ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు.
కలశంపై పుణ్యజలాలు పోస్తున్న శంకర విజయేంద్ర సరస్వతి స్వామి
కాంచీపురం, న్యూస్టుడే: కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. పనులు ముగియడంతో శుక్రవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు. మూడు రోజులుగా మఠం ప్రాంగణంలో యాగశాల పూజలు భరణీధరశాస్త్రి నేతృత్వంలో 20 మంది వేదపండితులు, రుత్వికులు నిర్వహించారు. శుక్రవారం యాగశాల పూజలు పూర్తి కావడంతో పూర్ణాహుతి నిర్వహించారు. దీపారాధన అనంతరం కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి కుంభాభిషేకంలో పాల్గొన్నారు. యాగశాలలో ఉంచిన పుణ్యజలాలతో ఆదిశంకరుడు, శ్రీఅనుక్కై గణపతి, సరేశ్వరాచార్యుల సన్నిధుల గోపుర కలశాలకు దీపారాధన, మూలమూర్తులకు అభిషేకాలు చేశారు. కుంభాభిషేకంలో ముల్లై వాసల్ కృష్ణమూర్తి, చెన్నై ఐఐటీ డైరెక్టరు కామకోటి సహా పలువురు ప్రముఖులు, శంకరమఠం భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను మఠం శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, మేనేజర్ సుందరేశ అయ్యర్, సిబ్బంది పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యర్థాలతో విద్యుత్తు వెలుగులు
[ 17-05-2024]
రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ తీసుకున్నా పెద్దఎత్తున చెత్తాచెదారాలు పోగవుతున్నాయి. చెన్నైలోనైతే ఇక హద్దేలేదు. ఈ వ్యర్థాలను నిల్వ చేస్తుండటంతో పెద్దఎత్తున విషవాయువులు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. -
అబుదాబిలో రజనీ విశ్రాంతి
[ 17-05-2024]
‘జైలర్’ చిత్రం తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయన్’ చిత్రంలో రజనీకాంత్ నటించిన విషయం తెలిసిందే. ఆయన 170వ చిత్రమైన ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు నటించారు. -
19 జిల్లాల్లో నేడు భారీ వర్షం
[ 17-05-2024]
రాష్ట్రంలో శుక్రవారం 19 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. గురువారం విడుదల చేసిన ప్రకటనలో.. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక సముద్రతీరంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో 20 వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఇళయరాజాను కలిసిన మంత్రి
[ 17-05-2024]
ఇసైజ్ఞాని ఇళయరాజాను మర్యాదపూర్వకంగా కలిశానని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఎక్స్ పేజీలో తెలిపారు. -
20 నుంచి 26 వరకు ఐఐటీఎంలో అంతర్జాతీయ సదస్సు
[ 17-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో 20 నుంచి 26 వరకు ‘సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్స్ట్ యూత్స్’ (ఎస్పీఐసీ ఎంఏసీఏవై) 9వ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. -
శస్త్రచికిత్స లేకుండా హృదయ చికిత్స
[ 17-05-2024]
పుట్టుకతో హృదయ సమస్య ఉన్న రోగికి తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రిలో శస్త్రచికిత్స లేకుండా విజయవంతంగా చికిత్స అందించారు. -
నగదు మోసం కేసులో సినీ నిర్మాత అరెస్టు
[ 17-05-2024]
కేరళలోని కొచ్చిన్కు చెందిన జానీ థామస్ మలయాళ సినీ నిర్మాత. ఇతనిపై కోవై వడవళ్లికి చెందిన ఉదయశంకర్ అనే వ్యక్తి సిటీ క్రైం బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు. -
కరెంటు తీగలపై దుస్తులు ఆరేయొద్దు
[ 17-05-2024]
వర్షాకాలంలో సంభవించే విద్యుత్తు ప్రమాదాల నియంత్రణకు విద్యుత్తుశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని తప్పకుండా పాటించాలని ప్రజలను కోరింది. -
బడి ఈడులో బాల నేరస్థులుగా..
[ 17-05-2024]
చెన్నై జిల్లాలో ఏటా సరాసరి 500 మందికి పైగా బాలురు హత్య, హత్యాయత్నం, చోరీ, దోపిడీ తదితర కేసులలో అరెస్టయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్