వైద్యుడిగా బాధపడుతున్నా..
ఏందయ్యా ఇది..ఒక్క వైద్యుడు కూడా లేడు. ఏం చేస్తున్నారిక్కడ.. ఒక వైద్యుడిగా చాలా బాధపడుతున్నా... ఇంత మంది వైద్యులుండి ఏం లాభం.. విధులకు డుమ్మా కొడితే ఎలా..? అంటూ మంత్రి సీదిరి
పలాస ఆసుపత్రిలో మంత్రి అప్పలరాజు ఆకస్మిక తనిఖీ
ఒక్కరే డాక్టరు ఉండటంతో అసహనం
పలాస, న్యూస్టుడే
సూపరింటెండెంట్ రమేష్పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న మంత్రి అప్పలరాజు
ఏందయ్యా ఇది..ఒక్క వైద్యుడు కూడా లేడు. ఏం చేస్తున్నారిక్కడ.. ఒక వైద్యుడిగా చాలా బాధపడుతున్నా... ఇంత మంది వైద్యులుండి ఏం లాభం.. విధులకు డుమ్మా కొడితే ఎలా..? అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
..శనివారం ఉదయం 11.35 గంటలకు ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీడీ విభాగానికి చెందిన ఒక్క వైద్యుడు మాత్రమే విధులు నిర్వహిస్తూ కనిపించారు. మిగిలిన ఇద్దరు గైనికాలజిస్టులు, ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులతో పాటుగా సూపరింటెండెంట్ సైతం రాకపోవటంతో అసహనంతో నిరీక్షించారు. కాసేపటికి సూపరింటెండెంట్ రావడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటబెట్టుకొని వార్డుల్లోని రోగుల్ని, సదుపాయాల్ని ప్రశ్నించారు. ఆసుపత్రి మొదటి అంతస్తు పనులు సక్రమంగా లేకపోవటంతో ఇంజినీర్లను ప్రశ్నించారు. ఎత్తు పల్లాలతో నిర్మిస్తే రోగులను స్ట్రెచర్పై ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.
మీరూ పరిశీలించండి
ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవటంతో కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్కు మంత్రి ఫోన్లో ఫిర్యాదు చేశారు. మీరూ ఒకసారి వచ్చి పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆవేదనతోనే చర్యలు తీసుకోమన్నా..
ఆసుపత్రిని రూ.5 కోట్లతో తీర్చిదిద్దుతుంటే ప్రత్యేక వైద్యులు ఒక్కరూ మధ్యాహ్నం వరకూ అందుబాటులో లేకపోవటంతో ఏమనాలో తెలియటం లేదని మంత్రి అన్నారు. ఆసుపత్రి బయట విలేకర్లతో మాట్లాడుతూ గైర్హాజరవుతున్న వైద్యులపై మెడికల్ అండ్ హెల్త్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వివరించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై సాధ్యమైనంత వరకు రోజూ ఆసుపత్రికి వస్తానని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుల వాన
[ 02-06-2024]
జిల్లాలో పలుచోట్ల శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలాస డివిజన్లో అత్యధికంగా, శ్రీకాకుళంలో సాధారణ వర్షం కురిసింది. -
తవ్వకాలతో ముప్పు.. కలగదా కనువిప్పు..?
[ 02-06-2024]
ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట మందస మండలాలకు సంబంధించి 50 వేల ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగునీరు అందించడానికి రెండు నదులపై వివిధ ప్రాజెక్టులు నిర్మించారు. -
ఎన్నికల ఫలితాల ప్రకటనలో అలసత్వం వద్దు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న చేపట్టే ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాల ప్రకటన విషయంలో సంబంధిత అధికారులు ఎలాంటి అలసత్వం వహించవద్దని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. -
ఈసారీ ఎదురుచూపులేనా..?
[ 02-06-2024]
ఇంటర్ విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేకుండా చదువు సాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సరఫరా చేసేవారు. -
గంటలోనే ముగించేశారు..!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులో ఉండటం, ఓట్ల లెక్కింపు ప్రభావం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంపై పడింది. -
ఆంక్షలు ఇవీ.. గమనించండి..!
[ 02-06-2024]
జిల్లాలో ఈ నెల 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వాహనాల రాకపోకలకు సంబంధించి ఆంక్షలు విధించారు. -
ఆర్భాటమే మిగిలింది
[ 02-06-2024]
మండలం పరిధి బూర్జపాడులో పాలకేంద్రం నిర్మాణమిది. పునాదులు వేసి పిల్లర్ల నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆపేశారు. బిల్లుల మంజూరులో జాప్యం నెలకొంది. -
ఇచ్చేది గోరంత.. కోరేది కొండంత
[ 02-06-2024]
శిక్షణలో వంటల తయారీకి నూనె ఎంత వేయాలి, పప్పు దినుసులు, మసాలా ఎంత వాడాలో చెబుతున్నారు. మెలకువలు నేర్పిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