ఉద్దానం రైతులను ఏం ఉద్ధరించారు..
ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
గిట్టుబాటు ధరను పట్టించుకోని వైకాపా సర్కారు
మంత్రి ఇలాకాలో అయిదేళ్లుగా అవస్థలు
బొడ్డపాడు మాకన్నపల్లి గ్రామాల మధ్య పూతలేని జీడి చెట్లు (అంతర చిత్రంలో పూత మాడిపోయిన దృశ్యం)
ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి రావడం కోసం అన్నదాతలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోసిన జగన్, ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పారు. తీరా సీఎం అయ్యాక కనీసం వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మంత్రి అప్పలరాజు ఇలాకాలో అయిదేళ్లుగా అవస్థలు పడుతున్నా స్పందన కరవైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో పండించే జీడి మామిడి, కొబ్బరి, మునగ, పనస పంటలకు స్థానికంగా, విదేశాల్లోనూ మార్కెట్ ఉన్నా నాలుగేళ్లుగా మద్దతు ధర లేదని రైతులు వాపోతున్నారు.
న్యూస్టుడే, పలాస, కాశీబుగ్గ
తగ్గిన దిగుబడి..
ప్రస్తుత సీజన్లో జీడి మామిడి పంటకు పూత బాగా వచ్చినా సకాలంలో వర్షం పడక పోవటంతో మొత్తం ఎండిపోయింది. దీంతో గతంలో ఎకరాకు 4 నుంచి 5 బస్తాలు దిగుబడి వచ్చేది ఈ ఏడాది ఎకరాకు ఒక్క బస్తా సైతం రాని దుస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు శ్రమపడుతున్నా తెల్ల పురుగు, బంక పురుగు చేరి జీడిపంటను నాశనం చేస్తున్నాయి. 2018 వరకు బస్తాకు రూ.14 వేల వరకు ధర పలికినా అయిదేళ్లుగా జీడిపిక్కలకు మద్దతు ధర రాకపోవడంతో పెట్టుబడి సైతం రాని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది బస్తా ధర రూ.7,500 నుంచి రూ.8 వేలు పలుకుతుండటం, పిక్కలు దిగుబడి లేక పోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుపానుల ప్రభావంతో ఇబ్బందుల రెట్టింపు
ఉద్దానంలో జీడి తర్వాత ఆదాయం ఇచ్చే కొబ్బరి పంట పరిస్థితి దయనీయంగా మారింది. తిత్లీ తుపాను తర్వాత చాలా వరకు కొబ్బరి చెట్లు నేలకొరగడం, కొత్తగా వేసిన చెట్లు ఆదాయం ఇవ్వక పోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. వైకాపా హయాంలో జీడి, కొబ్బరి రైతుల్లో కొంతమందికి మాత్రమే పరిహారం అందటంతో మిగతా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఉద్దాన రైతులంతా విన్నవించినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటంతో ఉసూరుమంటూ అరకొరగా పండే పంటలను కాపాడుకుంటున్నారు.
రూ.వెయ్యి హామీ గాలికి
జీడి పంటకు మద్దతు ధర లేకపోవటంతో ప్రభుత్వం రైతులకు పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది. జీడి వ్యాపారులంతా 80 కేజీల బస్తాకు రూ.9 వేల చొప్పున రైతులకు చెల్లింపులు చేయాలని, ప్రభుత్వం నుంచి వ్యాపారుల ఖాతాలకు రూ.1000 జమ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన సమయానికి ముందే రైతులంతా జీడి పిక్కలు వ్యాపారులకు అమ్మడంతో అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అప్పగించారు. కానీ అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగక పోవడంతో జీడిరైతులంతా మద్దతు ధర రూ.16వేలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
దిగుబడి తగ్గింది
గతంతో పోల్చుకుంటే పిక్కల దిగుబడి గణనీయంగా తగ్గింది. వర్షాభావంతో ఎకరాకు 40 కేజీలు సైతం రావడం లేదు. భూమిలో వేడి, పై నుంచి ఎండ వేడిమికి జీడి పూత మాడిపోయి రాలి పోయింది. మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇప్పటివరకు స్పందన లేదు. జీడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
పోతనపల్లి తాతారావు, బొడ్డపాడు, పలాస మండలం
మొక్కలు సరఫరా చేయలేదు
తిత్లీ తుపాను తర్వాత మొక్కలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా అంటు మొక్కలు సరఫరా చేయక పోవడంతో బాపట్ల నుంచి ఒక్కో మొక్కకు రూ.200 చెల్లించి తెప్పించుకుంటున్నాం. ప్రభుత్వం జీడి తోటల్లో బోర్లు ఏర్పాటు చేస్తే పంటలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
తామాడ త్రిలోచనరావు, మాజీ సర్పంచ్, బొడ్డపాడు, పలాస మండలం
కరవు ప్రాంతంగా ప్రకటించాలి
ఈ ఏడాది జీడి, పనస, కొబ్బరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. దీంతో పలాస మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదు. దీంతో రైతులు ఇటు పంట చేతికందక, అటు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధరను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి.
తెప్పల అజయ్కుమార్, కన్వీనర్, రాష్ట్ర జీడి రైతు సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమికే జై
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో ప్రధాన పార్టీల విజయంపై పందేలు పోటాపోటీగా సాగుతున్నాయి. -
చెరువుల్నీ వదలని ఘనులు..!
[ 16-05-2024]
ఆమదాలవలస పురపాలక సంఘ పరిధిలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, ప్రధాన కాలువలు ఆక్రమణకు గురవుతున్నా రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు కన్నెత్తి చూడటం లేదు. రూ.కోట్ల విలువైన భూములు కబ్జా కోరల్లో చిక్కుకుని అన్యాక్రాంతమవుతున్నాయి. -
శాశ్వత మరమ్మతులకు చర్యలు
[ 16-05-2024]
గొట్టా బ్యారేజీ దిగువన శాశ్వత మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సీఈ బీఎస్ఎస్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. -
ఖరీఫ్ సాగుకు కష్టమే..!
[ 16-05-2024]
ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నా జిల్లాలో సాగునీటి వనరుల పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా రైతులకు కష్టాలు తప్పేలా లేవు. -
చిత్తడి నేలలు ధ్వంసం
[ 16-05-2024]
సిక్కోలు తంపర నేలలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ వందల రకాల జీవరాశులు జీవిస్తున్నాయి. ఎన్నో రకాల ఔషధ మొక్కలకు నిలయం. -
కుప్పకూలిన వంతెన... ఏడాదిగా యాతన..!
[ 16-05-2024]
మిగిలిన వాటిని బెల్లుపడ గ్రామం మీదుగా జాతీయ రహదారికి పంపుతున్నారు. దీంతో సమీప గ్రామాలకు చేరుకోవాల్సిన వారికి చుట్టూ తిరిగి వెళ్లాలంటే మరో మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. -
అచ్చెన్నకు ముందస్తు శుభాకాంక్షలు
[ 16-05-2024]
తెెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసేందుకు వచ్చిన తెదేపా నాయకులతో బుధవారం నిమ్మాడలో సందడి నెలకొంది. -
ఒత్తిడిని అధిగమిస్తే.. ఉత్తమ ర్యాంకు మీదే..!
[ 16-05-2024]
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు 2024-25 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్కు సమయం ఆసన్నమైంది. -
ఏకలవ్య.. అందుబాటులోకి ఎప్పుడయ్యా..?
[ 16-05-2024]
జిల్లాలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో 2014లో అప్పటి ప్రభుత్వం ఏకలవ్య ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!