వైకాపా మ్యానిఫెస్టో ఫట్.. కూటమి సూపర్-6 బ్లాక్బస్టర్ హిట్
‘నాయకుడికి పరిపాలనా దక్షత ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద సృష్టించాలి. దాంతో ప్రజలకు సంక్షేమం అందించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థలో రహస్యం. కానీ, జగన్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు.
ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్రెడ్డి చేతులెత్తేశారు
నేను అభివృద్ధికి.. జగన్ నేరాలు, ఘోరాలకు బ్రాండ్
ఆత్మకూరు, కోవూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు
ఈనాడు, నెల్లూరు: ‘నాయకుడికి పరిపాలనా దక్షత ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద సృష్టించాలి. దాంతో ప్రజలకు సంక్షేమం అందించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థలో రహస్యం. కానీ, జగన్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు. నేరాలు, ఘోరాలు చేయడంలో పీహెచ్డీ చేశారు. మాట తప్పి.. మడమ తిప్పారు. మ్యానిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు.
99.05% హామీలు చేశానని చెప్పారు. అదే జరిగితే ప్రజల ఆదాయం పెరగాలి. మీలో ఎవరి ఆదాయమైనా పెరిగిందా? ఖర్చులు పెరిగాయి. కూటమి మ్యానిఫెస్టో సూపర్ సిక్స్.. బ్లాక్బస్టర్ హిట్ అయింది. అంతకంటే ఏమీ చేయలేనని జగన్రెడ్డి చేతులెత్తేశారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం నిర్వహించిన ‘ప్రజాగళం’ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘‘ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి, మన భవిష్యత్తును మార్చబోతున్నాయి. ఇప్పటివరకు 54 సభల్లో పాల్గొన్నాను. ప్రతిచోటా రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో చాలామంది జీవితాలు తారుమారయ్యాయి. జగన్, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల తప్ప మరెవ్వరూ బాగుపడలేదు’’ అని విమర్శించారు.
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?
‘మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఆ హామీ ఏమైంది? నాడు క్వార్టర్ బాటిల్ రూ.60 ఉంటే.. నేడు రూ.200 అయ్యింది. రూ.140 ఎవరి జేబులోకి పోతున్నాయి? మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? పరిశ్రమలు వచ్చాయా? జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలి. ఏం కావాలో ప్రజలే నిర్ణయించాలి. గులకరాయి డ్రామాతో ఎన్నికల వరకు బ్యాండేజి తీయొద్దని అనుకున్నారు. ఇప్పుడు అందరూ బ్యాండేజి పెట్టడంతో అది తీసేశారు. కనపడని గులకరాయితో దాడి చేయించానట! కోడికత్తి డ్రామాలాడతారు. దాన్ని నేను గుచ్చానంట? ఈ డ్రామాల రాయుడిని ఏం చేద్దాం? అందరూ ఓటేసి తరిమికొట్టాల్సిన సమయం వచ్చింది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గనుల మీదున్న శ్రద్ధ.. వ్యవసాయశాఖపై ఏదీ?
‘సోమశిల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 36 నుంచి 78 టీఎంసీలకు పెంచిన వ్యక్తి ఎన్టీఆర్. కండలేరు ప్రాజెక్టు నిర్మించి.. పెన్నా డెల్టాతో పాటు నెల్లూరు జిల్లాను సుస్థిరం చేసిన పార్టీ తెదేపా. కండలేరు నిండిన తర్వాతే చెన్నైకి నీటిని తీసుకెళ్లేలా ఎన్టీఆర్ చొరవ చూపారు. నేను శ్రీశైలం నుంచి 45 టీఎంసీలు తీసుకొచ్చాను. వైకాపా ప్రభుత్వంలో నీళ్లొచ్చాయా? కనీసం వరదలకు కొట్టుకుపోయిన సోమశిల ఆప్రాన్కు మరమ్మతులు చేయలేకపోయారు. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి గనులపై ఉన్న శ్రద్ధ సేద్యంపై లేదు. కొవిడ్ సమయంలోనూ 860 కిలోల పుట్టికి 160 కిలోల ధాన్యాన్ని మంత్రి దోచుకున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే రైతులకు రూ.20వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని చంద్రబాబు తెలిపారు. రైతులకు ఏం చేస్తారో జగన్ కనీసం మ్యానిఫెస్టోలో చెప్పలేదన్నారు.
జగన్రెడ్డి నెత్తిన రూపాయి పెడితే.. ఎవరైనా కొంటారా.?
‘ఆత్మకూరు మున్సిపల్ ఛైర్పర్సన్ వెంకటరమణమ్మ పార్టీ మారితే వైకాపా నాయకులు అవమానించారు. నెత్తిన రూపాయి పెడితే 5 పైసలకు పనికిరారంటూ సామాజికవర్గాన్ని ప్రస్తావిస్తూ మరీ కించపరిచారు. అసలు జగన్రెడ్డి నెత్తిన రూపాయి పెడితే ఎవరైనా కొంటారా? తల్లికే అన్నం పెట్టని జగన్.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధి చేసి చూపిన వ్యక్తి ఆనం రామనారాయణరెడ్డి, సేవాభావంతో ప్రజలకు మేలుచేసిన వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులకు ఓటేసి గెలిపిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, విజయరామిరెడ్డి, పోలంరెడ్డి దినేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదే ఉత్సాహం ఓటేయడంలోనూ చూపాలి!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద శుక్రవారం మందుబాబులు బారులుతీరారు. -
వైట్ కాలర్ రాజకీయ మాఫియా!
