రూ.66 కోట్లు ఎక్కడ జగన్?
విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది.
ఏటిగట్టు రోడ్డు హామీ గాలికే..
నిడదవోలు, న్యూస్టుడే: విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది. పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు ఏటిగట్టు రహదారి తరహాలో విజ్జేశ్వరం నుంచి బియ్యపుతిప్ప వరకు ఏటిగట్టు రోడ్డును విస్తరించి బస్సులు, ఇతర వాహనాలు తిరిగేలా తారు రోడ్డు నిర్మించాలి. దీంతో దూరాభారం తగ్గడంతో పాటు, రవాణా సదుసాయం మరింత మెరుగవుతుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఎంతో ప్రయోజనం. వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు పూర్తిగా వదిలేశారు. గతేడాది సాక్షాత్తూ సీఎం జగనే హామీ ఇచ్చినా అడుగు కూడా పడలేదు. ఏటిగట్టు రక్షణ పూర్తిగా వదిలేశారు.
భయపెడుతున్న తవ్వకాలు..
1986లో గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో ఎక్కడికక్కడ ఏటిగట్లు తెగిపోయాయి. వందల గ్రామాలు నీట మునిగాయి. 2006లో కూడా ఇంచుమించు అదే స్థాయిలో వరదనీరు ప్రవహించింది. ఆ సమయాల్లో ఉభయగోదావరి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మళ్లీ ఎప్పుడైనా అదేస్థాయిలో వరదలొస్తే ఏ విధమైన ఇబ్బందులు రాకూడదని ఏటిగట్టు ఆధునికీకరణ చేపట్టారు. పనుల్లో నాణ్యతా లోపంతో ఇబ్బందులు తప్పట్లేదు. నిబంధనల ప్రకారం ఏటిగట్టుకు సుమారు కి.మీ దూరంలో తవ్వకాలు చేయకూడదు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన తవ్వకాలు జరిగాయి. ఏటిగట్టును చేర్చి ఉన్న లంకల్లోనే మట్టిని మీటరు నుంచి మూడు మీటర్ల లోతు తవ్వేశారు. దీంతో గట్టు అనేక చోట్ల జారుతోంది. 2020లో అత్యధికంగా 22.58 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించింది. ఆ సమయంలో తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు. నాయకుల హడావుడి తప్ప చేసిందేం లేదు.
యథేచ్ఛగా ఇసుక లారీలు..
ఏటిగట్టుపై ఏ విధమైన వాహనాలు రాకపోకలు సాగించరాదు. అధికార పార్టీ పుణ్యమా అని ఇసుక లారీలు ఏటిగట్టుపై నుంచే యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో చాలాచోట్ల గట్టు బలహీన పడింది. పెండ్యాల, పందలపర్రు ఇసుకర్యాంపుల నుంచి ఇసుక లారీలు రాకపోకలు సాగించడంతో ఏటిగట్టు చిత్తడిగా మారింది.
గోదావరికి వరదలొచ్చిన ప్రతిసారీ తీరప్రాంత ప్రజలు, రైతులు వణికిపోతారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఏటిగట్టు అభివృద్ధి పనులు నాణ్యత లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో గట్టు జారిపోతోంది. ఏటిగట్టును ఆధునికీకరించినా పలుచోట్ల ప్రమాదకరంగానే ఉంది. ఏటిగట్టుపై రహదారి నిర్మాణానికి గతేడాది సెప్టెంబరు 16న కాపునేస్తం పథకం కింద లబ్ధిదారులకు నగదు జమ చేసేందుకు నిడదవోలు వచ్చిన సీఎం జగన్ విజ్జేశ్వరం ఆనకట్ట నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు రూ.66 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గోదావరి హెడ్వర్క్స్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, అనుమతులు మాత్రం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏజెంట్ 004
[ 02-06-2024]
సజ్జల వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేసూ నమోదయ్యింది. ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తంచేస్తున్నాయి. -
నలుచెరుగులా బలగాలు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 48 గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూం, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,100 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు ఉంటుంది. -
కూటమి ఖుషీ
[ 02-06-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు అనుకూలంగా రావడంతో తమ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమనే ధీమా కనిపిస్తోంది. -
ఓట్ల లెక్కింపునకు 17 కేంద్రాలు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయంలో మొత్తం 17 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. కలెక్టరేట్లో శనివారం విలేకరుల సమావేశంలో కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. -
ఎన్డీఏ కూటమిదే విజయం: సీఎం రమేష్
[ 02-06-2024]
కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, భాజపాకు చెందిన సి.ఎం.రమేష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి శనివారం రాత్రి విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బ్యాంకుల్లో 47.82 శాతమే పింఛను సొమ్ము ఉపసంహరణ
[ 02-06-2024]
సామాజిక భద్రత పింఛను డబ్బులు బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు ఈ నెల కూడా జిల్లాలోని లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పలేదు. కొన్నిచోట్ల బ్యాంకుల్లో పింఛను నగదు కోసం గంటల తరబడి వరసలో నిరీక్షించాల్సి వచ్చింది. -
ఆగండి.. ఎలా వెళ్లాలో గమనించండి
[ 02-06-2024]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) జర¢గనుండటంతో ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి అటుగా వెళ్లే భారీ వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకుంటున్నారు. -
4జీ సేవలు మరింత విస్తృతం
[ 02-06-2024]
4జీ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజరు ఎం.శేషాచలం చెప్పారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఈదురు గాలుల బీభత్సం
[ 02-06-2024]
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం బెంబేలెత్తారు. శనివారం వేకువజామున 4 గంటల నుంచి జిల్లాలోని 14 మండలాలను ఒక్కసారిగా ఈదురుగాలులు చుట్టుముట్టాయి. -
పూడికతీత.. పనుల్లో రోత..!
[ 02-06-2024]
‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా మారింది గోదావరి కాలువలో పూడికతీత పనుల పరిస్థితి. అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నా, పనులకు పక్కాగా అనుమతులు లభించినా పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం నెలకొంది. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమదే మొదటి స్థానం
[ 02-06-2024]
ఏలూరు రేంజ్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కోనసీమ ప్రథమ స్థానంలో ఉందని ఎస్ఈబీ ఐజీ, జిల్లా లెక్కింపు ప్రత్యేకాధికారి ఎం.రవిప్రకాష్ తెలిపారు. శనివారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. -
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు..
[ 02-06-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఆవశ్యకత, ఓటు విలువను గుర్తించిన యువత పెద్దఎత్తున ఓట్ల పండగలో పాల్గొని.. తమకు నచ్చినవారికి ఓటు వేశారు. జిల్లాలో పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు