ఆ నలుగురు నలిగిపోతున్నారు!
శ్మశానవాటిక సమస్య లేని గ్రామం లేదు. అంతిమ సంస్కారం ముగిసే వరకు నిలబడటానికి నిలువ నీడ ఉండదు. దప్పికతీర్చే వసతి కనిపించదు.
అంతిమ యాత్రలో అవస్థలెన్నో
శ్మశానవాటికల్లో వసతులు కరవు
ఆచంట వేమవరంలో రేవు పరిస్థితి ఇది
పాలకొల్లు, న్యూస్టుడే: శ్మశానవాటిక సమస్య లేని గ్రామం లేదు. అంతిమ సంస్కారం ముగిసే వరకు నిలబడటానికి నిలువ నీడ ఉండదు. దప్పికతీర్చే వసతి కనిపించదు. ఇంకొన్ని గ్రామాల్లో అన్నీ ఉన్నా స్నానం చేయడానికి సౌకర్యాల్లేవు. పలు గ్రామాల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఒక్కటే శ్మశానవాటిక ఉండటంతో సరిహద్దు తగాదాలున్నాయి. ఆక్రమణలతో కుచించుకుపోయినవి మరికొన్ని ఉన్నాయి.
- యలమంచిలిలో శ్మశానవాటిక లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులను గమనించి విశాఖపట్నంలో స్థిరపడిన దాత తాళ్లూరి సత్యనారాయణ 15 ఏళ్ల క్రితం ఎకరా స్థలం కొనుగోలు చేసి రూ.30 లక్షలు పైబడి వెచ్చించి శ్మశానవాటికను నిర్మించి గ్రామస్థులకు అప్పగించారు. గడిచిన అయిదేళ్లుగా గోదావరి కోతకు గురై దాత అందించిన శ్మశానవాటిక నదీగర్భంలో కలిసిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోయాడు. వసతులు కల్పించలేని ప్రభుత్వం కనీసం దాతలు నిర్మించినవాటికైనా రక్షణ కల్పించడంలో విఫలమవుతోంది. జిల్లాలోని వందలాది గ్రామాల్లో నెలకొన్న శ్మశానవాటికల సమస్యకు ఇదొక ఉదాహరణ.
- మొగల్తూరు మండలం పేరుపాలెంనార్తు పంచాయతీ పరిధి నెల్లిపల్లవపాలెంలో శ్మశానవాటికకు మార్గంలేక మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది. శ్మశానవాటికలకు మార్గాన్ని కూడా ఏర్పాటుచేయలేని ప్రభుత్వ పనితీరుకు ఇది అద్దం పడుతోంది.
ఫిర్యాదిచ్చినా పట్టించుకోరా.
పోడూరు, న్యూస్టుడే: పోడూరు రుద్రభూమిలో గ్రామంలోని చెత్తాచెదారం తీసుకెళ్లి వేయడంతో కుచించుకుపోయి కొన్ని సామాజిక వర్గాలవారికి చోటులేని పరిస్థితి. కవిటం, పోడూరు తదితర గ్రామాల్లో దాతల దాతృత్వంతో ఏర్పడిన శ్మశానవాటికలు తప్ప ప్రభుత్వం సౌకర్యాలు కల్పించినవి లేవు. వేడంగి, పి.పోలవరం, మట్టపర్రు తదితర గ్రామాల్లో రుద్రభూమి కోసం సామాజికవర్గాల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. అధికారుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగాయే తప్ప సమస్యలైతే పరిష్కారం కాలేదు.
పోడూరు శ్మశానవాటికలో చెత్తాచెదారం దాటుకొని మృతదేహాన్ని తీసుకువస్తూ..
ఆచంట, న్యూస్టుడే: ఆచంట, కోడేరు గోదావరి తీరం మినహా మిగిలిన 10 గ్రామాల్లో కనీస వసతులు లేవు. తాగడానికి మంచి నీళ్ల మాట ఎలా ఉన్నా, స్నానం చేయడానికి నీళ్లు కూడా లేని దుస్థితి. కూర్చోవడానికి షెడ్లు లేకుండా పోయాయి. ఆచంట వేమవరంలో నీళ్లు కూడా లేక కిలోమీటరున్నర నుంచి డబ్బాలతో నీళ్లు తెచ్చుకుని స్నానాలు చేయాల్సిన పరిస్థితి.
