గొడవలపై ఉక్కుపాదం మోపండి
‘ఎన్నికల నిర్వహణను సవాల్గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా పేర్కొన్నారు.
జిల్లా అధికారులతో ప్రత్యేక పరిశీలకుడు దీపక్మిశ్రా
మాట్లాడుతున్న దీపక్మిశ్రా, కలెక్టర్ వినోద్కుమార్, డీఐజీ అమ్మిరెడ్డి, పరిశీలకులు
అనంతపురం(శ్రీనివాస్నగర్): ‘ఎన్నికల నిర్వహణను సవాల్గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా పేర్కొన్నారు. ఆదివారం ఆయన అనంత నగరానికి వచ్చారు. నగరంలో బస చేసిన ఓ ప్రైవేటు హోటల్లో ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్సు హాలులో సాధారణ, పోలీసు పరిశీలకులు, కలెక్టర్, జేసీ, ఇతర ఐఏఎస్ అధికారులు, అదనపు ఎస్పీ, డీఎస్పీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికలను ఉన్నతంగా నిర్వహించడం మన బాధ్యతగా భావించాలన్నారు. వెబ్ కాస్టింగ్, క్విక్ రెస్పాన్స్ టీఎం మానిటరింట్, హోమ్ ఓటింగ్ వంటి ప్రక్రియలను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ.. 20.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ అమిత్బర్దర్, సాధారణ, పోలీసు పరిశీలకులు మనీష్ సింగ్, అజయ్నాథ్ ఝు, రవికుమార్, విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే, జేసీ కేతన్గార్గ్, జడ్పీ సీఈఓ నిదియాదేవి, నగర కమిషనర్ స్వరూప్, సహాయ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీఆర్ఓ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచిగా వండాలంటే.. శుచి, శుభ్రతకు చోటేది?
[ 02-06-2024]
మధ్యాహ్న భోజనం నాణ్యమైన రుచులతో వడ్డించాలని ఆర్భాటం చేసిన అధికారులు వండటానికి శుచి, శుభ్రతతో కూడిన చోటు కల్పించడంలో విఫలమవుతున్నారు. సదుపాయమే లేనిచోట రుచికరమైన వంటలెలా తయారవుతాయోనన్న ఆలోచనను విస్మరించారు. -
కూటమి వైపే ఓటర్లు!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెదేపా నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగని కబ్జా పర్వం.. కుంటలు మాయం
[ 02-06-2024]
గుత్తి శివారులోని చాకలి కుంటలో కొంత భాగాన్ని వైకాపా నాయకులు ఆక్రమించారు. బంకులు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. ఈవిషయం అధికారులకు తెలిసి బంకులను పక్కకు తోసేశారు. -
తొలుత సిఫార్సులతో నియామకం.. తర్వాత కాంట్రాక్టు హోదా
[ 02-06-2024]
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగాల నియామకం వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, సహాయార్యుల కొరత కారణంగా టీచింగ్ అసిస్టెంట్లు, అతిథి, తాత్కాలిక అధ్యాపకులను నియమించుకుంటున్నారు. -
జిల్లా అంతటా నిఘా
[ 02-06-2024]
‘ఈనెల 4న ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. జిల్లాంతటా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ప్రత్యేక నిఘా ఉంటుంది’ అని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ గౌతమిశాలి స్పష్టం చేశారు. -
కొందరికే పింఛను సొమ్ములు
[ 02-06-2024]
బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవాలని చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు ఉంటాయని ఉదయం 9 గంటలకే బ్యాంకులకు చేరుకున్నారు. సొమ్ము పడలేదని సచివాలయంలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో మళ్లీ అక్కడకు పరుగులు తీశారు. -
పేదలకు బియ్యంతో సరి
[ 02-06-2024]
పౌర సరఫరాల ద్వారా నిరుపేదలకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అరకొరగా పంపిణీ చేసే కందిపప్పు, గోధుమ, రాగిపిండిని పూర్తిగా నిలిపివేసింది. -
దిక్కూ మొక్కూ లేని స్థితిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
[ 02-06-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దిక్కుమొక్కులేని స్థితిలో కునారిల్లిపోయాయి. పనులు లేవు, నిధుల మంజూరు లేదు, అభివృద్ధి లేదు అన్నది సుస్పష్టం. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి (ఏఎంసీ) పాలకవర్గ నియామకం ఊసే మరిచిపోయారు. -
భద్రతా వలయంలో జేఎన్టీయూ
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో పోలీసు వర్గాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య