పాత గూటికి పన్నీర్?
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
మళ్లీ అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు యత్నాలు
ఎడప్పాడికి మాజీ మంత్రుల సలహా
ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో భారీ మార్పులు
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తమిళనాడు సహా దక్షణాది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో మరికొన్ని చోట్ల జరగాల్సి ఉంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తమిళనాడులో డీఎంకే కూటమికి పోటీగా అన్నాడీఎంకే, భాజపాలు వేర్వేరు కూటములు ఏర్పాటు చేసి ఎన్నికలు ఎదుర్కొన్నాయి. దీంతో ఓట్లు చీలి డీఎంకేకే అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకేకు పోటీగా మెగా కూటమి ఏర్పాటు చేయాలన్న అన్నాడీఎంకే వ్యూహం నెరవేరలేదు. డీఎండీకేతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే పీఎంకేను కూడా కూటమిలోకి తేగలిగి ఉంటే డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఓ పన్నీర్సెల్వం ప్రత్యేక వర్గంగా భాజపా కూటమిలో చేరారు. రామనాథఫురంలో పోటీ చేసిన ఆయన విజయం సాధిస్తారా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
న్యూస్టుడే, సైదాపేట
భాజపాతో ఉంటే బాగుండేది..
అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురై ప్రత్యేక పార్టీ పెట్టిన టీటీవీ దినకరన్ కూడా భాజపాతో చేతులు కలిపారు. ఇలా ఓపీఎస్, టీటీవీలు అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా చేతులు కలపడం అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బగా అంతా భావిస్తున్నారు. అదే సమయంలో భాజపా కూటమి నుంచి బయటకు వచ్చి ఉండకూడదని అన్నాడీఎంకే ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. భాజపా కూటమిలో ఉండి ఓపీఎస్, టీటీవీలను అక్కున చేర్చుకుని ఉంటే తప్పకుండా కూటమి బలంగా ఉండేదేనని రాజకీయ నిపుణుల భావన. భాజపా కూటమిలో అన్నాడీఎంకే ఉండి పీఎంకే కూడా కూటమిలో చేరుంటే తప్పకుండా డీఎంకేకు సవాల్ విసిరుండొచ్చనేది పలువురి అభిప్రాయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు చీలి డీఎంకేకు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.
కొత్త సమస్యలు రావొచ్చేమో..
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సమైక్య అన్నాడీఎంకేను మళ్లీ ఏర్పాటు చేస్తే ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మాజీ మంత్రులు దీని గురించి ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి వద్ద మాట్లాడినట్లు సమాచారం. దీనికోసం పన్నీర్ను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని వారు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తెరవెనుక యత్నాలు జరుగుతున్నాయి కూడా. అయితే ఓపీఎస్ పార్టీలోకి వస్తే మళ్లీ అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం వస్తుందని భయపడుతున్నారు. ఇప్పటివరకు ఆయన వల్ల ఏర్పడిన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాని నేపథ్యంలో ఆయనతో కలిసి ఎలా పని చేయాలని కొందరు పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఇలా ఓపీఎస్ను మళ్లీ పార్టీలోకి తేవడం గురించి అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయలలిత సిద్ధాంతాలపై జగడం.. తమిళనాట రాజకీయాల్లో తీవ్ర చర్చ
[ 02-06-2024]
జయలలిత హిందుత్వవాది అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అన్నామలై ఇటీవల విలేకర్లతో మాట్లాడుతూ.. -
కాషాయ వస్త్రాలతో సూర్యారాధన
[ 02-06-2024]
కన్నియాకుమరిలోని వివేకానంద స్మారక మండపంలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది. శనివారం ఉదయం 5.50కు కాషాయ వస్త్రాలతో బయటకొచ్చిన ప్రధాని సూర్యారాధన చేశారు. -
త్వరలో పిత్తల మాత్తి విడుదల
[ 02-06-2024]
మాణిక్క విద్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిత్తల మాత్తి’. ఇందులో ఉమాపతి రామయ్య, సంస్కృతి, బాల శరవణన్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుల్లేఖ రామన్, ‘ఆడుకళం’ నరేన్, ‘కాదల్’ సుకుమార్ తదితరులు నటించారు. -
‘కలైజ్ఞర్ 100’ ప్రదర్శన ప్రారంభం
[ 02-06-2024]
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి ముగింపు వేడుకలు సందర్భంగా ప్యారిస్ కార్నర్లోని రాజా అన్నామలై హాలులో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను నటుడు ప్రకాశ్రాజ్ శనివారం ప్రారంభించారు. -
షరతులతో పర్యాటకులకు అనుమతి
[ 02-06-2024]
ప్రధాని మోదీ ధ్యానం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపానికి పర్యాటకులను అనుమతించలేదు. శుక్రవారం అనుమతించారు. లగేజీ, సెల్ఫోన్లు తదితరాలను తీసుకెళ్లనివ్వలేదు. -
భాజపా రికార్డు సృష్టిస్తుంది
[ 02-06-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రికార్డు సృష్టించి ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. -
చెన్నైలో తల్లిపాల విక్రయంపై నిఘా
[ 02-06-2024]
చెన్నైలో తల్లిపాల విక్రయాలపై నిఘా పెట్టేందుకు 18 బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆహారభద్రతాశాఖ అధికారులు తెలిపారు. చెన్నై మాధవరం ప్రాంతంలో చట్టవిరుద్ధంగా తల్లిపాలు సీసాల్లో పెట్టి విక్రయిస్తున్న ప్రైవేట్ మందుల దుకాణానికి
తాజా వార్తలు (Latest News)
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!