వసతులు లేక ఇక్కట్లు
పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు.
రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు తప్పని అవస్థలు
ఇళ్ల మధ్య మురుగు దుస్థితి
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు. దరఖాస్తులదారుల్లోంచి లక్కీ డ్రా విధానంలో అర్హులను ఎంపికచేసి సుమారు 1,500 కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు. ఇది జరిగి దాదాపు ఆరేడు నెలలవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ ప్రాంతంలో ఇప్పటికీ సరైన వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మురుగుమయం..
పెద్దమొత్తంలో కుటుంబాలు నివాసం ఉండటంతో ఇళ్ల నుంచి వెలువడుతున్న మురుగును సక్రమంగా బయటకు తరలించేందుకు ఏర్పాటుచేసిన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా మురుగంతా బయటకు చేరి ఇళ్లమధ్య నిల్వఉంటోంది. ఫలితంగా దోమలబెడద పెరుగుతోంది. చెత్తసేకరణకు మున్సిపల్ వాహనాలు సక్రమంగా వచ్చిన దాఖలాలు లేకపోవడంతో ఆరుబయట పడేస్తున్నారు. దీనివల్ల చెత్త పోగవుతోంది. మొత్తంగా పారిశుద్ధ్యం దెబ్బతినడంతో వ్యాధుల వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.
రోడ్డు దుస్థితి ఇలా..
రహదారుల్లేవు..
కాలనీలో అంతర్గత రహదారుల్లేవు. మట్టిరోడ్లే కావడంతో చాలావరకు గుంతలమయంగా మారాయి. వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. మహాలక్ష్మి ఆలయ సమీపంలోని రెండుపడక గదుల ఇళ్లకు వెళ్లే ప్రధానమార్గం చూస్తే విషయం అర్థమవుతోంది. దీనికితోడు మురుగునీరు చేరడంతో ఈ రోడ్డువెంట వాహనాలను నడపడం చోదకులకు నరకప్రాయంగా మారుతోంది. విద్యుద్దీపాల సమస్య లేకపోయినా.. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి వెళ్లే ప్రధాన రోడ్డులో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన రోజు మినహా ఎప్పుడూ వెలగడం లేదని, ఫలితంగా ఈ మార్గమంతా అంధకారం నెలకొంటోందని పేర్కొంటున్నారు.
తాగునీటికి..
నూతనంగా ఏర్పడిన ఈ కాలనీల్లో నీటి అవసరాలకు ఇబ్బందులు తప్పటం లేదు. మిషన్ భగీరథ పథకం కింద నీటి సరఫరా పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొన్ని సందర్భాల్లో నీరు రంగుమారి వస్తోందని, ఫలితంగా తాగేందుకు అవకాశం లేకుండాపోతోందని మండిపడుతున్నారు. చేతిపంపులు సరిపడా ఏర్పాటుచేయకపోవడంతో ఉన్నచోట నీటికోసం పడిగాపులు తప్పటం లేదు. కొంతమంది బ్లాక్ల వారీగా తమ ప్రాంతంలో సొంత ఖర్చులతో బోర్లు వేయించుకొని నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాంసిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
మండలంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
రైతులకు పత్తి విత్తనాల పంపిణీ
[ 02-06-2024]
మండల కేంద్రంలో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాశి -659 పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. -
పాలన చేరువ.. కావాలి చొరవ
[ 02-06-2024]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయ్యింది. ఈ పదేళ్ల కాలంలో జిల్లా రూపురేఖలు మారినా ఇంకా సౌకర్యాల కోసం విషయంలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. -
అభివృద్ధి పథం.. ఆశల సమాహారం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటి(జూన్ 2)తో పదేళ్లు పూర్తవుతోంది. రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. -
ఒకే విత్తనంపై ఆధారపడొద్దు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి. ఒకే రకమైన విత్తనానికి డిమాండ్ కనిపిస్తోంది. డీలర్ల మాయాజాలం అంతుచిక్కడం లేదు. -
భీం స్ఫూర్తి.. వెలగాలి ప్రగతి దీప్తి!
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పది వసంతాలు పూర్తి చేసుకుని నేటితో 11వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. కుమురం భీం స్ఫూర్తితో కొత్త జిల్లా ఆవిర్భవించింది. -
భగ్గుమన్న భానుడు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
హత్య చేసి.. కాల్చేశారు..
[ 02-06-2024]
గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేసిన ఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే