మంచి పేరున.. ముంచిన జగన్
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు.
పథకాల లబ్ధి అందని వైనం
అంగన్వాడీ సిబ్బంది ఆవేదన
వంటావార్పుతో అంగన్వాడీల నిరసన (పాతచిత్రం)
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో కంటే రూ. వెయ్యి అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాదిలో మాత్రమే రూ. వెయ్యి పెంచి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ. 13,500 ఇస్తున్నారు.
‘మీ అన్నొస్తాడు... మీకు మంచే చేస్తాడు’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలకు సీఎం జగన్ గతంలో భరోసా ఇచ్చారు. ఆపై వారిని నిండా ముంచారు. జీతభత్యాలు మెరుగ్గా ఉన్నాయంటూ అప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాల వర్తింపును నిలిపేశారు. ఎన్నికలకు ముందు మంచి చేస్తానని చెప్పి... ఏరు దాటాక ముంచేశారంటూ అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం చెందుతున్నారు.
దుత్తలూరు, న్యూస్టుడే: జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,934 అంగన్వాడీ, 229 మినీ కేంద్రాలు ఉన్నాయి. 2,673 మంది కార్యకర్తలతోపాటు 2,665 మంది సహాయకులు (ఆయాలు) పనిచేస్తున్నారు. మినీ కేంద్రాల్లో 226 మంది విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటే రూ. వెయ్యి అదనంగా వేతనం పెంచటమే కాదు... సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ 2019 ఎన్నికలకు ముందు అంగన్వాడీ సిబ్బందికి జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్య పరిష్కరించలేదు. రకరకాల యాప్లు, సర్వేల పేరుతో అదనపు పనిభారం మోపారు. నాలుగున్నరేళ్లు ఓపికగా ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విధిలేక సమ్మె బాట పట్టారు. అయినా ప్రభుత్వం ఎస్మా, ఉద్యోగాల తొలగింపు తదితర అస్త్రాలతో బెదిరించి విధుల్లో చేరేలా చేసిందే తప్ప చిరుద్యోగులైన వారి సమస్య ఒక్కటైనా తీర్చుదామన్నా ప్రయత్నం చేయలేదు.
- గత అయిదేళ్లలో టీఏ, డీఏలు, కూరగాయలు, నిత్యావసర సరకులకు సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. గ్యాస్, నిత్యావసర వస్తువులకు సంబంధించి అంగన్వాడీలు సొంత డబ్బులే చెల్లించే పరిస్థితి నెలకొంది. ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్న వేతన పెంపు, గ్రాట్యుటీ, మినీ కేంద్రాల సిబ్బందిని ప్రధాన కార్యకర్తలుగా గుర్తింపు, ఆయాలకు అంగన్వాడీలుగా పదోన్నతి, ఉద్యోగ విరమణ వయసు పెంపు, కేంద్రాల అద్దె బకాయిలు సకాలంలో చెల్లింపులు... ఇలా ఏ ఒక్కటీ కూడా పరిష్కారానికి నోచుకోలేదని వారు వాపోతున్నారు. తెదేపా హయాంలో అన్నీ పథకాలు వర్తిస్తుండగా జగన్ పాలనలో అంగన్వాడీలను అమ్మఒడి, విద్యా, వసతి దీవెనలు, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు సామాజిక పింఛన్లు తదితర పథకాలకు అనర్హులను చేసింది.
- పదకొండు డిమాండ్లతో అంగన్వాడీ సిబ్బంది గత ఏడాది డిసెంబరు 12 నుంచి జనవరి 22 వరకు అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తే ప్రభుత్వ చర్చల్లో భాగంగా సమ్మె కాలానికి వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది.
పనికి తగ్గ వేతనం లేదు
ఓ అంగన్వాడీ కార్యకర్త
ప్రభుత్వం పనిభారం మోపుతుందే తప్ప దానికి తగ్గట్లుగా వేతనం ఇవ్వటంలేదు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కరించిన దాఖలాల్లేవు. దీనికితోడు కార్యకర్తలు, ఆయాలకు నెలనెలా సక్రమంగా జీతాలు అందకపోతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. నిత్యావసర సరకుల బిల్లులు సకాలంలో మంజూరు చేయకపోవడంతో అప్పులు చేసి చిన్నారులకు వడ్డించాల్సి వస్తోంది. తెలంగాణలో ఇచ్చే గౌరవ వేతనాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు
[ 02-06-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శనివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. -
గంటల వ్యవధిలో దంపతుల మృతి
[ 02-06-2024]
ఏ కష్టం వచ్చినా కలసి ఉంటామని మనువాడేటప్పుడు బాస చేసుకున్న ఆ దంపతులు ఒక్కటిగానే ఇహం వీడి పరం చేరారు. భార్య కన్నుమూతతో కలత చెందిన భర్త కూడా ఆమె మృతదేహంపై రోదిస్తూ తుది శ్వాస విడిచారు. -
సోమశిల.. సాగుకెలా?
[ 02-06-2024]
ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారీ పరిశ్రమకు 115 ఎంఎల్డీ నీటిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సోమశిల జలాశయం నీటి కేటాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పరిశ్రమల రాకతో ప్రగతికి బాటలు పడతాయని ఓ వర్గం అంటుండగా- ఈ ఏడాది ఎదురైన వర్షాభావ పరిస్థితులు.. -
భజే వాయుపుత్రం
[ 02-06-2024]
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమజ్జయంతిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అంజనీ సుతుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్గామిట్టలోని శబరి శ్రీరామ క్షేత్రంలో సామూహిక లక్ష మల్లెలార్చన నిర్వహించగా.. -
జమకాని సొమ్ము... జవాబు చెప్పేవారు లేరు!
[ 02-06-2024]
జూన్ నెలకూ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా- ఈసారి పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత మధ్య బ్యాంకుల వద్దకు చేరిన లబ్ధిదారులు.. -
కలగానే సొంత భవనాలు
[ 02-06-2024]
సంగంలోని ప్రభుత్వ ఆశ్రమ ఐటీఐకి సొంత భవనాలు కలగానే మిగిలాయి. ఏళ్లుగా పరాయి పంచనే తరగతులు నిర్వహిస్తున్నా.. ఐటీఐకి కేటాయించిన స్థలంపై కబ్జాదారులు కన్నేసి ప్రయత్నాలు చేస్తున్నా.. అదే సమయంలో గ్రావెల్ దొంగలు గుల్ల చేస్తున్నా.. -
నిబంధనలకు నీళ్లు
[ 02-06-2024]
జాతీయ రహదారి నిర్మాణంలో గుత్తేదారులు నిబంధనలకు నీళ్లొదిలారు. మట్టి తరలింపులో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించకుండా తీసుకెళుతున్నారు. -
అతివేగంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
[ 02-06-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కామాక్షి ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య