ఉమ్మడి జిల్లాలో గత అయిదేళ్లలో ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించిన స్పందన, ఇంటింటికీ మన ప్రభుత్వం కార్యక్రమాల్లో వందలాది వినతిపత్రాలు శ్మశానవాటికలకు సంబంధించినవే వచ్చినా అన్నింటినీ బుట్ట దాఖలు చేసిన దుస్థితి. ఫలితంగా అంతిమయాత్రకు వెళ్తున్న ఆ నలుగురుతో పాటు వెంట వెళ్లినవారంతా నలిగిపోతున్నారు. కొన్ని గ్రామాలతోపాటు పట్టణాల్లో శ్మశానవాటికలనే చెత్తను డంపింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. పాలకొల్లు పట్టణంలో రూ.కోట్లు వెచ్చించి తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన కైలాసవనం నిర్వహణ వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
పాలకొల్లు గ్రామీణ, న్యూస్టుడే: సగంచెరువు, లంకలకోడేరు గ్రామాల్లో శ్మశానం పక్కనే డంపింగ్ యార్డ్ ఉండటంతో అంతిమ సంస్కారాలకు వీలు లేకుండా ఉంది. కూర్చోవడానికి సదుపాయాలు లేవు.
నరసాపురం, మొగల్తూరు, న్యూస్టుడే: నరసాపురం పట్టణం పొన్నపల్లి వద్ద ఉన్న శ్మశానవాటికలో సరైన వసతి సౌకర్యం లేదు. గోదావరికి వరదొస్తే ఇబ్బందులు ఎదుర్కొనాల్సిందే. ఇక్కడ భవన నిర్మాణం పూర్తిచేయలేదు. మొగల్తూరు, పడమటిపాలెం తదితర ప్రాంతాల్లో స్నానాలు చేసేందుకు కాలువల వద్దకు వెళ్లాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకింత.. మాకింత!
[ 02-06-2024]
ఏలూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అక్రమాల ఊబిలో కూరుకుపోయింది. ఆస్తి పన్నుల విషయంలో అధికారుల చేతివాటంతో నగర పాలిక ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వాణిజ్య భవనాలను నివాసాలుగా చూపించడం, కొత్తగా కట్టిన నిర్మాణాలకు పన్నులు విధించకపోవడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. -
బంధంచర్ల అడవిలో చిరుతపులి సంచారం!
[ 02-06-2024]
టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫాస్ట్ పాసింజర్ విజయవాడ వరకే
[ 02-06-2024]
నరసాపురం - గుంటూరు మధ్య నడిచే ఫాస్ట్ పాసింజర్ రైలు జూన్ 30 వరకు విజయవాడ వరకే నడవనుందని రైల్వేశాఖాధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ మరమ్మతులు చేపట్టినందున ఈ రైలు సేవలను గత నెలలో రద్దుచేశారు. -
ఎండన పడ్డ పండుటాకులు
[ 02-06-2024]
మండుటెండలో పండుటాకులు విలవిల్లాడారు. ఒకటో తేదీ నుంచి ఇంటికే పింఛను అందించే వ్యవస్థలు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది. వేసవి కావడంతో లబ్ధిదారులందరూ పింఛను నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. -
ప్రతిపాదనలతో నీళ్లొదిలేశారు!
[ 02-06-2024]
వేసవిలో చేపట్టాల్సిన పంట కాలువల నిర్వహణ పనులకు ఆమోదం లభించకుండానే ఈ ఏడాది సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఈ సారి కీలకమైన పూడిక తీత పనులకు అవకాశం లేకుండాపోయింది. -
అంజనీసుతా.. అతులిత బలధామా!
[ 02-06-2024]
హనుమజ్జయంతిని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం వైభవంగా నిర్వహించారు. భీమవరంలోని పంచారామక్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి దేవస్థానం ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఉపాలయంలో ఉదయం స్వామికి అభిషేకాలు, లక్ష తమలపాకుల పూజలు, మూలమంత్ర హోమం చేశారు. -
4న భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భీమవరం పట్టణంలో ఈ నెల 4న ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు ఎస్పీ వి.అజిత తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే నిలుపుదల చేయాలని సూచించారు. -
దిక్కు లేని ర.భ.శాఖ
[ 02-06-2024]
ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖకు భవనం నిర్మించాలన్నా రహదారులు భవనాలశాఖ డిజైన్ చేసి అనుమతి ఇవ్వాల్సిందే. రహదారులు అభివృద్ధి నిర్వహణ అంతా ఆ శాఖపైనే ఆధారపడి ఉంటుంది. -
ఎప్పటిలాగే ఏకరవు!
[ 02-06-2024]
జడ్పీటీసీ సభ్యులు పలువురు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఏకరవు పెట్టారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తమ మండలాల్లోని సమస్యలను ప్రస్తావించారు. -
కళాశాలల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతులు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. కళాశాలల పునఃప్రారంభం నేపథ్యంలో వాటి ఆవరణలను పరిశీలిస్తే నాడు-నేడు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్