అన్యాయం జరిగింది.. ఆపండి!
స్టాఫ్నర్స్ పోస్టుల కౌన్సెలింగ్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు నిరసన తెలియజేశారు. కొవిడ్ కాలంలో పనిచేసిన ఎస్సీ అభ్యర్థులకు మార్కులు వేయడంలో, జాబితా పొందుపర్చడంలో తప్పిదాలు జరిగాయని, కౌన్సెలింగ్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
స్టాఫ్నర్స్ల కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఆందోళన
కౌన్సెలింగ్ కేంద్రం వద్ద నిరసన తెలియజేస్తున్న అభ్యర్థులు
సీతంపేట, న్యూస్టుడే: స్టాఫ్నర్స్ పోస్టుల కౌన్సెలింగ్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు నిరసన తెలియజేశారు. కొవిడ్ కాలంలో పనిచేసిన ఎస్సీ అభ్యర్థులకు మార్కులు వేయడంలో, జాబితా పొందుపర్చడంలో తప్పిదాలు జరిగాయని, కౌన్సెలింగ్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ జోన్- 1 పరిధిలో విశాఖ రామాటాకీస్ రోడ్డులోని ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభించగా.. ఉదయం 11 గంటల నుంచే ఈ నిరసన మొదలయింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సి.ఐ. సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమస్య ఇదీ: ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కాంట్రాక్టు పద్ధతిలో 179 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ గతంలో విడుదల చేశారు. 172 పోస్టులకు సుమారు 9వేల దరఖాస్తులు అందాయి. వీటిలో మెరిట్, రిజర్వేషన్ ప్రక్రియ కింద ఎంపిక చేసిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 18వ తేదీ వరకు చేశారు. అనంతరం అదే రోజు రాత్రి మెరిట్ జాబితా, తద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చారు. దీని ఆధారంగా శుక్రవారం ఉదయం 11గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించి, వచ్చిన అభ్యర్థులకు ఖాళీల ఆధారంగా పోస్టులు కేటాయించి ఉత్తర్వులు అందించి పంపించారు. అయితే మెరిట్, ఎంపిక జాబితాలు రెండూ వెబ్సైట్లో పొందుపర్చారు. మెరిట్ జాబితాను రెండు సార్లు పెట్టడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ కౌన్సెలింగ్పై కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిలిపుదల చేయిస్తామని ఎ.ఐ.టి.యు.సి ప్రతినిధి అమర్ తెలిపారు.
* వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఉమా సుందరి పోలీసుల రక్షణలో నిరసన తెలియజేస్తున్న అభ్యర్థుల నుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే నడుచుకున్నామన్నారు. సిబ్బంది కొరత కారణంగా తొలి జాబితాలో తప్పు దొర్లిన విషయం వెలుగు చూసిందని, దీంతో క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా విడుదల చేశామన్నారు.
* పసి పిల్లలతో వచ్చి: కౌన్సెలింగ్ కోసం వచ్చిన అభ్యర్థులు పలు తిప్పలు పడ్డారు. నిల్చోవడానికి టెంట్లు వేసినప్పటికీ తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని పలువురు ఆరోపించారు. అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వక పోవడంతో మెరిట్ జాబితాలో ఉన్న చాలామంది ఉత్తరాంధ్రలోని మారూమూల ప్రాంతాల నుంచి సహాయకుల సహాయంతో వచ్చారు. కొంతమంది తల్లులు పసిపిల్లలతో సైతం కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
* కౌన్సెలింగ్కి 136మంది హాజరు: కౌన్సెలింగ్కు 172 మందిని పిలవగా 136 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఉమా సుందరి తెలిపారు. మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 108 పోస్టులకు 81, విమ్స్లోని 24 పోస్టులకు 18, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ)లో 47 పోస్టులకు 29 మాత్రమే భర్తీ అయ్యాయని, 8మంది అభ్యర్థులు సుముఖత చూపలేదన్నారు. ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
[ 02-06-2024]
నగరంలో ఆదివారం ఉదయం ఈదరుగాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలాయి. -
అధికార పార్టీ అండ.. అడ్డులేని దందా..
[ 02-06-2024]
అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు.. మున్సిపల్ నేత పేరు చెప్పి మరికొందరు ఎలమంచిలిలో అక్రమంగా ఇసుక, కంకర వ్యాపారం చేస్తూ రెండు చేతులా అక్రమంగా సంపాదిస్తున్నారు. -
భీమిలి తీరంలో విధ్వంసం ‘విజయ’వంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
విఘాతం కలిగిస్తే సహించం
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ కోరారు. శనివారం ఇక్కడి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాంతిభద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు
[ 02-06-2024]
ఈ నెల నాలుగున ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. -
మురుగు సొగసు కనుమా!
[ 02-06-2024]
సాధారణంగా వర్షాకాలం వచ్చేలోపే జీవీఎంసీ అధికారులు గెడ్డలు, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించి పూడికలు తీయాలి. అయితే ఈ ఏడాది పనులు ఆలస్యంగా మొదలు కావడంతో ఇప్పటికీ చాలా చోట్ల పూడిక పనులు పూర్తికాలేదు. -
పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితం
[ 02-06-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి పోలైన ఓట్లను ఈనెల 4న ఉదయం 8 గంటల నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని 21 హాళ్లలో లెక్కిస్తామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
వర్షంతో ఉపశమనం
[ 02-06-2024]
ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లావాసులకు వర్షంతో ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులతో నగరం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రి విశాఖలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. -
సింగపూర్కు ‘ఐఎన్ఎస్ శివాలిక్’ నౌక
[ 02-06-2024]
భారత నౌకాదళానికి చెందిన రక్షణ నౌక ‘ఐఎన్ఎస్ శివాలిక్’ సింగపూర్ పర్యటనకు వెళ్లిందని శనివారం నేవీ వర్గాలు తెలిపాయి. దక్షిణ చైనా పసిఫిక్ సముద్ర గస్తీ విధుల్లో భాగంగా శివాలిక్ నౌక -
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
[ 02-06-2024]
సరకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు సృష్టించిందని ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ‘ఈ ఏడాది మార్చిలో 201 నౌకల ద్వారా 76,22,732 మెట్రిక్ టన్నుల సరకు రవాణా ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది. -
3వ తేదీన విశాఖ- గుణుపురం రైలు రద్దు
[ 02-06-2024]
నౌపడా-గుణుపురం మార్గంలో తిరుగుతున్న విశాఖ- గుణుపురం రైలు ఈ నెల 3వ తేదీన రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్