హత్య కేసులో ముగ్గురి అరెస్టు
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
అంగప్పన్, కుమరేశన్, తమీముల్ అన్సారీ
ప్యారిస్, న్యూస్టుడే: హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడు మాత్తూర్కి చెందిన నవీన్కుమార్(27)గా తెలిసింది. అతన్ని హత్య చేసిన కుమరేశన్, అంగప్పన్, తమీముల్ అన్సారీలను అరెస్టు చేశారు. నవీన్కుమార్ తన స్నేహితుడైన కుమరేశన్తో కలిసి తరచూ మద్యం తాగేవాడని, కొద్దిరోజుల కిందట వారి మధ్య నగదు విషయంలో గొడవ జరిగనట్లు తెలిసింది. నవీన్కుమార్ కోపంతో కుమరేశన్ కుమార్తెను హత్య చేసినట్లు తెలిసింది. దీంతో కుమరేశన్ తన స్నేహితులతో కలిసి నవీన్కుమార్ను హత్య చేసినట్లు తేలింది.
రౌడీ దారుణ హత్య
సైదాపేట, న్యూస్టుడే: రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. పుదుకోట్టై జిల్లా పొన్నమరావతి దగ్గర అరియాండిపట్టి గ్రామంలో కాలువ ఒడ్డున ఒకరు హత్యకు గురయ్యాడని పొన్నమరావతి పోలీసులకు బుధవారం ఉదయం సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు. గొంతుకోసిన స్థితిలో ఆ వ్యక్తి హత్యకు గురై కనిపించాడు. దర్యాప్తులో హత్యకు గురైన వ్యక్తి అంజుపులిపట్టికి చెందిన రామన్ కుమారుడు అడైక్కప్పన్ (24)గా తెలిసింది. భవన నిర్మాణ కార్మికుడైన అతను కోయంబత్తూరులో పని చేస్తున్నట్లు గుర్తించారు. రౌడీయిజం చేస్తుంటాడని, సెలవులో ఊరికి వచ్చినప్పుడు హత్యకు గురైనట్లు తెలిసింది. అడైక్కప్పన్పై పలు కేసులు ఉన్నట్లు తేలింది.
యువకుడు..
అరుణ్కుమార్(పాత చిత్రం)
గుమ్మిడిపూండి, న్యూస్టుడే: గుమ్మిడిపూండి సమీప కాయలార్మేడుకు చెందిన అరుణ్కుమార్ (26). ఇతన్ని ఓ దాడి కేసుకు సంబంధించి పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసి పుళల్ జైల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో బెయిల్పై బయటకు వచ్చిన అతను బుధవారం ఈగువారుపాళ్యంలో స్నేహితులతో మద్యం తాగుతుండగా ఓ ముఠా మారణాయుధాలతో అతనిపై దాడిచేసి హతమార్చింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
వివాహ వేడుకకు వెళ్తుండగా విషాదం
సైదాపేట, న్యూస్టుడే: వివాహ వేడుకకు వెళ్తుండగా కారు బోల్తా పడి మహిళ సహా ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుచ్చి కొట్టపట్టు వెంకటేశ్వరనగర్ ప్రాంతానికి చెందిన గోపి(57), విజయలక్ష్మి(51) దంపతులు. గోపి మణప్పారై పంచాయతీ యూనియన్ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఆయన సోదరుడు కన్నన్(47). ఈ ముగ్గురూ కారులో శివకాశిలో జరిగే బంధువుల వివాహ వేడుకలకు బయల్దేరారు. తిరుచ్చి- మదురై జాతీయ రహదారిలో తువరంకురిచ్చి వద్ద కారు రోడ్డు పక్కన బోల్తాకొట్టింది. విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. గోపి, కన్నన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. కన్నన్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. చికిత్స పొందుతూ గోపి ప్రాణాలు విడిచాడు.
బస్సు బోల్తాపడి ఒకరి మృతి.. 25 మందికి గాయాలు
సైదాపేట, న్యూస్టుడే: కుంభకోణం నుంచి తంజావూరుకు 40 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఉదయం ప్రభుత్వ బస్సు బయలుదేరింది. అయ్యంపేట వద్ద ప్రమాదవశాత్తు రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయాల పాలయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి (50) అనే మహిళ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.