మాటల మామ.. సంక్షేమం మమ..!
రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు.
బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో కనీస వసతులు కరవు
విద్యార్థుల అవస్థలు పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే, పాతశ్రీకాకుళం, ఎల్ఎన్పేట, నరసన్నపేట, బూర్జ, రణస్థలం, కంచిలి, కవిటి గ్రామీణం, సారవకోట రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు. ‘నా ఎస్సీలు...నా బీసీలు..నా మైనార్టీలు..’ అంటూ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసే ముఖ్యమంత్రి ఆ చిన్నారుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. అయిదేళ్ల పాలనలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతుల్లేక అవస్థలు పడుతున్నారని తెలిసినా కన్నెత్తి చూడలేదు. మంచాలు, కిటికీలకు తలుపులు, తాగునీటి సౌకర్యం లేకపోయినా మామ కరుణించలేదు. దోమలు విజృంభిస్తుండటంతో ఇరుకు గదుల్లో నిద్రించేందుకు సతమతమవుతున్నా.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
పెచ్చులూడుతున్నాయి చూడు మావయ్య..
ఎల్ఎన్పేట సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం శిథిలమైంది. పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. ఊచలు బయటకు కనిపిస్తుండటంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. నేలబావి/వంశధార నదిలో స్నానాలు చేస్తున్నారు. మరుగుదొడ్లకు విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నారు.
తాగునీటికి వెతలు
నరసన్నపేట బీసీ బాలుర వసతి గృహాన్ని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల్లో విద్యార్థులు సతమతమవుతున్నారు. తాగునీటి సదుపాయం అంతంతమాత్రమే. సాంఘిక సంక్షేమశాఖ కళాశాల బాలుర వసతి గృహంలోనూ విద్యార్థులు బయట నీరు కొనుగోలు చేసుకుంటున్నారు. పక్కనే గ్రామ పంచాయతీ నీళ్ల ట్యాంకు ఉన్నా కొరత తప్పడంలేదు.
ఊడిపోయిన మెష్లు..
సారవకోట సమీకృత వసతిగృహంలో 114 మంది విద్యార్థులు ఉన్నారు. 12 గదులకు సంబంధించి చాలావరకు కిటికీల తలుపులు దెబ్బతిన్నాయి. మెష్లు కొంతవరకు ఊడిపోయాయి. పంకాల్లో కొన్ని పని చేయట్లేదు. దోమల బెడదతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
అంతా అధ్వానమే..
బూర్జ మండలం కొల్లివలస గురుకులంలో అయిదు నుంచి ఇంటర్ వరకు 640 మంది వసతి పొందుతున్నారు. మంచాలు లేవు. చాలావరకు పంకాలు పని చేయడం లేదు. కిటికీలు, తలుపులు తుప్పు పట్టి పాడయ్యాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులకు నీటి సరఫరా లేక అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్ల వెనక భాగంలో పనికి రాని మొక్కలు పెరిగాయి. గచ్చుకు నాచు పట్టి ఉంది. ప్రహరీ దెబ్బతింది. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆర్వో ప్లాంట్ నిరుపయోగంగా మారింది.
15 మందికి ఒకే పంకా
కవిటి మండలం రాజపురం బీసీ వసతిగృహంలో 110 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరు గదులకు అయిదింట్లో రెండు చొప్పున పంకాలు ఉన్నాయి. ఒక గదిలో ఒకటే ఉంది. ఇక్కడ 15 మంది విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడే 85 మందికి వసతి
రణస్థలం మండలం పాతర్లపల్లిలో శిథిలావస్థకు చేరిన తుపాను రక్షిత భవనంలో బీసీ బాలుర వసతిగృహం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 85 మంది విద్యార్థులు ఉన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
సమస్యలతో సావాసం..
