ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రభావతిదేవి తెలిపారు.
వ్యాక్సిన్ వేస్తున్న డీఎంహెచ్వో ప్రభావతిదేవి
చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్టుడే: హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రభావతిదేవి తెలిపారు. చిత్తూరు నగరంలోని టెలిఫోన్కాలనీ అర్బన్ ఆరోగ్య కేంద్రంలో సోమవారం ముస్లింలకు వ్యాక్సిన్ వేశారు. ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకున్నట్లు ధ్రువపత్రం లేనిదే యాత్రకు అనుమతిం చరని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఇన్ల్ఫూయంజా, మెనిమ్ జైటీస్, పోలియో టీకా, 65 సంవత్సరాల లోబడి ఉన్నవారికి మెనిమ్ జైటీస్, పోలియో వ్యాక్సిన్లు వేస్తారన్నారు. ఈ వ్యాక్సిన్లు ఊపిరితిత్తులు, మెదడు, పోలియో వ్యాధి రాకుండా కాపాడుతుందని, ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. ఏడో తేదీన వి.కోట ప్రభుత్వాసుపత్రి, 8న తూర్పు మొగసాల అర్బన్ ఆరోగ్య కేంద్రం(పుంగనూరు)లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. హజ్యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా టీకాల అధికారి రవిరాజు, మత పెద్దలు ఎలియాజ్, ఉబేడ్షరీఫ్, వైద్యులు వినోద్ప్రభు, రెడ్డప్ప పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. ఆడితే ఖతం
[ 02-06-2024]
శాసనసభ పోరులో గెలుపోటములపై పందేల వేట సాగిస్తున్నారు. ఈ ఊబిలోకి సామాన్యులను సైతం వైకాపా ముఠాలు దించుతున్నాయి. వారిని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. -
వసతి గృహాల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ముఖ్యమంత్రి జగన్ ఏ సభ, సమావేశం జరిగినా మైక్ పట్టుకుని ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు’ అంటూ పల్లవి పాడుతుంటారు. -
లెక్కలు తేలే రోజుకు కౌంట్డౌన్
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలైన ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వసన్నద్ధమయ్యారు. -
ఖాతాల్లోనే పింఛన్ మొత్తం
[ 02-06-2024]
సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారుల కష్టాలు జూన్లోనూ కొనసాగాయి. ఎన్నికల్లో లబ్ధే లక్ష్యంగా ప్రభుత్వం రెండు నెలలుగా పింఛనర్లను ఇబ్బందులకు గురిచేయడంపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. -
తెదేపా సానుభూతిపరులపై అదే ప‘నిఘా’
[ 02-06-2024]
దాడులకు తెగబడే వారిని నియంత్రించాల్సిన పోలీసులు.. బాధితులపైనే నిఘా పెడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్పై పేచీ తొలగినట్లేనా?
[ 02-06-2024]
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇక అందరి కళ్లు పోస్టల్ బ్యాలెట్లపై పడనున్నాయి. -
ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలి
[ 02-06-2024]
చిత్తూరు లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపులో అధికారులు జాగ్రత్తగా ఉండాలని జేసీ శ్రీనివాసులు అన్నారు. -
విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి రెండు కాళ్లు కోల్పోయిన విద్యార్థి
[ 02-06-2024]
బంగారు భవిష్యత్తు కలిగిన ఓ విద్యార్థి విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి తన రెండు కాళ్లు కోల్పోయాడు. -
గాలివాన బీభత్సం
[ 02-06-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం పెనుగాలుల వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఎండ వేడిమి వల్ల ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. -
పోలీసులు సంసిద్ధంగా ఉండండి: ఎస్పీ
[ 02-06-2024]
చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కళాశాలలో ఈ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పోలీసు అధికారులు సంసిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో కూటమిదే విజయం: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి