నిధులు, నీళ్లు ఇవ్వకుండా.. ఊళ్లెలా నిర్మిస్తావు జగన్
ఇళ్లుకాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పేరుపై నిర్మిస్తున్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
తన పేరుమీదున్న కాలనీలనూ గాలికొదిలేసిన సీఎం
ఇళ్లుకాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ పదేపదే గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పేరుపై నిర్మిస్తున్న కాలనీల్లో సమస్యలు తాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నిధులు విడుదల చేయకపోవడంతో మూడేళ్లుగా నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి. ఇళ్లు నిర్మించకపోతే రద్దుచేసి మరొకరికి కేటాయిస్తామంటూ కొన్నిచోట్ల లబ్ధిదారులను భయపెట్టడంతో కొంతమంది అష్టకష్టాలుపడి అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేసుకున్నారు. తీరా.. అక్కడికివెళ్లి నివసిస్తే మౌలిక వసతులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ పాత స్థలాలకు వచ్చి అద్దె ఇంట్లో చేరుతున్నారు. నీటి సమస్యతో నిర్మాణాలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి.
న్యూస్టుడే అనంతపురం(రాణినగర్)
తూతూమంత్రంగా ట్యాంకుల ఏర్పాటు
గుత్తి: గుత్తి శివారులోని నేమితాబాద్ జగనన్న కాలనీలో నీటిపథకం అధ్వానంగా ఉంది. రూ.10 లక్షలు వెచ్చించి గుంతకల్లు ప్రజాఆరోగ్య విభాగం ఇంజినీర్లు 14 మినీ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కాలనీలో బోరు వేసి పైపులైన్ అమర్చి ట్యాంకులను అనుసంధానం చేశారు. గృహనిర్మాణానికి అవసరమైన నీటికోసం పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేయగా అధికారులు తూతూ మంత్రంగా ట్యాంకులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ట్యాంకులకు ఏర్పాటు చేసిన పైపులు ఊడిపోయాయి. పైపులైన్ ఎక్కడపడితే అక్కడ లీకేజీ అవుతోంది. నిధుల్లేక పనులు ముందుకు సాగడం లేదు. కాలనీలో చేరినవారికి నీటి వసతి లేక అల్లాడిపోతున్నారు.
నెరవేరని సొంతింటి కల
ఓబుళదేవరచెరువు: మండలంలో 14 పంచాయతీలున్నాయి. ప్రభుత్వ భూములున్న చోట మాత్రమే జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. మిగిలిన గ్రామాల్లో స్థలాలు కొనుగోలు చేయలేక చేతులెత్తేశారు. ఇచ్చినవి కూడా ఊరికి దూరంగా ఉండటంతో ఇల్లు కట్టుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఓబుళదేవరచెరువు పంచాయతీలో ఊరికి 2 కి.మీ. దూరంలో గుట్టలో 40 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇందులో ఒక ఇల్లు మాత్రమే నిర్మాణం చేపట్టి గోడల వరకు పూర్తైయిన తర్వాత అర్ధాంతరంగా అపివేశారు. కొండకమర్ల, గాజుకుంటపల్లిలో ఊరికి దూరంగా గుట్టలో ఇవ్వడంతో సగం మందికి పైగా ఇళ్లు నిర్మించుకోవడానికి వెనుకడుగు వేశారు. ఇల్లు నిర్మించుకోవాలంటే లబ్ధిదారులు ఒక్కొక్క ట్యాంకరుకు రూ.500 వెచ్చించాల్సి వస్తోంది.
రూ.3 కోట్ల ఖర్చు వృథానే!
గుంతకల్లు: పట్టణ శివారులో గుంతకల్లు - పామిడి రహదారికి ఇరువైపులా ఉన్న జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకోవడానికి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో నీటిని అందించడానికి ప్రభుత్వం రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసి పలుచోట్ల బోర్లు తవ్వించారు. కుళాయిల నీటిని సరఫరా చేయడానికి 40 వరకు ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఆ బోర్లలో నీరు లభించక, విద్యుత్తు మోటార్లు పనిచేయక ట్యాంకులు వృథాగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల ట్యాంకులకు పైపులు, కుళాయిలు అమర్చలేదు. సగానికి పైగా ట్యాంకులు నీటిని అందించడం లేదు. జగనన్న కాలనీలో మొత్తం లేఅవుట్లు 11 ఉండగా 3,442 ఇళ్లు మంజూరుకాగా 1142 మాత్రమే పూర్తయ్యాయి.
నాలుగు నెలలుగా సమస్య
కళ్యాణదుర్గం గ్రామీణం: పట్టణంలోని కురాకులతోట వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నాలుగు నెలలుగా నీటి సమస్య పట్టి పీడిస్తోంది. బోరుబావులు ఉన్నా అందులో నీటిమట్టం తగ్గి నీరు రావడం లేదు. 2021 జనవరి 6వ తేదీన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఆ కాలనీలో 1,590 ఇళ్ల స్థలాలకుగాను 1,563 మంజూరయ్యాయి. ఇందులో లబ్ధిదారులు నిర్మించుకొన్నవి 365, రూప్లెవెల్ 103, లెంటెల్ లెవెల్లో 82, పునాదుల దశలో 518, బీబీఎల్ దశలో 115 ఇళ్లు ఉన్నాయి. 100 మంది వరకు నివాసం ఉంటున్నారు. ట్యాంకర్లకు అద్దె చెల్లించి ఐదారు రోజులకోసారి నీటిని తెచ్చుకొంటున్నారు.
అరకొర నీరే దిక్కు
ఉరవకొండ: ఉరవకొండలోని జగనన్న కాలనీల్లో తాగునీటికి లబ్ధిదారులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పట్టణంలో కొలిమి ప్రాంతంలోనూ, రాయంపల్లి దారిలోనూ, బాలికల గురుకులం సమీపంలో జగనన్న కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 2,860 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. కాలనీల పరిధిలో సరైన వసతులు లేకపోయినా, ఇళ్లను నిర్మించుకోకుంటే పట్టాలు రద్దు చేస్తామంటూ వైకాపా నాయకులు, అధికారులు బెదిరించి లబ్ధిదారులతో ఇళ్లను నిర్మాణం చేసుకునేలా చేశారు. చాలామంది నీటి సదుపాయం లేక పోయినా నీటిని కొని ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ కాలనీల్లో ప్రభుత్వం బోర్లను వేసి, తాగునీటి పైపులైన్లు, కుళాయిలను ఏర్పాటు చేయించింది. ఆ ప్రక్రియ ముగిసి కూడా ఏడాది గడిచిపోయినా, కుళాయిలకు అరకొరగా నీరు వస్తున్నాయి. అవి కూడా తాగడానికి పనికి రావు. దీంతో కుళాయిలు అలంకార ప్రాయంగా మారాయి.
ట్యాంకరు నీటికి రూ.500 వెచ్చించాల్సిందే..
ధర్మవరం: జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించుకునేందుకు సరైన వసతులు కల్పించలేదు. ఇళ్ల నిర్మాణానికి నీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. పట్టణ శివార్లలోని పోతులనాగేపల్లి జగనన్న కాలనీ వద్ద బోర్లు వేయించారు. బోర్ల నుంచి ట్యాంకులకు నీరు అందకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు ట్యాంకరు రూ.500 వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. రేగాటిపల్లి, ఎల్1, ఎల్3, రేగాటిపల్లి లేఅవుటË్ ప్రాంతాల్లోనూ నీటిసౌకర్యం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి నీటి కొనుగోలుకే రూ.5వేలు వరకు వెచ్చించాల్సి వస్తోంది. కుణుతూరు జగనన్న కాలనీలో 2 బోరుబావులు తవ్వించారు. వాటిలోనూ అరకొర నీరు వస్తుండడంతో ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం చాలడం లేదు. కాలనీలో 1356 గృహాలు మంజూరు కాగా ఇప్పటివరకు 67 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. రేగాటిపల్లి లేఅవుటË్లో 1,850 గృహాలు మంజూరు కాగా 209 మాత్రమే నిర్మాణం పూర్తి అయ్యాయి. పోతులనాగేపల్లి, జగనన్న కాలనీ వద్ద 5,319 గృహాలు మంజూరు కాగా 1,184 మాత్రమే పూర్తయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచిగా వండాలంటే.. శుచి, శుభ్రతకు చోటేది?
