భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు
భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ధన్వాడ, న్యూస్టుడే : భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిష్టాపూర్లో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పదేళ్లు పాలించిన ఈ పార్టీలు అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వలేదని, దాని మూలంగా అర్హత ఉన్నా పింఛన్ పొందలేకపోయారని ఆరోపించారు. పదేళ్లుగా వారు చేయలేదని, మూడు నెలల్లోనే కాంగ్రెస్ చేయలేదని అనడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఒక్కొక్కటిగా ప్రభుత్వం అన్నీ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఎంపీగా గెలిపిస్తే స్థానికంగా ఉన్న రామసముద్రం చెరువును కృష్ణాజలాలతో నింపే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పర్నికరెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వలేదని ఈ సారైనా మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరారు. పార్టీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు వినోద్కుమార్, జేఏసీ మాజీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, నాయకులు దామోదర్రెడ్డి, గోపాల్రెడ్డి, డీలర్ వెంకట్రెడ్డి, జగన్నాథరెడ్డి, భగవంత్, రహీమ్, నిరంజన్రెడ్డి, ఖాదర్ పాల్గొన్నారు.
ధన్వాడ, న్యూస్టుడే : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని ఆ పార్టీ మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. రాత్రి మరికల్, ధన్వాడ పట్టణాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. శివకుమార్రెడ్డి ఉన్నారు.
పాతబస్టాండ్(నారాయణపేట) : ముదిరాజ్ల బిడ్డనై జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి శివకుమార్రెడ్డి ఆధ్వర్యంలో పేటలోని సీవీఆర్ భవన్లో నియోజకవర్గ స్థాయి ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పీసీసీ సభ్యులు సంజీవ్ ముదిరాజ్, నాగరాజ్, నరహరి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రగతి విరిసేలా.. పాలమూరు మెరిసేలా!
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయ్యింది. ఈ పదేళ్ల ప్రస్థానంలో ఉమ్మడి మహబూబ్నగర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు రంగాల్లో ప్రగతి దశగా అడుగులు పడ్డాయి. -
సమగ్ర వికాసమే సంకల్పం
[ 02-06-2024]
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ తమ నియోజక వర్గ సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయమని పాలమూరు శాసనసభ్యులు అంటు న్నారు. ప్రధానంగా సాగునీటి వనరులపై దృష్టి సారిస్తామంటున్నారు. -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారీ భద్రత
[ 02-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అవాంఛనీయ ఘటనలు -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పాలమూరు పట్టణం ముస్తాబైంది. తెలంగాణ, అంబేడ్కర్, క్లాక్టవర్, వన్టౌన్, కూడళ్లను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
డబ్బాలతోనే రండి.. మాంసం తీసుకెళ్లండి
[ 02-06-2024]
చికెన్, మటన్ కొనడానికి వెళ్లేందుకు ఇక నుంచి వట్టి చేతులతో వెళ్లవద్దని, స్టీల్ డబ్బాలు వెంట తీసుకెళ్లాలని మహబూబ్నగర్ పురపాలక సంఘం పట్టణవాసులను కోరుతోంది. -
విద్యుత్తు శాఖలో ప్రతి పనికి ఓ రేటు!
[ 02-06-2024]
విద్యుత్తు కనెక్షన్ లేని ఇల్లు బహుశ ఉండదేమో. అదే, ఆ శాఖ అధికారులు కొందరికి కలిసి వస్తోంది. నిబంధనల పేరుతో జాప్యం చేయడం.. చేయి తడిపితే పనులు చకచకా చేయడం వారికి సాధారణమైంది. -
చినుకు.. పడితే వణుకే!
[ 02-06-2024]
పట్టణాల్లో రహదారి పక్కనున్న కాలువ చిన్నదే అయినప్పటికీ అది సక్రమంగా లేకపోతే ఎదురయ్యే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏళ్ల తరబడి నుంచి పట్టణాల్లో నివసిస్తున్న వారికి వర్షం పడితే దడే. -
లోతట్టు కాలనీలపై దృష్టేది?
[ 02-06-2024]
వర్షాల నేపథ్యంలో పురపాలకల్లోని లోతట్టు కాలనీల్లో ఆందోళన నెలకొంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది వార్డుల్లోని మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు -
వానాకాలం.. వ్యాధుల ముప్పు
[ 02-06-2024]
రుతువులతోపాటు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల వచ్చే వ్యాధులే సీజనల్ రుగ్మతలు. అందులోనూ వానాకాలంలో దోమల వృద్ధి అపారంగా ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల