ప్రత్యేక బోధనతోనే అనుత్తీర్ణులు గట్టేక్కేది!
ఇటీవల వెల్లడైన పదోతరగతి వార్షిక ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని కొన్ని యాజమాన్యాల పాఠశాలలు తక్కువ ఉత్తీర్ణత సాధించాయి.
పాల్వంచ, న్యూస్టుడే
ఇటీవల వెల్లడైన పదోతరగతి వార్షిక ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని కొన్ని యాజమాన్యాల పాఠశాలలు తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేటు విద్యాలయాలతో పాటు బీసీ, ఎస్సీ, మైనార్టీ, తెలంగాణ గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాదికంటే పెరిగింది. ప్రభుత్వ ఉన్నత, జడ్పీ ఉన్నత, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు కాస్త వెనకబడ్డారు. ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లోనూ ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదుకాలేదని అధికారులు భావిస్తున్నారు. అన్ని యాజమాన్యాల విద్యాలయాల్లో కలిపి ఖమ్మం జిల్లాలో 16,541 మందికి 1,772 మంది, భద్రాద్రి జిల్లాలో 12,341 మందికి 1,989 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో అనుత్తీర్ణులయ్యారు. వీరు సప్లిమెంటరీ పరీక్షలో కనీస మార్కులు సాధించేలా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ప్రస్తుత వార్షిక ఫలితాలను విశ్లేషించి, లోటుపాట్లు సరిదిద్దడం ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రస్థాయిలో మెరుగైన స్థానంలో నిలిచేలా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించాలి.
ఉపాధ్యాయుల చొరవ ముఖ్యం
వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారికి పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు బోధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విద్యాసంవత్సరం వృథా కాకుండా సప్లిమెంటరీలో అర్హత మార్కులు సాధించేలా సన్నద్ధం చేయించాలి. విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం తరగతులు జరిగేలా హెచ్ఎంలు ప్రణాళిక రూపొందించుకోవాలి. కలెక్టర్ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి.
విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సన్నద్ధం చేయించాలని అన్నిరకాల యాజమాన్యాల హెచ్ఎంలు, ఎంఈఓలు, కేజీబీవీల ప్రత్యేకాధికారులకు ఆదేశాలిచ్చాం. వార్షిక ఫలితాల్లో ఫెయిల్ అయిన వారంతా ఈసారి ఉత్తీర్ణులయ్యేలా బోధనపై ప్రత్యేక శ్రద్ధచూపాలని ఉపాధ్యాయులకు సూచించాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై హెచ్ఎంల సమావేశంలో దిశానిర్దేశం చేశాం.
వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారేపల్లిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
[ 02-06-2024]
కారేపల్లి తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి
[ 02-06-2024]
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ ఏన్కూర్లో ఓ యువకుడు వినూత్నంగా ప్రదర్శన చేశాడు. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఏన్కూర్ లో ఘనంగా నిర్వహించారు. -
పదేళ్ల పండగ.. అభివృద్ధి దండిగా..
[ 02-06-2024]
స్వరాష్ట్ర స్వప్నం నెరవేరి పదేళ్లు పూర్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. -
తొందరొద్దు.. సాగుకు అదను ముఖ్యం
[ 02-06-2024]
వానాకాలం పంటల సాగులో తొందరపాటు తగదని వైరా కేవీకే ప్రోగ్రామ్ సమన్వయకర్త, శాస్త్రవేత్త కె.రవికుమార్ సూచించారు. నిర్ధారిత కనీస వర్షపాతం నమోదయ్యాకే పత్తి విత్తనాలు నాటుకోవాలని, ఇతర పంటలకు పూనుకోవాలని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ దుర్మరణం
[ 02-06-2024]
తల్లాడ-దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలోని మిట్టపల్లి గ్రామం వద్ద ఓ డీసీఎం వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో
[ 02-06-2024]
ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై జీలుగుమిల్లి మండలం రమణక్కపేట వద్ద శనివారం జరిగింది. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
[ 02-06-2024]
ఖమ్మం శివారు ధంసలాపురం ఫ్లైఓవర్ సమీపంలో ఓ యువకుడు మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ ఎస్సై భాస్కర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సింగరేణి ముస్తాబు
[ 02-06-2024]
సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. -
పదేళ్ల ప్రస్థానం.. ప్రగతికి సోపానం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొత్తగూడెం పట్టణం కీలక భూమిక పోషించింది. 1968లో మొట్టమొదటిసారిగా ‘ప్రత్యేక తెలంగాణ’ నినాదం ఇక్కడే పురుడు పోసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము