logo

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ

  వేలూర్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు.

Updated : 19 Apr 2024 08:22 IST

చికిత్స పొందుతున్న మన్సూర్‌ అలీఖాన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే:  వేలూర్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనవడంతో వెంటనే గుడియాత్తంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తనకు పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్‌ అలీఖాన్‌ ప్రకటన విడుదల చేశారు. అందులో.. గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్లరసం, మజ్జిగ ఇచ్చారన్నారు. పండ్లరసం తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని