హామీలు మాత్రమే ఇచ్చేది కాంగ్రెస్.. అమలు చేసేది భాజపా
హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని, ఇచ్చిన హామీలను అమలుచేసిది భాజపా అని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు.
మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్రావు
అమీర్పేట, న్యూస్టుడే: హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని, ఇచ్చిన హామీలను అమలుచేసిది భాజపా అని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. అమీర్పేటలోని ఆదిత్యా పార్క్ ఇన్ హోటల్లో ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రఘునందన్రావుతో క్రాస్ టాక్ నిర్వహించగా ఆయన మాట్లాడుతూ.. పది సంవత్సరాల నరేంద్రమోదీ పాలన, అంతకుముందు కాంగ్రెస్ సారథ్యంలోని మన్మోహన్సింగ్ పాలనల్లో ప్రోగ్రెస్ కార్డు చూసుకున్న తరువాత ప్రజలు ఎవరికి ఓట్లెయ్యాలో నిర్ణయించుకోవాలని కోరారు.
చర్చకు సిద్ధం
దుబ్బాక అభివృద్ధిపై రేవంత్రెడ్డి ఎప్పుడు వచ్చినా చర్చకు సిద్ధమన్నారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ మెదక్లో ఎలా పోటీ చేస్తాడని రేవంత్రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని, కొడంగల్లో ఓడిన రేవంత్రెడ్డి మల్కాజిగిరిలో పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్రెడ్డిని ఓడించింది భాజపా కాదా అన్నారు. ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు వల్లే తాను దుబ్బాకలో ఓటమిపాలయ్యానన్నారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ రేవంత్రెడ్డి తమకు మిత్రుడు కాదన్నారు. కవిత కంటే ముందు సోనియా, రాహుల్, వాద్రాలను ఈడీ విచారణ తరువాత సోనియాను అరెస్టు చేయలేదని, అప్పుడెందుకు కాంగ్రెస్-భాజపా ఒక్కటేనని అనలేదన్నారు. కవిత మాత్రం అరెస్టు కాకపోతే భాజపా, భారాస ఒక్కటేనని ప్రచారం చేశారన్నారు. మెదక్ అభివృద్ధిని సర్వనాశనం చేసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని, భారాసతో రేవంత్రెడ్డికి సంబంధాలు లేకపోతే ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఏబీబీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్, టీజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికృష్ణ, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షుడు నర్సింహా, కపిలాయి రవీందర్, కనకారెడ్డి, బాబురావు, ఎల్లయ్య, శ్రీనివాస్, సిద్ధల రవి, సతీష్, వేముల సుదర్శన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకెళ్లినా మార్పు రాలె.. జల్సాలకు అలవాటు పడి చోరీలు
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ.. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిషోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్