రైతుల దరి చేరని భూసార పరీక్షలు
దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి.
సద్వినియోగం చేసుకుంటే ఎంతో మేలు
జనగామ రూరల్, న్యూస్టుడే: దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. సాగు ఖర్చు తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గాలంటే భూసార పరీక్షలే శరణ్యం. అలాగే పంట దిగుబడి పెరుగాలంటే భూములు సారవంతంగా ఉండాలి. గత నాలుగేళ్లుగా పరీక్షలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో అన్నదాతలు ఎవరికి తోచినట్లు, వారి వారి సౌలభ్యతలను బట్టి ఎరువులను వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని వల్ల పూర్తి స్థాయిలో ఫలితాలను పొందలేక పోతున్నారనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ప్రస్తుత వేసవిలో పంటలకు తాత్కాలిక విరామం ఏర్పడటంతో రైతులు ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. పరీక్షల నిర్వహణ జిల్లాలో పూర్తిగా నిలిచిపోయిన తీరుపై ‘న్యూస్టుడే’ కథనం.
సాగు ఇలా..
జిల్లాలో సాగుకు అనుకూలమైన 3.90 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 2.20 లక్షలు తరి, 1.70 లక్షల ఎకరాల మెట్ట భూములున్నాయి. వీటిలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుసెనగ పంటలను పండిస్తున్నారు. గత 7-8 ఏళ్లుగా రైతులు సాగుకు విరామం లేకుండా రెండు పంటలను పండిస్తున్నారు. దీంతో భూములు సారాన్ని కోల్పోతూ నిస్సారమవుతుండటంతో ప్రస్తుత యాసంగి దిగుబడి తగ్గుముఖం పట్టిందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూణ్నాళ్ల ముచ్చటగానే..
సాగు రంగానికి ప్రాధాన్యత కల్పించేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను క్లస్టర్లుగా విభజించి రైతు వేదికలను నిర్మించింది. వీటిలో అన్నదాతలకు సాగు రంగంలో మెళకువలు నేర్పటం, పంట సాగు విధానంపై అవగాహన కల్పించటం, భూసార పరీక్షలు నిర్వహించేందుకు మినీ కిట్స్ను సైతం ఏర్పాటు చేసింది. ఆరంభంలో ఒకమారు పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ ఏర్పాటు చేసి మిని కిట్స్, అందుకు అవసరమైన రసాయనాలను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.
జిల్లాలో మొత్తం రైతులు: 1.81 లక్షల మంది
సాగు భూమి: 3.90 లక్షల ఎకరాలు
నమూనాలు ఇస్తే.. ఫలితాలు అందిస్తాం..
- వినోద్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, జనగామ
భూసార పరీక్షలతో భూమిలో లోపాలు తెలుసుకొని వాటిని రైతులు పూడ్చుకునేందుకు అవకాశముంది. ప్రస్తుతం జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆసక్తి కల్గిన రైతులు భూమిని దున్నక ముందే భూమిలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి సంబంధిత ఏఈవో, ఏవోలకు అందజేయాలి. వాటిని వరంగల్కు తరలించి, అనంతరం వాటి ఫలితాలను అందజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూపాయి గొడవ.. ప్రాణం తీసింది
[ 02-06-2024]
కేవలం ఒక్క రూపాయి విషయంలో జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన వరంగల్ లేబర్కాలనీలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
పదేళ్ల ప్రస్థానం.. ప్రగతికి దిశానిర్దేశం
[ 02-06-2024]
ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పదేళ్ల వయసున్న చిన్న పాప లాంటిది. రాబోయే పదేళ్లకల్లా తెలంగాణ నవ యవ్వనంగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలి. స్వరాష్ట్రం సాకారమై దశాబ్దం పూర్తి చేసుకున్న ఈ సంతోష క్షణాల్లో ‘విజన్ ఓరుగల్లు- 2034’కు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. -
రాష్ట్రావతరణ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖిలా వరంగల్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం ఉదయం 8.15 గంటలకు కలెక్టర్ ప్రావీణ్య అమరవీరులకు నివాళులర్పించనున్నారు. -
310 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
[ 02-06-2024]
నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని, సుమారు 310 కిలోల విత్తనాలు, నిషేధిత గడ్డి నివారణ మందును వరంగల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
జిల్లాలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. కలెక్టరేట్, జడ్పీ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్లోని టౌన్హాల్, పోలీసు కమిషనరేట్తో పాటు మండల కేంద్రాల్లోనూ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆవిర్భావ వేడుకలకు వేళాయే..
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం కలెక్టరేట్లో అన్ని శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా చేతులమీదుగా జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. -
ముస్తాబైన కలెక్టరేట్
[ 02-06-2024]
జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా కలెక్టరేట్ ముస్తాబైంది. జాతీయ జెండాను పోలిన మూడు రంగుల పరదాలతో భవనాన్ని అలంకరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పల్లెకు దూరంగా ఆర్టీసీ సేవలు
[ 02-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పలు చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. చాలా గ్రామాల్లో బస్సులు ఆగకుండానే వెళుతున్నాయి. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. -
భూమి చదును చేస్తుండగా అడ్డుకున్నారని రైతు ఆత్మహత్యాయత్నం
[ 02-06-2024]
తన పట్టా భూమిని చదును చేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధి పెద్దవెంకటాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్