Stock Market) ఆరంభంలో లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకొని 22,652 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.42 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. వరుసగా ఆరో సమీక్షలోనూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25-5.50 శాతంగా కొనసాగించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.1,071.93 కోట్ల విలువ చేసే వాటాలను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లూ (DIIs)’ రూ.1,429.11 కోట్ల షేర్లను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని