logo

ఎస్‌ కోటలో 22న చంద్రబాబు పర్యటన

శృంగవరపుకోట పట్టణంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన 22వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఖరారు అయింది. ముందుగా 21వ తేదీన పర్యటన ఉంటుందని సమాచారం వచ్చింది.

Published : 20 Apr 2024 04:00 IST

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: శృంగవరపుకోట పట్టణంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన 22వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఖరారు అయింది. ముందుగా 21వ తేదీన పర్యటన ఉంటుందని సమాచారం వచ్చింది. తర్వాత 22వ తేదీకి మారింది. ప్రజాగళం షెడ్యూÆల్‌ ప్రకారం.. జోన్‌-2లో 22న కాకినాడ పార్లమెంటు పరిధిలో మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేటలో సభ, సాయంత్రం 6 గంటలకు విశాఖ పార్లమెంటు పరిధిలో శృంగవరపుకోటలోని దేవీగుడి కూడలి సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రి స్థానికంగా బస చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరుసటి రోజు 23న ఉదయం 11 గంటలకు గజపతినగరంలో ఆయన మహిళలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు