రైతుల గోడు పట్టడంలేదు!
వైయస్ఆర్ జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన రైతు శంకర్రెడ్డి ఆరబోసిన వరిధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిపోయింది. కారుమబ్బులు కమ్ముకోవడంతో తన వద్దనున్న చాలీచాలని రంధ్రాలున్న పట్ట (టార్పాలిన్)ను కప్పడంతో ఆ రైతు కష్టమంతా వర్షార్పణమైంది.
మూడేళ్లుగా నిలిచిన రాయితీ టార్పాలిన్ల సరఫరా
కల్లంలో పంటలు కాపాడుకోవడానికి అష్టకష్టాలు
శనగలపై కప్పిన చాలీ చాలని ప్లాస్టిక్ పట్ట
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, కమలాపురం వైయస్ఆర్ జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన రైతు శంకర్రెడ్డి ఆరబోసిన వరిధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిపోయింది. కారుమబ్బులు కమ్ముకోవడంతో తన వద్దనున్న చాలీచాలని రంధ్రాలున్న పట్ట (టార్పాలిన్)ను కప్పడంతో ఆ రైతు కష్టమంతా వర్షార్పణమైంది. తడిసిన పంటను తక్కువ ధరకు వదిలించుకోక తప్పలేదు. ఈయన ఒకరే కాదు ఉమ్మడి కడప జిల్లాలో రైతులందరిదీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, రానున్నది వర్షాకాలం కావడంతో పట్టలు అందుబాటులో లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయశాఖ వివిధ పథకాలకు మంగళం పాడేసింది. రైతులకు ఉపయుక్తమైనవి అమలు చేయకుండా నిలిపివేసింది. ఇందులో అత్యంత ప్రయోజనకరమైన పట్టలు మూడేళ్ల కింద వరకు 50 శాతం రాయితీపై రైతులకు అందజేసింది. ఒక్కొక్క రైతుకు రెండేసి పట్టలు ఇవ్వడంతో మూడేళ్లపాటు వాటిని వినియోగించుకునేవారు. చివరిగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రైతులు అబ్ధి పొందారు. అనంతరం ప్రభుత్వం రాయితీ పట్టలకు తిలోదకాలిచ్చింది.
* ఉమ్మడి కడప జిల్లాలో ఏటా 25 వేల పట్టలు రాయితీపై సరఫరా చేసేవారు. ప్రస్తుతం వైయస్ఆర్ జిల్లాలో 14 వేలు, అన్నమయ్య జిల్లాకు 11 వేలు వరకు సరఫరా చేయాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రస్తుతం రైతులు మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇవి నాణ్యత, మన్నిక అంతగా ఉండకపోవడంతో త్వరగా చిరిగిపోతున్నాయి. పేద రైతులు సిమెంటు, రసాయన, దాణా బస్తాలతో తయారు చేసిన సాధారణ పట్టలు వినియోగిస్తున్నారు. వర్షానికి నీరు దిగి పంట తడిసిపోతోంది. ఆరబెట్టిన పంటను పోగు చేసిన రాశులపై కప్పేందుకు పట్టలు అందుబాటులో లేక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వైయస్ఆర్ జిల్లాలో ఇటీవల మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు పలుచోట్ల ధాన్యం, రాగి, నువ్వు తదితర పంట తడిసిపోయాయి.
* ఏటా అక్టోబరు, నవంబరులలో ఖరీఫ్ పంట చేతికొస్తుంది. పంట కోసి కల్లాల్లో ఆరబెట్టి మార్కెట్లో విక్రయిస్తుంటారు. రబీ పంట మార్చి, ఏప్రిల్, మేలలో కోతకొస్తుంది. దాదాపు ఆరేడు నెలల పాటు నూర్పిడి చేసిన పంటలు జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవాలి. ఆ సమయంలో తుపాన్లు, అకాల వర్షం వస్తే కాపాడుకోవడానికి పట్టలు అత్యవసరం. నూర్పిడి సమయంలో నేలపై పట్టలేసి పంటను నాణ్యతగా సేకరించుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. సన్న, చిన్న కారు రైతులు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా స్వతహాగా మార్కెట్లో రూ.ఆరేడు వేలు ఖర్చు చేయడం కష్టమవుతోంది. కొందరు రైతులు బాడుగకు తెచ్చు కుంటున్నారు. ఈ భారం మోయలేక రాయితీపై ఇచ్చే వాటి కోసం మూడేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు.
ఎంతో ప్రయోజనం...
ఖరీఫ్, రబీలో వరి, రాగి పంటలు పండిస్తున్నాను. యంత్రంతో కోత కోసిన పచ్చి ధాన్యం వారం రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ సమయంలో వర్షమొస్తే పంట తడిసి నష్టపోతున్నాం. ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రాయితీపై పట్టలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. బయట కొనుగోలు చేసేవి అంత నాణ్యతగా ఉండడంలేదు. -సుబ్బరాయుడు, రైతు, కమలాపురం
వానొచ్చిందంటే భయమే...
ఏటా నాలుగైదు ఎకరాల్లో వరి, ఆరెకరాల్లో మినుము పంటలు సాగు చేస్తున్నాను. వానొచ్చిందంటే భయపడతున్నాం. పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం రాయితీపై పట్టలు సరఫరా చేయాలి. మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేకపోతున్నాం. -విజయభాస్కర్రెడ్డి, కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం
ఉద్యానశాఖ అమలు చేస్తోంది...
వ్యవసాయశాఖ రాయితీపై టార్పాలిన్లను రైతులు అందించడలేదు. ఉద్యానశాఖ మాత్రమే అమలు చేస్తోంది. అవసరమైన రైతులు ఉద్యానశాఖ ద్వారా పొందవచ్చు.
-నాగేశ్వరరావు, డీఏవో, వైఎస్ఆర్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ది రాక్షస గుణం... పేదల ప్రాణాలు పణం..!
[ 03-05-2024]
నిప్పులు చెరుగుతున్న భానుడి భగభగలతో పండుటాకులు విలవిలలాడిపోయారు... ప్రాణాలు హరిస్తున్న వడగాలులతో అల్లాడిపోయారు... భరించలేని ఉక్కపోతతో నిలువునా ఉడికిపోయారు... ఇదీ జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల వద్ద గురువారం పింఛనుదారుల దయనీయ పరిస్థితి. -
ఆ ముగ్గురు మారీచులతో కడప నాశనం!
[ 03-05-2024]
ముగ్గురు మారీచులు కలిసి కడప నగరాన్ని సర్వనాశనం చేశారంటూ తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. -
నాయకులారా... బడి దుస్థితి చూడరా
[ 03-05-2024]
మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 45 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన స్థలంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించారు. -
కొండాపురంలో రైళ్లు నిలిపేలా కృషి
[ 03-05-2024]
కొండాపురం రైల్వే నిలయంలో అన్ని రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. -
రాచమల్లుకు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 03-05-2024]
రైతు కంట కన్నీరు వచ్చేలా మోసం చేసిన వారు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ కోవకే చెందిన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదురెడ్డి రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల శనగ రైతులను మోసం చేశారని, విజ్ఞులైన ఓటర్లారా ఎమ్మెల్యేకు ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం విడుదలైన కరపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఎంపీగా షర్మిలకు, ఎమ్మెల్యేగా పుట్టాకు ఓటేయండి: డీఎల్
[ 03-05-2024]
రాష్ట్రం కోల్పోయిన ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొట్లాడుతున్నారని, ఆమెకే ఓటు వేయాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. -
ఒక్కఛాన్స్ అన్న జగన్... జనం పాలిట విలన్
[ 03-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ పాదయాత్రలో జనం ముందుకు వచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే వారి పాలిట విలన్గా మారారని తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి విమర్శించారు. -
ప్రచారభేరి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో దోపిడీ దొంగల ముఠాలను తయారు చేసి వనరుల విధ్వంసానికి పాల్పడిందని 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెల్లిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే పరిపాలనలో అనుభవ శీలి అయిన చంద్రబాబు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూటమి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. -
గడికోట... ఓ భూబకాసురుడు!
[ 03-05-2024]
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఓ భూబకాసురుడని, రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో భూములను కాజేసి సుమారు రూ.200 కోట్లు కాజేశారని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. -
తెదేపాకు గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబుకు కడపకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