కంచిలి మండలం ఎంఎస్ పల్లి బీసీ బాలుర వసతిగృహంలో 72 మంది విద్యార్థులు ఉన్నారు. మరుగుదొడ్లు వినియోగించడానికి నీటి సమస్య ఉంది. కొన్ని కిటికీలకు తలుపులు లేకపోవడంతో రాత్రి వేళ దోమలు విజృంభిస్తున్నాయి. పాములు, కుక్కలు పరిసరాల్లో సంచరిస్తున్నాయి.
విద్యార్థినులు 240 మంది.. మరుగుదొడ్లు ఆరు
శ్రీకాకుళం నగరం మహిళా కళాశాల ప్రాంగణంలోని బీసీ విద్యార్థినుల వసతిగృహం (3)లో 240 మంది ఉన్నారు. తాగునీరు సక్రమంగా రాకపోవడంతో బయట నుంచి క్యాన్లు, సీసాల్లో తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఆరు మరుగుదొడ్లు నిర్వహణలో ఉన్నాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 60 మందికి గదులు, మంచాలు లేక హాల్లో నేలపై నిద్రిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవునల్తాడలో ఉద్రిక్తత!
[ 02-05-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎంపీ, పలాస ఎమ్మెల్యే అభ్యర్థులు కె.రామ్మోహన్నాయుడు, గౌతు శిరీష గ్రామంలో ప్రచారం చేశారు. -
దారుణం..!
[ 02-05-2024]
భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. తల్లి మానసిక స్థితి బాలేదు.. తనకేమైనా అయితే బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని ఆ తండ్రి మనస్తాపం చెందాడు. -
సారథులు.. ‘సేతు’లెత్తేశారు..!
[ 02-05-2024]
వారంతా అధికార పార్టీ నాయకులు..ఐదేళ్ల పాటు కనీసం వారధులు కూడా నిర్మించలేకపోయిన సారథులు..గత ఎన్నికల్లో ఓట్లేయండి..మీ కష్టాలు తీర్చుతామంటూ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు..అందలమెక్కి హామీల ఊసే మరిచారు..కాలం కరిగింది తప్ప వారి మనసు కరగలేదు. -
జగన్ మద్యం.. జీవితాలు ఛిద్రం..!
[ 02-05-2024]
జగనన్న మాటలు నమ్మి అక్కచెల్లెమ్మలు దగాపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ ఆ ఊసే మరిచిపోయారు. అధికారంలోకి రాగానే వైకాపా ప్రభుత్వమే అమ్మకాలు మొదలు పెట్టింది. -
అవ్వాతాతలకు పింఛను పాట్లు
[ 02-05-2024]
జిల్లాలో అవ్వాతాతలకు పింఛను నగదు కోసం పాట్లు తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం 3,20,886 మంది లబ్ధిదారుల్లో 2,42,957 మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. -
త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు
[ 02-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం 17వ వార్డులో తెదేపా ఆధ్వర్యంలో, మే డే వేడుకలు, ఎన్నికల ప్రచారం జరిగింది. -
దళితద్రోహి జగన్ను ఓడించండి
[ 02-05-2024]
దళితులకు చెందిన 27 పథకాలను రద్దుచేసిన దళితద్రోహి జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రాత్రి 10 తర్వాత మంత్రి అప్పలరాజు ప్రచారం!
[ 02-05-2024]
మందస మండలం రాంపురం పంచాయతీ బిడిమిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు -
ఇది జగనన్నఆడిన వికృత క్రీడ..!
[ 02-05-2024]
భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కలియుగ భీముడు కోడిరామ్మూర్తి పేరుతో శ్రీకాకుళం నగరంలో నిర్మించిన మైదానంలో తర్ఫీదు పొంది దేశానికి ప్రథమంగా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి, అంతర్జాతీయ, జాతీయ పతకాలు సాధించిన పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మి, విక్రాంత్ వంటి మేటి క్రీడాకారులు వందలకొద్దీ వెలుగులోకి వచ్చారు -
ఉపాధికి సమాధి
[ 02-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి, ప్రతి కుటుంబానికి వంద రోజుల పని చూపాలని ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో వంద రోజుల పని కొందరికే దక్కుతోంది
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు