రెండో రోజు.. ప్రధాన పార్టీల జోరు
నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
ఆరు అసెంబ్లీ స్థానాలకు 13 నామినేషన్ల దాఖలు
పాతపట్నంలో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెళ్తున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు, చిత్రంలో ఎంపీ రామ్మెహన్నాయుడు, కూటమి శ్రేణులు
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, కలెక్టరేట్, అరసవల్లి, టెక్కలి, పాతపట్నం: నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు చేరుకున్నారు. కొందరు తమ పేరిట ముహూర్తం చూసుకొని నామపత్రాలు దాఖలు చేశారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 మంది, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పేరాడ తిలక్ (వైకాపా), ఇప్పిలి సీతరాజు (జై భారత్ నేషనల్ పార్టీ), బి.తిరుపతిరావు (భారత పిరమిడ్ పార్టీ) నామినేషన్లు వేశారు.
పోర్టు ఉపాధి దువ్వాడకే..
‘మూలపేట పోర్టు వస్తే అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఉద్యోగాలు వస్తాయి’ అని వైకాపా నాయకులు పదేపదే చెబుతుంటే స్థానికులు ఆశగా ఎదురు చూశారు. శుక్రవారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలోనూ మూలపేట పోర్టు గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన అఫిడవిట్ను పరిశీలిస్తే ఉపాధి ఎవరికి దొరికిందో బయట పడింది. విశ్వసముద్ర ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట గుత్తేదారు అవతారమెత్తిన దువ్వాడ శ్రీనివాస్ ఆయా ప్రాజెక్టులకు అవసరమైన రాయి, ఇసుక, కంకర సరఫరా చేసే పనులు పొందినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మూలపేట పోర్టుకు సంబంధించి సామగ్రి సరఫరా చేస్తుండటంతో తనకు ఆదాయం సమకూరుతోందని వెల్లడించారు. పోర్టు వస్తే అందరికీ ఉపాధి వస్తుందని చెప్పిన ఆయన తాను ఉపాధి పొందితే జిల్లా అంతా ఉపాధి పొందినట్లేనని భావిస్తున్నారంటూ వైకాపా నేతలే గుసగుసలాడటం గమనార్హం.
పలాసలో ఆర్వో భరత్నాయక్కు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష
జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సామూన్కు నామపత్రం అందజేస్తున్న వైకాపా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్,
చిత్రంలో సభాపతి సీతారాం, మంత్రులు ధర్మాన, అప్పలరాజు, ఎమ్మెల్యే కృష్ణదాస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవునల్తాడలో ఉద్రిక్తత!
[ 02-05-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎంపీ, పలాస ఎమ్మెల్యే అభ్యర్థులు కె.రామ్మోహన్నాయుడు, గౌతు శిరీష గ్రామంలో ప్రచారం చేశారు. -
దారుణం..!
[ 02-05-2024]
భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. తల్లి మానసిక స్థితి బాలేదు.. తనకేమైనా అయితే బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని ఆ తండ్రి మనస్తాపం చెందాడు. -
సారథులు.. ‘సేతు’లెత్తేశారు..!
[ 02-05-2024]
వారంతా అధికార పార్టీ నాయకులు..ఐదేళ్ల పాటు కనీసం వారధులు కూడా నిర్మించలేకపోయిన సారథులు..గత ఎన్నికల్లో ఓట్లేయండి..మీ కష్టాలు తీర్చుతామంటూ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు..అందలమెక్కి హామీల ఊసే మరిచారు..కాలం కరిగింది తప్ప వారి మనసు కరగలేదు. -
జగన్ మద్యం.. జీవితాలు ఛిద్రం..!
[ 02-05-2024]
జగనన్న మాటలు నమ్మి అక్కచెల్లెమ్మలు దగాపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ ఆ ఊసే మరిచిపోయారు. అధికారంలోకి రాగానే వైకాపా ప్రభుత్వమే అమ్మకాలు మొదలు పెట్టింది. -
అవ్వాతాతలకు పింఛను పాట్లు
[ 02-05-2024]
జిల్లాలో అవ్వాతాతలకు పింఛను నగదు కోసం పాట్లు తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం 3,20,886 మంది లబ్ధిదారుల్లో 2,42,957 మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. -
త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు
[ 02-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం 17వ వార్డులో తెదేపా ఆధ్వర్యంలో, మే డే వేడుకలు, ఎన్నికల ప్రచారం జరిగింది. -
దళితద్రోహి జగన్ను ఓడించండి
[ 02-05-2024]
దళితులకు చెందిన 27 పథకాలను రద్దుచేసిన దళితద్రోహి జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రాత్రి 10 తర్వాత మంత్రి అప్పలరాజు ప్రచారం!
[ 02-05-2024]
మందస మండలం రాంపురం పంచాయతీ బిడిమిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు -
ఇది జగనన్నఆడిన వికృత క్రీడ..!
[ 02-05-2024]
భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కలియుగ భీముడు కోడిరామ్మూర్తి పేరుతో శ్రీకాకుళం నగరంలో నిర్మించిన మైదానంలో తర్ఫీదు పొంది దేశానికి ప్రథమంగా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి, అంతర్జాతీయ, జాతీయ పతకాలు సాధించిన పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మి, విక్రాంత్ వంటి మేటి క్రీడాకారులు వందలకొద్దీ వెలుగులోకి వచ్చారు -
ఉపాధికి సమాధి
[ 02-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి, ప్రతి కుటుంబానికి వంద రోజుల పని చూపాలని ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో వంద రోజుల పని కొందరికే దక్కుతోంది