హామీల అమలులో మాట తప్పిన సీఎం
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు.
ములుగులో మాట్లాడుతున్న హరీశ్రావు, చిత్రంలో ప్రతాప్రెడ్డి , వెంకట్రామిరెడ్డి
నర్సాపూర్, న్యూస్టుడే: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. నర్సాపూర్లో బుధవారం మాజీ సీఎం కేసీఆర్ రోడ్షో విజయవంతం చేసేందుకు, పట్టణంలోని ఓ వేడుక మందిరంలో ముఖ్యనేతలతో సోమవారం ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని ఎద్దేవా చేశారు. పుట్టినగడ్డ మెదక్ నుంచి కేసీఆర్ తెలంగాణ ప్రతేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి సాధించారని, ఈ జిల్లా అబివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన్ని అవమానిస్తూ మాట్లాడుతున్న వారికి మెదక్ జిల్లా ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలను భారాస సాకారం చేస్తే, కాంగ్రెస్ వాటిని రద్దుచేస్తామని అంటోంది, జిల్లాలు వద్దనుకునే వారు కాంగ్రెస్కు ఓటేయాలన్నారు, కావాలని కోరుకునేవారు భారాసను గెలిపించాలన్నారు. పదేళ్ల పాలనలో భాజపా ఏం చేశామనేది చెప్పడం లేదు, ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ కూడా చేసింది చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు అబద్ధాలతో పుట్టిన కవలపిల్లలు. ప్రజలకిచ్చిన హామీలపైన చర్చ పెట్టకుండా, మతం పేరుతో ఒకరు, రిజర్వేషన్ల పేరుతో మరొకరు సెంటిమెంట్తో లబ్ధి పొందేందుకు చూస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర నాయకులు గోపి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పుర అధ్యక్షులు అశోక్గౌడ్, బోగశేఖర్ పాల్గొన్నారు.
ములుగు: కాంగ్రెస్ పార్టీతో ప్రమాదం పొంచి ఉందని హరీశ్రావు అన్నారు. వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ములుగులో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తేసిందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల సంబరం.. ప్రగతి గణనీయం
[ 02-06-2024]
ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించాక చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లా.. గత పదేళ్లలో వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. సాగు, తాగునీటి రంగాలతో పాటు, విద్య, వైద్య పరంగా పురోగతి చెందింది. -
పదేళ్ల వయసు.. వేనోళ్ల యశస్సు
[ 02-06-2024]
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. అంటూ గొంతెత్తి పాడుతున్నారు ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల జనం.. స్వరాష్ట్ర సాధనలో ఎంతోమంది సమిధలవగా.. వారి ఆశయాల స్ఫూర్తిగా తెలంగానం ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది.. పదేళ్ల పయనంలో ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలు అభివృద్ధిలో తమదైన ముద్ర వేయడం విశేషం.. -
తెలంగాణ దశాబ్ది.. రావిఆకులపై ఒదిగి
[ 02-06-2024]
ఎందరో అమరుల త్యాగఫలం, అలుపెరగని పోరాటాలకు దక్కిన ప్రతిఫలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. -
పోరాట స్ఫూర్తికి నిలయం
[ 02-06-2024]
హత్నూర మండలం దౌల్తాబాద్లో నిర్మించిన తెలంగాణ తల్లి మండపం ప్రత్యేకంగా నిలిచింది. మలి విడత ఉద్యమకారుల పోరాట స్ఫూర్తికి నిలయంగా మారింది. -
8 ఏళ్లు.. పాదరక్షల్లేకుండా..
[ 02-06-2024]
స్వరాష్ట్ర సాధన సమయంలో ఒక్కొక్కరు ఒక్కో తరహాలో తమ ఆకాంక్షను చాటారు. కొందరు దీక్షలు సైతం చేపట్టారు. తూప్రాన్ మండలం మల్కాపూర్కు చెందిన కిష్టాల స్వామి ఇదే కోవలోకి వస్తారు. -
ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాల పేరిట మోసం
[ 02-06-2024]
ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.63 లక్షలు వసూలు చేసి పారిపోయిన నిందితుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్బషీరాబాద్ ఎస్ఐ ప్రవీణ్కుమార్ వివరాల ప్రకారం.. ఉమ్మడి కామారెడ్డి జిల్లా పిట్లం ప్రాంతానికి చెందిన కెతావత్ సంతోష్(30) కొంపల్లిలోని జయభేరి కాలనీలో నివసించేవాడు. -
దశాబ్ది.. దశదిశలా అభివృద్ధి
[ 02-06-2024]
ఒకప్పుడు అరకొర వసతులు.. అంతంత మాత్రంగా కార్యాలయాలు.. ప్రగతి ఫలితాలు నామమాత్రమే.. ప్రస్తుతం సకల సదుపాయాలు.. కార్పొరేట్ స్థాయిలో భవనాలు.. సంక్షేమ, అభివృద్ధి ఫలితాలు నేరుగా ప్రజలకు చెంతకు చేరుతున్న వైనం నాడు-నేడు వ్యత్యాసాన్ని చెబుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!