కోడి ధరకు రెక్కలు
వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ఉమ్మడి జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి.
కిలో మాంసం రూ.280
ఖమ్మం అర్బన్, న్యూస్టుడే: వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ఉమ్మడి జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ.280, స్కిన్లెస్ రూ.300లకు చేరుకుంది. సాధారణ రోజుల్లోనే చికెన్ దుకాణాల వద్ద వరుస కట్టే మాంసాహారప్రియులు ధరల పెరుగుదల కారణంగా వారాంతంలోనూ వాటి వద్ద పెద్దగా కనిపించడం లేదు. కొనలేమని వినియోగదారులు, అమ్మకాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు.
వేసవి దెబ్బ..
వేసవిలో పెంపకం చేపట్టకపోవడం, అధిక వేడి కారణంగా కోడి బరువు పెరుగుదలలో వ్యత్యాసం ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇవన్నీ ధరల పెరుగుదలకు కారణాలని వ్యాపారులంటున్నారు. మొక్కులు చెల్లించేవారు, ఇతర శుభ, అశుభ కార్యాల సందర్భంగా మటన్తోపాటు కోడి మాంసం పెడుతుంటారు. సరఫరా తగ్గడంతో బతికున్న కిలో బ్రాయిలర్ కోడిని ఆదివారం రూ.230లకు విక్రయించారు. గుడ్లు పెట్టే కోడి రూ.220లకు విక్రయించారు.
నిలిచిన సరఫరా.. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు స్థానికంగా పెంచిన కోళ్లకు తోడు సిద్ధిపేట, ఏపీలోని జంగారెడ్డిగూడెం, ఏలూరు నుంచి సరఫరా అవుతున్నాయి. వేసవి కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి ధర పెరుగుదల ప్రభావం నాటుకోడిపైనా కనిపిస్తోంది. గత వారం వరకు కిలో రూ.450 ఉన్న నాటుకోడి ధర ఈ వారం రూ.500లకు చేరుకుంది.
నిత్యం 40 టన్నుల వినియోగం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోడి మాంసం వినియోగం భారీగా ఉంటోంది. సాధారణ రోజుల్లో రోజుకు 40 టన్నులు, పెళ్లిళ్ల సీజన్లో 50 టన్నుల వరకు ఉంటోంది. ఆదివారం 120 టన్నుల విక్రయం జరుగుతోంది. సింహభాగం ఖమ్మం నగరంలోనే ఉంటుంది. జూన్లో పౌల్ట్రీ వ్యాపారులు కొత్త కోళ్ల పెంపకం చేపడతారు. ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా జరగకుంటే ఈ ప్రభావం జూలై చివరి వారం వరకు ఉండే అవకాశం ఉంటుంది.
ఖమ్మం చికెన్ సెంటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పారా సత్యనారాయణ మాట్లాడుతూ... శుభకార్యాలు లేకుంటే వ్యక్తిగత కొనుగోళ్లు అధికంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం వేసవి కారణంగా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ అధికంగా ఉండటంతో కోడి ధర అసాధారణంగా పెరిగినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి
[ 02-06-2024]
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ ఏన్కూర్లో ఓ యువకుడు వినూత్నంగా ప్రదర్శన చేశాడు. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఏన్కూర్ లో ఘనంగా నిర్వహించారు. -
పదేళ్ల పండగ.. అభివృద్ధి దండిగా..
[ 02-06-2024]
స్వరాష్ట్ర స్వప్నం నెరవేరి పదేళ్లు పూర్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. -
తొందరొద్దు.. సాగుకు అదను ముఖ్యం
[ 02-06-2024]
వానాకాలం పంటల సాగులో తొందరపాటు తగదని వైరా కేవీకే ప్రోగ్రామ్ సమన్వయకర్త, శాస్త్రవేత్త కె.రవికుమార్ సూచించారు. నిర్ధారిత కనీస వర్షపాతం నమోదయ్యాకే పత్తి విత్తనాలు నాటుకోవాలని, ఇతర పంటలకు పూనుకోవాలని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ దుర్మరణం
[ 02-06-2024]
తల్లాడ-దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలోని మిట్టపల్లి గ్రామం వద్ద ఓ డీసీఎం వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో
[ 02-06-2024]
ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై జీలుగుమిల్లి మండలం రమణక్కపేట వద్ద శనివారం జరిగింది. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
[ 02-06-2024]
ఖమ్మం శివారు ధంసలాపురం ఫ్లైఓవర్ సమీపంలో ఓ యువకుడు మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ ఎస్సై భాస్కర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సింగరేణి ముస్తాబు
[ 02-06-2024]
సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. -
పదేళ్ల ప్రస్థానం.. ప్రగతికి సోపానం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొత్తగూడెం పట్టణం కీలక భూమిక పోషించింది. 1968లో మొట్టమొదటిసారిగా ‘ప్రత్యేక తెలంగాణ’ నినాదం ఇక్కడే పురుడు పోసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య