[ 02-06-2024]
మధ్యాహ్న భోజనం నాణ్యమైన రుచులతో వడ్డించాలని ఆర్భాటం చేసిన అధికారులు వండటానికి శుచి, శుభ్రతతో కూడిన చోటు కల్పించడంలో విఫలమవుతున్నారు. సదుపాయమే లేనిచోట రుచికరమైన వంటలెలా తయారవుతాయోనన్న ఆలోచనను విస్మరించారు. -
కూటమి వైపే ఓటర్లు!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెదేపా నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఆగని కబ్జా పర్వం.. కుంటలు మాయం
[ 02-06-2024]
గుత్తి శివారులోని చాకలి కుంటలో కొంత భాగాన్ని వైకాపా నాయకులు ఆక్రమించారు. బంకులు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. ఈవిషయం అధికారులకు తెలిసి బంకులను పక్కకు తోసేశారు. -
తొలుత సిఫార్సులతో నియామకం.. తర్వాత కాంట్రాక్టు హోదా
[ 02-06-2024]
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో బోధన ఉద్యోగాల నియామకం వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, సహాయార్యుల కొరత కారణంగా టీచింగ్ అసిస్టెంట్లు, అతిథి, తాత్కాలిక అధ్యాపకులను నియమించుకుంటున్నారు. -
జిల్లా అంతటా నిఘా
[ 02-06-2024]
‘ఈనెల 4న ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. జిల్లాంతటా ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయి నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా 315 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ప్రత్యేక నిఘా ఉంటుంది’ అని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ గౌతమిశాలి స్పష్టం చేశారు. -
కొందరికే పింఛను సొమ్ములు
[ 02-06-2024]
బ్యాంకులకు వెళ్లి పింఛను తీసుకోవాలని చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంకులు ఉంటాయని ఉదయం 9 గంటలకే బ్యాంకులకు చేరుకున్నారు. సొమ్ము పడలేదని సచివాలయంలోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించడంతో మళ్లీ అక్కడకు పరుగులు తీశారు. -
పేదలకు బియ్యంతో సరి
[ 02-06-2024]
పౌర సరఫరాల ద్వారా నిరుపేదలకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా రేషన్ సరకుల్లో కోత విధిస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు అరకొరగా పంపిణీ చేసే కందిపప్పు, గోధుమ, రాగిపిండిని పూర్తిగా నిలిపివేసింది. -
దిక్కూ మొక్కూ లేని స్థితిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు
[ 02-06-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దిక్కుమొక్కులేని స్థితిలో కునారిల్లిపోయాయి. పనులు లేవు, నిధుల మంజూరు లేదు, అభివృద్ధి లేదు అన్నది సుస్పష్టం. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి (ఏఎంసీ) పాలకవర్గ నియామకం ఊసే మరిచిపోయారు. -
భద్రతా వలయంలో జేఎన్టీయూ
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో పోలీసు వర్గాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా చర్యలను పూర్తిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్యాంక్బండ్పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?
-
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రత పెంపు
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!
-
బ్రేకింగ్: ఏపీ ఎగ్జిట్ పోల్స్... మై యాక్సిస్ ఇండియాటుడే అంచనాలివే