సామాజిక వేదికలు.. ప్రచారాస్త్రాలు
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు.
రాజపేట, ఆలేరు, న్యూస్టుడే: ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు. ప్రస్తుతం కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో చరవాణి ఉన్న ప్రతి ఒక్కరూ క్షణాల్లో అన్నీ తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు.
సామాజిక మాధ్యమాలే కీలకం..
ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక మాధ్యమాలు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాయకులు, వారి అనుచరులు ఎక్స్ ఖాతాను తెరవడంతో పాటు అభిమాన నేతలను అనుసరిస్తుంటారు. చాలా మంది నాయకులు, ప్రజా ప్రతినిధులకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి ఉండటం గమనార్హం. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుని సాయంత్రం నుంచి మళ్లీ ప్రచారం చేస్తున్నారు. రహదారులు, గల్లీల్లో మైకుల మోత ఒక పక్క మోగుతుంటే, మరో వైపు సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర వాటిలో ప్రచారం గుప్పిస్తున్నారు. పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టో వివరించడం, ప్రత్యర్థులకు దీటుగా సమాధానం చెప్పడానికి సామాజిక వేదికలను వినియోగించుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు రూపొందించిన యూట్యూబ్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. వివాదాస్పద వీడియోలు, చిత్రాలు వేరేవారికి పంపితే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
పల్లెల్లో వాట్సప్ గ్రూపుల గోల..
ప్రతి గ్రామంలో వాట్సప్ గ్రూపులు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో సమాచారం చేరవేయడానికి లెక్కలేనన్ని కొత్త గ్రూపులు పుట్టుకొస్తున్నాయి. సమావేశం, ప్రచారం ఉందంటే గ్రూపులో పోస్టు చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో అందరూ ఒకే దగ్గరకు చేరుకుంటున్నారు. ప్రధాన పార్టీలన్నింటికీ గ్రూపులతోపాటు గ్రామం, మండలం, పట్టణం, జిల్లాల గ్రూపులు ఏర్పాటయ్యాయి. జన సమీకరణతో పాటు అదే సమయానికి కార్నర్ మీటింగ్, రోడ్షోలు, ఇంటింటి ప్రచారం, క్లస్టర్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి ఈ గ్రూపులు దోహదపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి
[ 02-06-2024]
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హన్మంత్ కే జండగే మీడియా సమావేశం నిర్వహించారు. -
పదేళ్లుగా.. ఈ నేలలో..!
[ 02-06-2024]
స్వరాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దకాలం గడిచిపోయింది. ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ నేతృత్వంలోని భారాస ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లు పాలించగా.. -
నకిలీ విత్తనాల విక్రయాలకు కట్టడి
[ 02-06-2024]
నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యత లేని విత్తనాలను కొనుగోలు చేసి అన్నదాతలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
పల్లె ప్రగతిపై ఆరా..!
[ 02-06-2024]
గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి పేరుతో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
బంధాలను అల్లుదాం.. రండి..!
[ 02-06-2024]
వేసవి సెలవులు.. పిల్లలు ఇంటి పట్టున ఉండే సమయం ఇది. సెలవుల్లో వారిని ఆటాపాటకు వదిలి పెట్టడమే సరిపోదు.. వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి కోసం సమయం కేటాయించాల్సిన తరుణం ఇదేనని తల్లిదండ్రులు గుర్తించాలి. -
లక్ష్మణ్, పద్మ సమేత.. రామచిలుక
[ 02-06-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటకు చెందిన గౌటె లక్ష్మణ్, పద్మ దంపతులది ప్రత్యేకశైలి. వీరికి రామచిలుకలంటే అమితమైన భక్తి, శ్రద్ధ. ఏడేళ్లక్రితం వ్యాపారపరంగా తిరుగుతున్న క్రమంలో లక్ష్మణ్కు రంగురంగుల చిలుకలు కనిపించాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28)ని టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు డానియేల్, శ్రీనివాస్తో కలిసి టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మిపెరుమాళ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. -
ప్రభుత్వ బడికి డిజిటల్ హంగులు
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులు కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా బోధన కొనసాగించేందుకు ప్రభుత్వం, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. -
గేదెను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడి దుర్మరణం
[ 02-06-2024]
ద్విచక్ర వాహనం గేదెను ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా, మరొక యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
ఏపీలో కూటమిదే విజయం: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్