logo

కూటమి అభ్యర్థులను గెలిపించాలి

పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 23 Apr 2024 21:34 IST

కొయ్యలగూడెం గ్రామీణం: పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  తెదేపా నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, భాజపా శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో పోలవరం అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజును, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు