సౌర విద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు
విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది.
సౌర పలకలు
నల్గొండ గ్రామీణం, న్యూస్టుడే: విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఎక్కడికక్కడే సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సౌర విద్యుత్తు తయారు చేసి వినియోగించుకునేలా ఆ శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అందుకోసం ప్రభుత్వ స్థలాల ఎంపిక చేయడానికి సర్వే ప్రక్రియ వేగవంతం అయింది.
కుసుమ పథకం ద్వారా..
కేంద్ర ప్రభుత్వం కుసుమ పథకం కింద ప్రతి జిల్లాలో నాలుగు ఎకరాల ప్రభుత్వం భూమి సేకరించాలని నిర్ణయించింది. ఇందులో అన్ గ్రేడ్ సిస్టమ్తో రెండు మెగా వాట్ల సౌర యూనిట్లు ఏర్పాటు చేయనుంది. దీంతో ఉత్పత్తి అయ్యే సౌరవిద్యుత్తును విద్యుత్తు సంస్థలకు విక్రయించాలనే ఉద్దేశ్యంతో పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా రానున్న రోజుల్లో విద్యుత్తు డిమాండ్ను అధిగమించి సౌరవిద్యుత్తు ఉత్పత్తి పెద్ద ఎత్తున చేయనున్నారు. ఇది విజయవంతం అయితే రానున్న రోజుల్లో సౌర విద్యుత్తునే ఎక్కువ తయారీ చేసే అవకాశం ఉంది. భూముల సేకరణ కోసం టీఎస్ రెడ్కోకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భూముల సేకరణకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపినట్లు రెడ్కో అధికారులు తెలిపారు. ఇందుకోసం డీఆర్డీఏ, పంచాయతీ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖలు సంయుక్త సర్వే చేయడానికి నిర్ణయించాయి. ప్రతి జిల్లాలో నాలుగు ఎకరాలు సేకరిస్తే కేంద్ర సంస్థలతో అన్గ్రేడ్ సిస్టంతో రెండు మెగా వాట్ల సౌర యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
భూముల కోసం సర్వే చేస్తున్నాం..
మర్రు పాండురంగారావు, మేనేజర్, టీఎస్ రెడ్కో ఉమ్మడి నల్గొండ
ప్రతి జిల్లాలో నాలుగు ఎకరాల ప్రభుత్వం స్థలాలు సేకరించి అందులో అన్గ్రేడ్ సిస్టమ్తో మెగా సౌర యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు పంపింది. జిల్లాలో డీఆర్డీఏ, దేవాదాయ ధర్మాదాయ, పంచాయతీ శాఖ అధికారులతో చర్చించి భూముల కోసం సర్వే చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి
[ 02-06-2024]
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హన్మంత్ కే జండగే మీడియా సమావేశం నిర్వహించారు. -
పదేళ్లుగా.. ఈ నేలలో..!
[ 02-06-2024]
స్వరాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దకాలం గడిచిపోయింది. ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ నేతృత్వంలోని భారాస ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లు పాలించగా.. -
నకిలీ విత్తనాల విక్రయాలకు కట్టడి
[ 02-06-2024]
నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యత లేని విత్తనాలను కొనుగోలు చేసి అన్నదాతలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
పల్లె ప్రగతిపై ఆరా..!
[ 02-06-2024]
గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి పేరుతో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులు చేపట్టారు. ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
బంధాలను అల్లుదాం.. రండి..!
[ 02-06-2024]
వేసవి సెలవులు.. పిల్లలు ఇంటి పట్టున ఉండే సమయం ఇది. సెలవుల్లో వారిని ఆటాపాటకు వదిలి పెట్టడమే సరిపోదు.. వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి కోసం సమయం కేటాయించాల్సిన తరుణం ఇదేనని తల్లిదండ్రులు గుర్తించాలి. -
లక్ష్మణ్, పద్మ సమేత.. రామచిలుక
[ 02-06-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటకు చెందిన గౌటె లక్ష్మణ్, పద్మ దంపతులది ప్రత్యేకశైలి. వీరికి రామచిలుకలంటే అమితమైన భక్తి, శ్రద్ధ. ఏడేళ్లక్రితం వ్యాపారపరంగా తిరుగుతున్న క్రమంలో లక్ష్మణ్కు రంగురంగుల చిలుకలు కనిపించాయి. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28)ని టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు డానియేల్, శ్రీనివాస్తో కలిసి టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మిపెరుమాళ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. -
ప్రభుత్వ బడికి డిజిటల్ హంగులు
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులు కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా బోధన కొనసాగించేందుకు ప్రభుత్వం, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. -
గేదెను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడి దుర్మరణం
[ 02-06-2024]
ద్విచక్ర వాహనం గేదెను ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా, మరొక యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము