భాజపాశ్రేణుల్లో జోష్!
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు..
ఏకత చాటుతున్న పెద్దపల్లి ప్రభారి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, సహ ప్రభారి వెంకటేశ్గౌడ్, సునీల్రెడ్డి, వెంకటేశ్ నేత, జేపీ నడ్డా, గోమాసె శ్రీనివాస్
పెద్దపల్లి (ఈనాడు), పెద్దపల్లి, పెద్దపల్లి కలెక్టరేట్ (న్యూస్టుడే) : రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. అంటూ చేసిన అభివృద్ధి.. చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తావించడం భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భాజపా పెద్దపల్లి అభ్యర్థి గోమాసె శ్రీనివాస్కు మద్దతుగా పెద్దపల్లిలో సోమవారం నిర్వహించిన జనసభలో నడ్డా పాల్గొని స్థానిక అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలో ఎన్హెచ్-63ని నిజామాబాద్, ధర్మపురితోపాటు ధర్మారం, పెద్దపల్లికి అనుసంధానిస్తామని, పెద్దపల్లి- మంచిర్యాల రైల్వే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏళ్లుగా పెద్దపల్లి ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, వారి ప్రయోజనాల కోసం ఒకే కుటుంబసభ్యులు వంతుల వారీగా పాలన సాగిస్తున్నారని ఈ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పలకాలని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన వివేక్ కుటుంబం ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలను పెట్టి కోటీశ్వరులయ్యారని ఆరోపించారు. సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత మాట్లాడుతూ కాంగ్రెస్లో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. తండ్రి తరువాత కొడుకు, మనవడు, ఆ తరవాత మునిమనవడికే అధికారం కట్టబెడతారని ఆరోపించారు. భాజపాతోనే రాష్ట్రానికి, దేశానికి రక్షణ ఉంటుందన్నారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ మాట్లాడుతూ ఎన్టీపీసీ ఉత్పాదకతను భాజపా హయాంలోనే రెట్టింపు చేశామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరపాలక కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. -
ఉద్యమస్ఫూర్తి.. చైతన్యకీర్తి
[ 02-06-2024]
పల్లె గొంతెత్తింది.. పట్నం కదిలింది.. రోడ్లు స్తంభించాయి.. వంటావార్పులకు దారులే అడ్డాగా మారాయి. -
జై బోలో హనుమాన్కీ
[ 02-06-2024]
‘ఓం శ్రీరామ జయరామ జయజయ రామా.. రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్కీ..’ నినాదాలతో అంజన్న క్షేత్రం మారుమోగింది. -
బడిబాటకు వేళాయె!
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతీ సంవత్సరం లాగానే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని రూపొందించింది. -
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ
[ 02-06-2024]
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ గని ఏర్పాటు చేయనున్నారు. -
మూత ‘బడి’కి మోక్షం!
[ 02-06-2024]
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పంచాయతీలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనవరిలోనే విద్యాశాఖను ఆదేశించారు. -
సాంకేతిక కోర్సులు.. ఉపాధికి బాటలు
[ 02-06-2024]
వారంతా పాఠశాల స్థాయిలో నేర్చుకున్న పాఠాలను ఉపాధి, ఉద్యోగాలుగా మలుచుకోవడానికి వచ్చిన అభ్యర్థులు. -
పుస్తక పఠనం.. బాలల వికాసం
[ 02-06-2024]
నేటికాలం పిల్లలు పాఠ్యపుస్తకాలు తప్పితే కథలు, గేయాలు, జీవిత చరిత్రలు వంటి ఆలోచింపజేసే పుస్తకాలకు దూరంగా ఉంటున్నారు. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్