వైభవంగా వాసవి జయంతి మహోత్సవం
జార్జిటౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు.
శ్రీ వాసవి జ్యోతితో పాలక మండలి సభ్యులు
ప్యారిస్, న్యూస్టుడే: జార్జిటౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్కుమార్, దేసు లక్ష్మీనారాయణ, ఎస్ఎల్ సుదర్శనం, టీవీ రామకుమార్, సీఆర్ కిషోర్బాబు, టీఎస్ బద్రీనాథ్లు శ్రీ వాసవాంబ జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావారి జిల్లా పెనుగొండ నుంచి శ్రీ వాసవి జ్యోతిని నగరానికి తెప్పించారు. ఎస్కేపీడీ యాజమాన్యంలో చెట్పేట్ లోని విద్యార్థి వసతి గృహం నుంచి శ్రీ వాసవి జ్యోతిని పాలకమండలి సభ్యులు ఊరేగింపుగా తీసుకురాగా గోవిందప్ప నాయక్ వీధిలోని ఎస్కేపీడీ బాలుర మహోన్నత పాఠశాల నుంచి పల్లకీలో అమ్మవారి చిత్రపటాన్ని కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. దాదాపు వెయ్యి మంది మహిళలు పాల బిందెలతో ఊరేగింపులో పాల్గొన్నారు. నగరంలోని వివిధ వైశ్య ధర్మ సంస్థల నిర్వాహకులతో పాటు పాలకమండలి మాజీ సభ్యులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారికి దాతలు మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. మహిళలు తీసుకొచ్చిన పాలబిందెలతో అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసి అన్నదానం చేశారు. కార్యదర్శి ఎం కిషోర్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 102 మంది గాయనీ గాయకులతో కూడిన రాగమాలిక బృందం అమ్మవారికి సంగీతాంజలి సమర్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
[ 02-06-2024]
జయలలిత హిందుత్వవాది అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అన్నామలై ఇటీవల విలేకర్లతో మాట్లాడుతూ.. -
కాషాయ వస్త్రాలతో సూర్యారాధన
[ 02-06-2024]
కన్నియాకుమరిలోని వివేకానంద స్మారక మండపంలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. శనివారం ఉదయం 5.50కు కాషాయ వస్త్రాలతో బయటకొచ్చిన ప్రధాని సూర్యారాధన చేశారు. -
త్వరలో పిత్తల మాత్తి విడుదల
[ 02-06-2024]
మాణిక్క విద్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిత్తల మాత్తి’. ఇందులో ఉమాపతి రామయ్య, సంస్కృతి, బాల శరవణన్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుల్లేఖ రామన్, ‘ఆడుకళం’ నరేన్, ‘కాదల్’ సుకుమార్ తదితరులు నటించారు. -
‘కలైజ్ఞర్ 100’ ప్రదర్శన ప్రారంభం
[ 02-06-2024]
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి ముగింపు వేడుకలు సందర్భంగా ప్యారిస్ కార్నర్లోని రాజా అన్నామలై హాలులో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను నటుడు ప్రకాశ్రాజ్ శనివారం ప్రారంభించారు. -
షరతులతో పర్యాటకులకు అనుమతి
[ 02-06-2024]
ప్రధాని మోదీ ధ్యానం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపానికి పర్యాటకులను అనుమతించలేదు. శుక్రవారం అనుమతించారు. లగేజీ, సెల్ఫోన్లు తదితరాలను తీసుకెళ్లనివ్వలేదు. -
భాజపా రికార్డు సృష్టిస్తుంది
[ 02-06-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రికార్డు సృష్టించి ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. -
చెన్నైలో తల్లిపాల విక్రయంపై నిఘా
[ 02-06-2024]
చెన్నైలో తల్లిపాల విక్రయాలపై నిఘా పెట్టేందుకు 18 బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆహారభద్రతాశాఖ అధికారులు తెలిపారు. చెన్నై మాధవరం ప్రాంతంలో చట్టవిరుద్ధంగా తల్లిపాలు సీసాల్లో పెట్టి విక్రయిస్తున్న ప్రైవేట్ మందుల దుకాణానికి
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్