ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.
భార్య మృతి, ప్రాణాలతో బయటపడిన భర్త
పుష్పలత
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. భార్య మృతిచెందగా, భర్త ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పట్టణ ఎస్సై రాజేశ్వర్గౌడ్ తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని ప్రియదర్శినినగర్కు చెందిన కృష్ణమూర్తి (60), పుష్పలత (56) దంపతులు. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. కృష్ణమూర్తి ఉద్యోగం చేస్తూనే స్థిరాస్తి వ్యాపారం, చీటీల నిర్వహణ చేపట్టేవారు. ఈ క్రమంలో అప్పుల్లో కూరుకుపోయారు. వాటిని తీర్చేమార్గం కనిపించకపోవడంతో మానసికంగా ఆందోళనకు గురయ్యారు. దీనికితోడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వారి కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య ఏర్పడిన మనస్పర్థలతో దాదాపు ఏడాదిగా కోడలు ఇంటికి రాకపోవడం వారిని మరింత కుంగదీసింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మూడురోజుల క్రితం బాసర అమ్మవారి క్షేత్రానికి వెళ్లిన వీరిద్దరూ ఆదివారం రాత్రి నిర్మల్కు తిరిగొచ్చారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పట్టణంలోని బంగల్పేట్ వినాయకసాగర్లో దూకారు. భార్య నీటమునిగి చనిపోగా, భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, గమనించిన స్థానికులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్మల్ లో ఘనంగా ఆదివారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, అధికారులు అమరవీరుల స్తూపానికి జ్యోతి వెలిగించి, పూలు జల్లి నివాళులర్పించారు. -
కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ అవతరణ వేడుకలు
[ 02-06-2024]
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షి షా జాతీయ జెండా ఎగురవేయగా.. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
రామకృష్ణాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఒకే రకం విత్తనాలు వాడొద్దు
[ 02-06-2024]
రైతులు ఒకేరకం విత్తనాలు వాడొద్దని, అన్ని రకాల విత్తనాలు సాగులో వినియోగించాలని ఏఈవో సాయి ప్రసాద్ తెలిపారు. -
తాంసిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు
[ 02-06-2024]
మండలంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
రైతులకు పత్తి విత్తనాల పంపిణీ
[ 02-06-2024]
మండల కేంద్రంలో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాశి -659 పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. -
పాలన చేరువ.. కావాలి చొరవ
[ 02-06-2024]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయ్యింది. ఈ పదేళ్ల కాలంలో జిల్లా రూపురేఖలు మారినా ఇంకా సౌకర్యాల కోసం విషయంలో ఎదురుచూడాల్సిన పరిస్థితి. -
అభివృద్ధి పథం.. ఆశల సమాహారం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటి(జూన్ 2)తో పదేళ్లు పూర్తవుతోంది. రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. -
ఒకే విత్తనంపై ఆధారపడొద్దు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి. ఒకే రకమైన విత్తనానికి డిమాండ్ కనిపిస్తోంది. డీలర్ల మాయాజాలం అంతుచిక్కడం లేదు. -
భీం స్ఫూర్తి.. వెలగాలి ప్రగతి దీప్తి!
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పది వసంతాలు పూర్తి చేసుకుని నేటితో 11వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. కుమురం భీం స్ఫూర్తితో కొత్త జిల్లా ఆవిర్భవించింది. -
భగ్గుమన్న భానుడు
[ 02-06-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
హత్య చేసి.. కాల్చేశారు..
[ 02-06-2024]
గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని హత్యచేసి దహనం చేసిన ఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్