మత్తు పదార్థం పట్టివేత.. నలుగురి అరెస్టు
నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న నలుగురిని భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం భిక్కనూరు సీఐ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పెద్దమల్లారెడ్డి శివారులో కారులో అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేసి ముగ్గురిని పట్టుకున్నారు.
వివరాలు వెల్లడిస్తున్న భిక్కనూరు సీఐ సంపత్
భిక్కనూరు, న్యూస్టుడే: నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న నలుగురిని భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం భిక్కనూరు సీఐ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పెద్దమల్లారెడ్డి శివారులో కారులో అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేసి ముగ్గురిని పట్టుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో జంగంపల్లి శివారు బీటీఎస్ వద్ద మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులుగా గుర్తించిన వారిలో నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్కు చెందిన గొల్లపల్లి నరేష్గౌడ్, మాక్లూర్కు చెందిన ఎల్లగోని సంతోష్గౌడ్, సంగం గ్రామానికి చెందిన కేసరి మల్లికార్జున్గౌడ్, కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన భీమగోని దత్తాత్రిగౌడ్ ఉన్నారు. వారి నుంచి కారు, రూ.2.50 లక్షల విలువైన 248 గ్రాముల అల్ప్రాజోలం, 4 చరవాణులు, రూ.37,020 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమెదు చేసి కామారెడ్డి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. వారిని నిజామాబాద్ జైలుకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఎస్సై సాయికుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా ప్రగతి సాగాలి
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్ది ప్రత్యేక స్థానం. అభివృద్ధిలోనూ ప్రత్యేక ముద్ర కనిపించినా.. ఆశించిన ఫలితాలు దక్కలేదు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది. నేటితో 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటోంది. -
ఉద్యమానికి ఊపిరై.. స్వరాష్ట్ర సాధకులై
[ 02-06-2024]
నిజాం చెర నుంచి విముక్తి కోసం జరిగిన విమోచనోద్యమంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యేవరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు పోరాట పటిమతో ఉద్యమం చేపట్టారు. -
రాష్ట్ర గీతం సృష్టికి ఇందూరే స్ఫూర్తి
[ 02-06-2024]
రాష్ట్ర గీతంగా గుర్తించడం అందెశ్రీకి దక్కిన గౌరవం. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి దాశరథి ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ ఊపిరిలూదితే.. మలి దశ పోరాటంలో అందరిలో స్ఫూర్తి నింపింది అందెశ్రీ గీతం.. -
తండా రోడ్డు తవ్వేశారు...
[ 02-06-2024]
రైతుల మధ్య ఏర్పడిన పంచాయితీ రోడ్డు తవ్వేయడానికి కారణమైంది. మంచిప్పకు చెందిన ఓ రైతు శివలాల్ తండాకు వెళ్లే రోడ్డును పొక్లెయిన్తో శనివారం తవ్వించేశారు. -
ఉపాధి కల్పిస్తానని మోసం
[ 02-06-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రంలో దక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరిట విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసగించిన ఘటన శనివారం వెలుగుచూసింది. -
డిగ్రీ పరీక్షల్లో ముగ్గురి డిబార్
[ 02-06-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో నిజామాబాద్లోని ఇందూరు ఉషోదయ, బోధన్లోని ఎస్వీ, ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. -
అక్రమ కుళాయిలపై కొరడా
[ 02-06-2024]
నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అక్రమ కుళాయిలపై కొరడా ఝలిపించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు రంగం సిద్ధం చేశారు. -
కలెక్టరేట్లో వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదివారం ఉదయం 8.45కు వినాయక్నగర్లోని అమరవీరుల
తాజా వార్తలు (Latest News)
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్