సముద్ర ఉపరితలంలో గాలులు
బంగాళాఖాతం ఉపరితలంలో గాలులు వీస్తున్నాయని, సోమవారం నుంచి వీటి వేగం గంటకు 50 కిలోమీటర్లకుపైగా ఉంటుందన్న అంచనాతో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసినట్లు గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్దాస్ ఆదివారం ‘న్యూస్టుడే’కు చెప్పారు.
చేపల వేటపై ఐఎండీ ఆంక్షలు
గోపాలపూర్, న్యూస్టుడే: బంగాళాఖాతం ఉపరితలంలో గాలులు వీస్తున్నాయని, సోమవారం నుంచి వీటి వేగం గంటకు 50 కిలోమీటర్లకుపైగా ఉంటుందన్న అంచనాతో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసినట్లు గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్దాస్ ఆదివారం ‘న్యూస్టుడే’కు చెప్పారు. దీనిపై విపత్తుల నివారణశాఖ (ఓఎస్డీఎంఏ) యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 6 నుంచి 8 వరకు సముద్ర కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని, ఈ మూడు రోజులు చేపల వేట నిలిపివేయాలని సూచించామన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగినా ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సోమవారం నుంచి స్వల్పంగా తగ్గుతాయన్న అంచనా ఉందన్నారు. బాలేశ్వర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రపడ, కటక్, జగత్సింగ్పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, గంజాం, గజపతి, కేంఝర్, మయూర్భంజ్, అనుగుల్, ఢెంకనాల్, కొంధమాల్, రాయగడ, కొరాపుట్, కలహండి జిల్లాల్లో సోమవారం కాలవైశాఖి ప్రభావం చూపే సూచనలు ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. 8వ తేదీ వరకు రాష్ట్రంలో గాలివానకు అవకాశం ఉన్నందున ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న అంచనా ఉందన్నారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఓఎస్డీఎంఏ అధికారులు తీర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్పై వెళ్లి ఓటేసిన కేంద్ర మాజీ మంత్రి
[ 02-06-2024]
పంచాయతీ వార్డు సభ్యుడు కూడా హంగు, ఆర్భాటం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ సైకిల్పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. -
ముగిసిన పోలింగ్
[ 02-06-2024]
రాష్ట్రంలో చివరిదైన నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు శనివారం ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళో భువనేశ్వర్లో పేర్కొన్నా అక్కడక్కడా స్వల్ప ఘటనలు, కొట్లాటలు జరిగాయి. -
కొరాపుట్ సింహాసనం ఎవరికో?
[ 02-06-2024]
కొరాపుట్ లోక్సభ స్థానం ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొరాపుట్, రాయగడ జిల్లాలకు చెందిన 7 నియోజకవర్గాలతో కూడిన లోక్సభ స్థానంలో 1957 నుంచి 18 సార్లు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. -
రవుర్కెలాలో 18కి పెరిగిన మృతుల సంఖ్య
[ 02-06-2024]
రవుర్కెలా ఉక్కు నగరంలో వడదెబ్బ మృతుల సంఖ్య 18కి పెరిగింది. శనివారం చికిత్స పొందుతున్న బాధితుల్లో ఆరుగురు తుదిశ్వాస విడిచినట్లు రవుర్కెలా అదనపు కలెక్టరు (ఏడీఎం) అశుతోష్ కులకర్ణి విలేకరులకు చెప్పారు. -
‘పద్మశ్రీ’ మగుణి కన్నుమూత
[ 02-06-2024]
ప్రాచీనమైన తోలుబొమ్మలాటను విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి చరణ్ కువర్ (88) శనివారం ఉదయం కేంఝర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
కొంచెం తీరిక... పుస్తకాలతో తీరేను బడలిక
[ 02-06-2024]
పూర్వాశ్రమంలో రచయితగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పర్యావరణవేత్త. ఆయన రచించిన పుస్తకాల్లో ‘ది గార్డ్న్ ఆఫ్ లైఫ్’ ఆంగ్ల రచన దేశవిదేశాల్లో పాఠకుల మన్ననందుకుంది. చెట్లు, కాండాలు, బెరళ్లు, లతలు, పుష్పాల్లో ఔషధీయ గుణాలున్నాయని అందులో వివరించారు. -
దోపిడీ ముఠా అరెస్ట్
[ 02-06-2024]
నవరంగపూర్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు శనివారం ఓ ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ వర్మా మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన సదరు సమితి దంగరబేజి గ్రామంలో సునీల్ సాహు ఇంట్లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. -
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డున పడ్డ కుటుంబం
[ 02-06-2024]
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడ్డ ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. నందహండి సమితి జడబంద గూడ పంచాయతీ ముదులిగూడ గ్రామానికి చెందిన పద్మన్ బిశోయి ఆవాస్ యోజన ఇల్లు కోసం భార్య కనక పేరిట దరఖాస్తు చేసుకున్నారు. -
పోలింగ్ కేంద్రంలో తమలపాకుల అలంకరణ
[ 02-06-2024]
పూరీ జిల్లా కాకట్పూర్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తమలపాకులతో అలంకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల