భూములిస్తే.. మా సంగతేంటి?
రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా- అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ సమస్యగా మారింది.
ప్రత్యేక ఉపకలెక్టరు పద్మావతిని చుట్టుముట్టిన గ్రామస్థులు
కందుకూరు, న్యూస్టుడే: రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా- అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఓడరేవును గుడ్లూరు మండలం మొండివారిపాలెం, ఆవులవారిపాలెం పరిధిలోని 832 ఎకరాల్లో నిర్మిస్తుండగా- ఈ రెండు గ్రామాల్లో భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించారు. పరిశ్రమల కోసం చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో 1545 ఎకరాలు సేకరించనున్నట్లు 15 రోజుల కిందట ప్రకటన ఇవ్వగా.. అప్పటి నుంచి సమస్య మొదలైంది. పరిశ్రమలకు సేకరించనున్న భూముల్లో చేవూరులోని మాగాణి ఉంది. ఇక్కడ చిన్న, సన్నకారు రైతులే అధికం. తమకున్న కొద్దిపాటి పొలాన్ని తీసుకుంటే.. జీవనోపాధి ఎలా అనేది వారి ప్రశ్న. దీనికితోడు సుమారు 200 మంది ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు 60 ఏళ్లకుపైగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్నారు. రావూరులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి భూములకు రిజిస్ట్రేషన్ విలువ సుమారు రూ. 7.20 లక్షలు ఉండగా- పరిహారం కింద రూ. 22 లక్షలు ఇస్తున్నారు. రావూరులో రిజిస్ట్రేషన్ విలువ రూ.2.70 లక్షలు ఉండగా.. ఇక్కడి రైతులకు రూ. పది లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇదే సమస్యకు ఆజ్యం పోసింది. రెండు గ్రామాల్లో ఒకే రీతిన పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. చేవూరు పరిధిలో సుమారు 500 ఎకరాలకుపైగా చుక్కల భూములు ఉన్నాయి. వాటి క్రయ విక్రయాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తే మా బాధలు తీరే అవకాశం ఉందంటున్నారు.
సర్వే అడ్డగింత
గుడ్లూరు, న్యూస్టుడే: రామాయపట్నం ఓడరేవు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన పరిశ్రమలకు భూసేకరణ నిమిత్తం వెళ్లిన అధికారులకు గ్రామస్థుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో 1545 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. రెండు రోజులుగా గ్రామాల్లో భూముల సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదంటూ గ్రామస్థులు సర్వేను అడ్డుకున్నారు. సోమవారం భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే సిబ్బంది చేరుకోగా- అక్కడ గ్రామస్థులు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. పరిశ్రమలకు భూములిస్తే జీవనాధారం కోల్పోతామన్నారు. కూలీలుగా మారి.. పనుల కోసం వలసబాట పట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రావూరు గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం ఎదుట పందిరి వేసి.. భూములిచ్చే ప్రసక్తే లేదని.. రైతుల పొట్ట కొట్టొద్దంటూ నినాదాలు చేశారు. మా భూములు తీసుకోవద్దంటూ.. రావూరు గ్రామస్థులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దీంతో సర్వే సిబ్బంది చేసేదేమీ లేక వెనుదిరిగారు.
ఆ పరిస్థితే వస్తే...
ఓడరేవు భూసేకరణ సమయంలో అసైన్డ్, ప్రభుత్వ భూములకు.. పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని మొదట్లో ప్రకటించారు. చివరకు కేవలం రూ.2 లక్షలే ఇస్తామనడంతో బాధితులు అడ్డుకున్నారు. అనేక చర్చల అనంతరం ఎకరాకు రూ.5లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే వస్తే.. తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు అంటున్నారు.
ఉన్నతాధికారులకు తెలియజేస్తాం..
లావణ్య, తహసీల్దారు,గుడ్లూరు
రావూరు, చేవూరులో భూసేకరణకు గ్రామస్థులు అడ్డుపడిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. భూసేకరణ సర్వేకు వచ్చిన ప్రత్యేక ఉపకలెక్టరు పద్మావతి ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు
[ 02-06-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శనివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. -
గంటల వ్యవధిలో దంపతుల మృతి
[ 02-06-2024]
ఏ కష్టం వచ్చినా కలసి ఉంటామని మనువాడేటప్పుడు బాస చేసుకున్న ఆ దంపతులు ఒక్కటిగానే ఇహం వీడి పరం చేరారు. భార్య కన్నుమూతతో కలత చెందిన భర్త కూడా ఆమె మృతదేహంపై రోదిస్తూ తుది శ్వాస విడిచారు. -
సోమశిల.. సాగుకెలా?
[ 02-06-2024]
ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమకు 115 ఎంఎల్డీ నీటిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సోమశిల జలాశయం నీటి కేటాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పరిశ్రమల రాకతో ప్రగతికి బాటలు పడతాయని ఓ వర్గం అంటుండగా- ఈ ఏడాది ఎదురైన వర్షాభావ పరిస్థితులు.. -
భజే వాయుపుత్రం
[ 02-06-2024]
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమజ్జయంతిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అంజనీ సుతుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్గామిట్టలోని శబరి శ్రీరామ క్షేత్రంలో సామూహిక లక్ష మల్లెలార్చన నిర్వహించగా.. -
జమకాని సొమ్ము... జవాబు చెప్పేవారు లేరు!
[ 02-06-2024]
జూన్ నెలకూ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా- ఈసారి పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత మధ్య బ్యాంకుల వద్దకు చేరిన లబ్ధిదారులు.. -
కలగానే సొంత భవనాలు
[ 02-06-2024]
సంగంలోని ప్రభుత్వ ఆశ్రమ ఐటీఐకి సొంత భవనాలు కలగానే మిగిలాయి. ఏళ్లుగా పరాయి పంచనే తరగతులు నిర్వహిస్తున్నా.. ఐటీఐకి కేటాయించిన స్థలంపై కబ్జాదారులు కన్నేసి ప్రయత్నాలు చేస్తున్నా.. అదే సమయంలో గ్రావెల్ దొంగలు గుల్ల చేస్తున్నా.. -
నిబంధనలకు నీళ్లు
[ 02-06-2024]
జాతీయ రహదారి నిర్మాణంలో గుత్తేదారులు నిబంధనలకు నీళ్లొదిలారు. మట్టి తరలింపులో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించకుండా తీసుకెళుతున్నారు. -
అతివేగంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
[ 02-06-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కామాక్షి ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్యాంక్బండ్పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?
-
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రత పెంపు
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!
-
బ్రేకింగ్: ఏపీ ఎగ్జిట్ పోల్స్... మై యాక్సిస్ ఇండియాటుడే అంచనాలివే