ఆ సంస్థ ఒక వైట్ కాలర్ రాజకీయ మాఫియా.. విష ప్రచారానికి పుట్టినిల్లు.. అన్నీ కుట్రలు, కుతంత్రాలే.. అంతా మాయాప్రచారమే.. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు వక్రీకరించడమే. -
జగన్.. మీ తల్లీ చెల్లెళ్లకు సమాధానమివ్వండి: సీఎం రేవంత్ కౌంటర్
ఏపీ సీఎం జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. -
పవన్కల్యాణ్ను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దాం: ముద్రగడ కుమార్తె క్రాంతి
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపిద్దామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి కోరారు. -
ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామంలో తెదేపా కార్యకర్తపై వైకాపా దాడి
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామం ఎల్లవరంలో తెదేపా కార్యకర్తపై వైకాపా మూకలు దాడిచేసి గాయపర్చాయి. -
జులై 1న రూ.7,000 పింఛను
సామాజిక పింఛన్లు ప్రవేశపెట్టింది.. దాన్ని రూ.200 నుంచి 2 వేలు చేసిందీ తెదేపా ప్రభుత్వమేనని.. ఈసారి కూటమి అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. -
భాజపాకు ఏ టీం బాబు.. బీ టీం జగన్
‘భాజపాకు ఏ టీం చంద్రబాబు, బీ టీం జగన్మోహన్రెడ్డి... వీరిలో ఎవరికి ఓటేసినా భాజపాకు వేసినట్లే. -
ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు కడప ఎంపీ అవినాష్రెడ్డే అని సీబీఐ నిర్ధారించినా.. లోకమంతా కోడై కూస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ప్రశ్నించారు. -
‘ప్రజల జీవితాల్లో సంతోషమే’ చంద్రబాబు ఆకాంక్ష
‘చంద్రబాబు నాయకత్వం గురించి ప్రజలకు తెలుసు. ఆయన తప్పకుండా అధికారంలోకి వస్తారు. ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. హామీలన్నింటినీ నెరవేరుస్తారు. అంతటితోనే ఆయన ఆగరు. -
ధగధగలా? దగానా?.. యువతా ఎవరు కావాలో తేల్చుకో?
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావడం కీలకం. కానీ, మన రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన కదా! యువత ఉపాధి మార్గాలపై దెబ్బ కొట్టిన వైకాపా కావాలో.. కొలువులు అందించడంతోపాటు ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చిన తెదేపా కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. -
రాష్ట్రానికి పట్టిన అరిష్టం జగన్
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, జగన్ దిగిపోతే గానీ ఏపీకి పట్టిన అరిష్టం నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
నెల రోజుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఆర్టీసీ బస్సులో బాలకృష్ణ సతీమణి ప్రచారం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర శుక్రవారం వినూత్నంగా ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు. -
రూ.10కి మద్యం.. రూ.50కి బియ్యం బస్తా
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రశాంతత వైపు పల్నాడు ప్రజల చూపు!
పల్నాడు జిల్లాలో ప్రశాంతత తీసుకురావాలని ఓటర్లు భావిస్తున్నారు. రాజకీయ హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో అట్టుడికిపోతున్న ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఓటర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. -
ఆ నలుగురూ.. ఆ తాను ముక్కలే!
ఆంధ్రుల వాణిని దేశమంతా వినిపించాల్సినోళ్లు.. దిల్లీ వేదికగా తెలుగు వారి హక్కుల్ని సాధించాల్సినోళ్లు.. రాష్ట్ర ప్రజల అవసరాలను పక్కనబెట్టి.. సొంత మేలుకే పరుగులు పెట్టారు. -
పట్టుకుంటారని రూ.2 కోట్లు పడేశారు!
చిత్తూరు జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి గురువారం రాత్రి 1 గంట సమయంలో కారులో వైకాపా నాయకులు రూ.2 కోట్లను సంచుల్లో తీసుకొస్తున్నారు. -
గుడివాడలో అభివృద్ధి లేకే వలసలు: కుమారి ఆంటీ
కృష్ణా జిల్లా గుడివాడలో ఎటువంటి అభివృద్ధి లేకే తాను పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్లాల్సి వచ్చిందని ఇటీవల యూట్యూబ్ ద్వారా ఆదరణ పొందిన హోటల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ అన్నారు. -
కూటమికి మద్దతుగా కృష్ణంరాజు సతీమణి ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమికి మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే
‘వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే. వాటిని కాపాడుకోవాలంటే జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థులకు ఓటేయండి. -
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్ని ఓడించండి: మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ను ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు.