పోలవరం నిర్వాసితులను మోసంచేసిన వైకాపా
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు.
అరకు ఎంపీ అభ్యర్థిని గీత
పెదభీంపల్లి ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీ-1 వద్ద నిర్వాసితుల సమస్యలు వింటున్న ఎంపీ అభ్యర్థి గీత
దేవీపట్నం, గంగవరం, న్యూస్టుడే: కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్, గంగవరం మండలం మొల్లేరు పంచాయతీల్లో ఆమె మంగళవారం పర్యటించారు. రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు వైకాపా ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.పది లక్షలు ఇస్తామని మోసం చేసిందన్నారు. గిరిజనులు, గిరిజనేతరులను మోసం చేసిన ఒక సైకో రంపచోడవరంలో ఉన్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి గెలుపుతోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు, ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారమవుతాయన్నారు. పెదభీంపల్లి పునరావాస కాలనీ-1లో ముంపు గ్రామాలైన డి.రావిలంక, పరగసానిపాడు, బోడిగూడెం నిర్వాసితులు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గీత ఎదుట మొరపెట్టుకున్నారు. ఇందుకూరు-1 ఆర్అండ్ఆర్ కాలనీలో ఆమె పర్యటించి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంగవరం మండల తెదేపా, జనసేన అధ్యక్షులు పాము అర్జున్, కుంజం సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
తెదేపాలో చేరికలు
రాజేశ్వరి, శిరీషాదేవి సమక్షంలో తెదేపాలోకి చేరుతున్న నిమ్మలగూడెం గ్రామస్థులు
చింతూరు: మండలంలోని నిమ్మలగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో సుమారు 242 కుటుంబాలు తెదేపాలోకి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి, తెదేపా నేతలు ఇల్లా చిన్నారెడ్డి, జమాల్ఖాన్, సోడె శ్రీనివావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం జరగనుంది. జిల్లాలోని మూడు శాసనసభ, అరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల లెక్కింపునకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ విజయ సునీత, -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
భీమిలి తీరంలో విధ్వంసం విజయవంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
తపాలా బీమాతో ధీమా!
[ 02-06-2024]
అనుకోని ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే వారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయం. భార్య/భర్త మరణిస్తే వారి పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. -
ఆఖరి మజిలీకి అవస్థలు
[ 02-06-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసి.. పునరావాస కాలనీలకు వచ్చిన ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఎవరైనా మృతిచెందితే వారి ఆఖరి మజిలీకి తీవ్ర అవస్థలు తప్పడం లేదు. -
పిడుగుపాటుకు క్రీడాకారుడి మృతి
[ 02-06-2024]
పద్మాపురం సమీపంలో శనివారం పిడుగుపడటంతో గిరి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. -
ఎండల తీవ్రతకు పైపులైన్ పేలుడు!
[ 02-06-2024]
ఛత్తీస్గడ్, ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు వెళుతున్న ఐరన్ఓర్ పైపులైన్ శుక్రవారం అర్ధరాత్రి పేలిపోయింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని దిగజనబ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు!
[ 02-06-2024]
కూటమికే ప్రజలు పట్టం కట్టనున్నారని, సర్వేలన్నీ అవే చెబుతున్నాయని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!