మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్
జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు ప్రకటించారు.
జవాన్ డిక్లరేషన్ ప్రతులను విడుదల చేస్తున్న ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు
గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్టుడే: జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం నగరంలోని మాజీ సైనికుల సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ‘ఎర్రన్న జవాన్ మిత్ర - జవాన్ డిక్లరేషన్’ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమరులైన, దివ్యాంగులైన సైనిక కుటుంబాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో జవాన్లకు కేటాయించిన రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఉద్యోగ విరమణ చేసిన సైనికులకు ఆదాయం కల్పించేలా ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాటు చేయడంతో పాటు ఆర్మీలో ఆఫీసర్ ర్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మాజీ సైనికోద్యోగుల సంఘ నేతలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పొంగిన వనితోత్సాహం..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శనం. ఈసారి మహిళలు పెద్ద ఎత్తున ఓటేసేందుకు తరలి వచ్చారు. నేతల తలరాతలను నిర్ణయించడంలో వారి తీర్పే శాసనం కానుంది. పురుషుల కంటే వారి ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. -
గాలి కూటమి వైపే..!
[ 15-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి దాటే వరకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ ప్రక్రియ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.. అభ్యర్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. -
మార్టులన్నారు.. మాట మార్చారు..!
[ 15-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మండలానికో మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో వైకాపా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ తరువాత నియోజకవర్గానికి ఒకటేనని ప్రకటించింది. చివరకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో మాత్రమే ఏర్పాటు చేసి ఊరుకుంది. -
తెదేపా కార్యకర్తపై దాడి
[ 15-05-2024]
మందస మండలం హరిపురంలో మంగళవారం తెదేపా కార్యకర్త కనగల రామారావుపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కర్ర అనిల్ దాడి చేశాడు. హరిపురంలోని 162 పోలింగ్ కేంద్రంలో రామారావు తెదేపా తరఫున ఏజెంటుగా ఉన్నారు. -
తెదేపాకు ఓటేశారని ఇంటికి తాళం
[ 15-05-2024]
తెదేపాకు ఓటేశారనే అక్కసుతో వైకాపా శ్రేణులు ఓ కుటుంబంపై కక్ష కట్టిన ఉదంతమిది. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి చినబడాంకు చెందిన పి.మన్మధరావు భార్య సుజాతతో కలిసి ఓటు వేయడానికి విజయనగరం నుంచి వచ్చారు. -
తీర్పు భద్రం
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఓటర్ల తీర్పును ఎన్నికల అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో మూడంచెల భద్రత నడుమ ఉంచారు. -
ముందే మేల్కొనకుంటే ముప్పే..!
[ 15-05-2024]
జాతీయ రహదారిలో లావేరు మండలం బుడుమూరు కూడలి సమీపంలో 2023 జూన్లో వ్యాన్ టైరు పేలి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన ముగ్గురు మృత్యవాత పడ్డారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. -
మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేక వస్త్రం
[ 15-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ, చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేశ్ ముఖ చిత్రాలతో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేస్తున్నట్లు లావేరు మండలంలోని వస్త్రపురికాలనీకి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మీ తెలిపారు. -
పాము కాటుకు యువకుడి బలి
[ 15-05-2024]
మండలంలోని పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన లఖినాన శివానందం (24) పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత శివానందం తల్లి పార్వతి, సోదరుడు పవన్ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి కట్ల పాము అతడిని కరిచింది. -
వైకాపా నేతలపై ఫిర్యాదు
[ 15-05-2024]
టెక్కలి పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణపై తెదేపా బూత్ ఏజెంట్ రెయ్యి ప్రీతిష్ చంద్ర టెక్కలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
-
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
-
స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై.. త్వరలో కొత్త మార్గదర్శకాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం