సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు.
పెబ్బేరు, న్యూస్టుడే : మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం భారీగా పెండింగ్ ఉండటంతో నూటికి 125 శాతం జరిమానా విధిస్తూ ప్రభుత్వం మరో రెండు నెలల గడువు పెంచింది. ఇటీవల ఉత్తర్వులు జిల్లాల కలెక్టర్లకు వచ్చాయి. మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యంలో క్వింటాకు 67 కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వానికి తిరిగివ్వాలి. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 66,700 మెట్రిక్ టన్నులు (2,300 ఏసీకేలు) బియ్యం ఇవ్వాల్సి ఉంది. నూటికి 125 శాతం జరిమానా విధించడంతో అదనంగా సుమారు 17 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల యజమానులు ఇవ్వాల్సి ఉంది. లేకుంటే రెండు నెలల అనంతరం రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇతర రాష్ట్రాలకు తరలించడంతోనే..
నాలుగేళ్లుగా ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం యజమానులు అక్రమార్జన కోసం ఇతర రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. తనిఖీలు, దాడులు చేసే అధికారులు నిర్లిప్తంగా ఉండటంతో ధాన్యం రాష్ట్రం దాటిపోయింది. సుమారు 40 శాతం ధాన్యం పక్క రాష్ట్రాలకు తరలిపోగా.. ఆలస్యంగా మేలుకొన్న అధికార యంత్రాగం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొన్ని నెలల క్రితం మిల్లులపై దాడులు చేశారు. వనపర్తి జిల్లాలోనే 5 లక్షల సీఎంఆర్ ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన మిలర్లపై నామమాత్రంగా చర్యలు తీసుకుని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని సార్లు గడువు పెంచినా.. మిల్లర్ల వద్ద ధాన్యమే లేకపోతే ప్రభుత్వానికి ఎలా ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ నాయకులతో చర్చలు?
వనపర్తి జిల్లాలో 139 రా మిల్లులు, 12 బాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. వీటిలో 80 మిల్లులు ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడంతో డిఫాల్ట్ కింద చేర్చారు. ఈ మిల్లుల నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు 2,300 ఏసీకేల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం పెండింగ్లో ఉంటే మిల్లర్ల యజమానులపై చర్యలు తీసుకోవడంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ 80 మిల్లులకు యాసంగిలో వరి ధాన్యం కూడా కేటాయించలేదు. కేవలం 14 బియ్యం మిల్లులకు మాత్రమే అవకాశమిచ్చారు. చర్యలు చేపట్టకుండా మిలర్ల యజమానులు రాజకీయ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రెండు నెలల్లో ఇవ్వకుంటే ఆస్తుల జప్తు
- బాలు నాయక్, పౌరసరఫరాల సంస్థ అదనపు డీఎం, వనపర్తి
బకాయిలో ఉన్న సీఎంఆర్ బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లకు ప్రభుత్వం రెండు నెలల అవకాశం ఇచ్చింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యంలో నూటికి 125 శాతం జరిమానాతో వసూలు చేస్తాం. అలా ఇవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం మిల్లు యజమాని, మిల్లుకు జామీను ఉన్న వారి ఆస్తులను జప్తు చేస్తాం. ప్రభుత్వ నింబంధనల ప్రకారం మిల్లర్లు నడుచుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రగతి విరిసేలా.. పాలమూరు మెరిసేలా!
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయ్యింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఉమ్మడి మహబూబ్నగర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు రంగాల్లో ప్రగతి దశగా అడుగులు పడ్డాయి. -
సమగ్ర వికాసమే సంకల్పం
[ 02-06-2024]
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ తమ నియోజక వర్గ సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయమని పాలమూరు శాసనసభ్యులు అంటు న్నారు. ప్రధానంగా సాగునీటి వనరులపై దృష్టి సారిస్తామంటున్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారీ భద్రత
[ 02-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అవాంఛనీయ ఘటనలు -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పాలమూరు పట్టణం ముస్తాబైంది. తెలంగాణ, అంబేడ్కర్, క్లాక్టవర్, వన్టౌన్, కూడళ్లను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
డబ్బాలతోనే రండి.. మాంసం తీసుకెళ్లండి
[ 02-06-2024]
చికెన్, మటన్ కొనడానికి వెళ్లేందుకు ఇక నుంచి వట్టి చేతులతో వెళ్లవద్దని, స్టీల్ డబ్బాలు వెంట తీసుకెళ్లాలని మహబూబ్నగర్ పురపాలక సంఘం పట్టణవాసులను కోరుతోంది. -
విద్యుత్తు శాఖలో ప్రతి పనికి ఓ రేటు!
[ 02-06-2024]
విద్యుత్తు కనెక్షన్ లేని ఇల్లు బహుశ ఉండదేమో. అదే, ఆ శాఖ అధికారులు కొందరికి కలిసి వస్తోంది. నిబంధనల పేరుతో జాప్యం చేయడం.. చేయి తడిపితే పనులు చకచకా చేయడం వారికి సాధారణమైంది. -
చినుకు.. పడితే వణుకే!
[ 02-06-2024]
పట్టణాల్లో రహదారి పక్కనున్న కాలువ చిన్నదే అయినప్పటికీ అది సక్రమంగా లేకపోతే ఎదురయ్యే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏళ్ల తరబడి నుంచి పట్టణాల్లో నివసిస్తున్న వారికి వర్షం పడితే దడే. -
లోతట్టు కాలనీలపై దృష్టేది?
[ 02-06-2024]
వర్షాల నేపథ్యంలో పురపాలకల్లోని లోతట్టు కాలనీల్లో ఆందోళన నెలకొంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది వార్డుల్లోని మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు -
వానాకాలం.. వ్యాధుల ముప్పు
[ 02-06-2024]
రుతువులతోపాటు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల వచ్చే వ్యాధులే సీజనల్ రుగ్మతలు. అందులోనూ వానాకాలంలో దోమల వృద్ధి అపారంగా ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!