ఊరేగింపులు నిషేధం
ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ఎనిమిది గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలలో ప్రారంభం కానుంది.
ఉదయమే ఓట్ల లెక్కింపు షురూ
రష్ట్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తు
బెలగావి: నిఘా కెమెరాల నీడలో లెక్కింపు కేంద్రాలు.. పరిశీలిస్తున్న సిబ్బంది
మల్లేశ్వరం, యశ్వంతపుర, న్యూస్టుడే : ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ఎనిమిది గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలలో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఫలితాలపై స్పష్టత రానుంది. పదహారో విధానసభలో అడుగు పెట్టేందుకు 2615 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అతిరథ మహారథుల్లో ఎవరు గెలుస్తారో నేటి మధ్యాహ్నానికి తేటతెల్లం కానుంది. లెక్కింపు కేంద్రాల చుట్టూ వాహనాల పార్కింగ్పై పోలీసులు నిషేధాన్ని జారీ చేశారు. ఫలితాలు వెల్లడైన తర్వాత, కేంద్రాలకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఊరేగింపు, జాతర, బాణసంచా కాల్పులపైనా నిషేధం జారీలోకి రానుంది. ఓటరు మనసులోని గుట్టు నేడు రట్టు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 73.19 శాతం పోలింగ్ జరిగింది. బెంగళూరులో నాలుగు కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి గదికి 10-14 టేబుళ్లు ఉంటాయి. పోలింగ్ కేంద్రాలు, చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. గెలుపు ఓటములపై జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. ఫలితాల అనంతరం ఎవరికీ మెజార్టీ రాకపోతే రిసార్టు రాజకీయాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
గట్టి భద్రత
కీలక నగరం బెళగావిలో మొహరించిన సాయుధ బలగాలు
* ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి పోలీసు భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ ప్రవీణ్సూద్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రదేశాల్లో ఓట్లు లెక్కిస్తున్న క్రమంలో నిషేధాజ్ఞలు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద జిల్లా ఎస్పీ, డీవైఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, కనీసం ఐదొందల మంది పోలీసులతో పాటు మూడు కేంద్ర పారా మిలటరీ దళాలు, పది రాష్ట్ర రిజర్వుడ్ పోలీసు దళాలను భద్రత కోసం నియమించినట్లు వివరించారు. వారితో పాటు 15 సంచార భద్రత దళాలు అందుబాటులో ఉంటాయన్నారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే నియంత్రించేందుకు జిల్లా కేంద్రాల్లో కేంద్ర పారామిలటరీ దళాలు, రాష్ట్ర రిజర్వు పోలీసు దళాలను సిద్ధంగా ఉంచామన్నారు. ఒక్క లెక్కింపు ప్రక్రియ అవసరాలకే 38 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్
[ 02-06-2024]
వందలాది మందిపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు తెలిపారు. -
అంచనాల్లో.. కూటమిదే కోట!
[ 02-06-2024]
కర్ణాటకలో లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వివిధ సంస్థల శ్యాంపుల్ సమీక్షల ఫలితాలు ఎన్డీఏ కూటమి ఆధిపత్యాన్ని చాటుతుందని తేల్చాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భాజపా సాధించిన స్థానాల కంటే తక్కువ స్థానాలకు పరిమితమవుతుందని ఈ సమీక్షలు వెల్లడించాయి. -
సీఈటీ ర్యాంకుల్లో అబ్బాయిల జోరు!
[ 02-06-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయం, పశువైద్యం, నర్సింగ్, ఫార్మసీ, యోగా, నేచురోపతి విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కర్ణాటక ఉమ్మడి ప్రవేశ (కే-సీఈటీ)పరీక్షల్లో అబ్బాయిలు ర్యాంకుల్లో సత్తా చాటారు. -
విచారణకు హాజరైన సిద్ధు, డీకే
[ 02-06-2024]
విధానసభ ఎన్నికల సమయంలో ‘భాజపా నేతలు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు’ అంటూ ప్రకటనలు విడుదల చేసిన కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై నమోదైన కేసు విచారణ శనివారం ప్రారంభమైంది. -
పాలకుల మాటలు.. నీటి మూటలు
[ 02-06-2024]
రాజధాని నగరం ఈసారి వాననీటి ముంపునకు గురిచేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు ముందే అధికారులు, ఏలికలు భీకర ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలయ్యాక.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ముంపు ముప్పు ఎదురయ్యే ప్రాంతాలను చుట్టేసి ఈసారి సమస్య ఎదురుకాకుండా చూడడానికి అనేక ఆదేశాలిచ్చారు. -
నకిలీ ఖాతాలకు నగదు బదిలీ
[ 02-06-2024]
రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడి, నకిలీ ఖాతాలకు బదిలీ చేసిన నగదులో కొంత భాగం హస్తినలోని కాంగ్రెస్ నేతలకు చేరిందని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆరోపించారు. -
భవ్య సేవలే ఓ సైన్యం!
[ 02-06-2024]
కాంగ్రెస్ పార్టీ మహిళా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన భవ్య నరసింహమూర్తి భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టారు. డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ 2022లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య