హతవిధీ.. ఇదేం మ్యానిఫెస్టో
నెలకు రూ.5 వేలిస్తూ నాలుగున్నరేళ్లు గొడ్డు చాకిరీ చేయించుకున్న ముఖ్యమంత్రి జగన్.. తాజా మ్యానిఫెస్టోలో తమకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుతామని ప్రస్తావించకపోవడంతో వాలంటీర్లు హతాశులయ్యారు.
మా వేతనాల పెంపు ఊసే లేదు
ఉద్యోగ అవకాశాల కల్పనకైనా భరోసా ఇవ్వరా?
హతాశులైన గ్రామ, వార్డు వాలంటీర్లు
బహిరంగ సమావేశాల్లో వాలంటీర్లు నా సైన్యం.. నా కార్యకర్తలు.. నా మనుషులని జగన్ అంటున్నారు. కానీ కనీసం వేతనం పెంచుతానని మ్యానిఫెస్టోలో హామీ కూడా ఇవ్వలేదు. పైగా రాజీనామాలు చేయిస్తున్నారు.
-ఓ వాలంటీర్ మండిపాటు
ఎన్డీయే కూటమి వేతనం రూ.10 వేలకు పెంచుతామనే హామీ అయినా ఇచ్చింది. జగన్ కనీసం ఆ మాట కూడా చెప్పలేదు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాకపోతే మన పరిస్థితేంటి? మనం రాజీనామా చేయకుండా ఉంటే వచ్చే ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉంటుంది.
-వాలంటీర్ల వాట్సప్ గ్రూప్లో ఓ వాలంటీర్ పెట్టిన సందేశం
రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మహిళా వాలంటీర్లు ఏమైనా ప్రచారం చేస్తారా? పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటారా? పేద బతుకులతో ఆడుకోవడం మంచిది కాదు. రాజీనామాలు చేయమనడం అమానవీయం.
-ఓ మహిళా వాలంటీర్ ఆవేదన
అసలు రాజీనామా ఎందుకు చేయాలి? వైకాపా కోసం తిరగాల్సిన అవసరమేంటి? ఒకరేమో వాలంటీర్లు బచ్చాగాళ్లు అంటారు. మరొకరేమో పార్టీ కార్యకర్తలు అంటారు. మేం చెప్పినట్టే పనిచేయాలి అంటారు. వాలంటీర్లు ఏమైనా వైకాపా బానిసలా?
- మరో వాలంటీర్ తిరుగుబాటు
ఈనాడు, అమరావతి: నెలకు రూ.5 వేలిస్తూ నాలుగున్నరేళ్లు గొడ్డు చాకిరీ చేయించుకున్న ముఖ్యమంత్రి జగన్.. తాజా మ్యానిఫెస్టోలో తమకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుతామని ప్రస్తావించకపోవడంతో వాలంటీర్లు హతాశులయ్యారు. వాలంటీర్లలో డిగ్రీ, బీటెక్, పీజీలు చేసినవారు చాలా మందే ఉన్నారు. మ్యానిఫెస్టోలో తమ వేతన పెంపు గురించి మాట్లాడకపోగా.. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనపై కూడా ఎలాంటి భరోసా లేకపోవడం వారిని మరింత కుంగదీసింది. నెలకు రూ.5 వేలు వేతనమంటే సగటున రోజుకు రూ.165. ఈ మొత్తంతో కుటుంబ పోషణ సాధ్యమవుతుందా? అయినా నాలుగున్నరేళ్లు ఇదే వేతనం చెల్లిస్తూ కాలం గడిపారు. ఉద్యోగులు, ఇతర వర్గాలకు ఐదేళ్ల కాలంలో ఎంతో కొంతయినా జీతం పెరుగుతుంది. తమకు వేతనాలు సరిపోవడం లేదని, ఎంతో కొంత పెంచాలని వాలంటీర్లు ధర్నాలు, నిరసనలు చేసినా జగన్ పట్టించుకోలేదు. పైగా స్వచ్ఛంద సేవకులంటూ వారికి కితాబిచ్చారు. ఇప్పుడు మరో ఐదేళ్ల కాలానికి ప్రకటించిన మ్యానిఫెస్టోలోనూ వారి వేతనాల పెంపు గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. అంటే ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా వేతనాలు పెంచేందుకు ఆయనకు మనసొప్పలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా వాలంటీర్లు మండిపడుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆవేదన
మ్యానిఫెస్టోలో వేతనాల ఊసే ఎత్తకపోవడంతో పలువురు వాలంటీర్లు తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ల ముఖచిత్రాలు ఏమిటో? అని ఒకరు ప్రశ్నిస్తే.. విచారానికి, బాధకు మధ్యలో ఉన్నామంటూ మరొకరు సమాధానమిస్తూ ‘రాజా ది గ్రేట్’ సినిమాలోని డైలాగ్తో ఆడేసుకుంటున్నారు. మ్యానిఫెస్టో గురించి ఇక మాట్లాడేదేం లేదు బ్రో అని మరికొందరు సోషల్ మీడియాలో ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గని మెజారిటీ వాలంటీర్లు
వాలంటీర్లను రాజీనామా చేయించి, పార్టీ ప్రచారానికి తిప్పుకోవాలని వైకాపా నేతలు దాదాపుగా నెల రోజులుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. బెదిరింపుల దగ్గర నుంచి ప్రలోభాల వరకు అన్ని రకాల అస్త్రాలూ ప్రయోగిస్తున్నా మెజారిటీ వాలంటీర్లు తలొగ్గడం లేదు. ఇన్నాళ్లూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా వేతనాలిచ్చి.. అదేదో పార్టీ నుంచి ఇచ్చినట్టు ఇప్పుడు పనిచేయాలని చెప్పడంపై చాలా మంది గుర్రుగా ఉన్నారు. చాలామంది ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలోనూ ఎక్కువ మంది వైకాపా అనుకూల ప్రచారానికి మొగ్గు చూపడం లేదు. కృష్ణా, నెల్లూరు, తదితర జిల్లాల్లో కొందరు రాజీనామా చేసి ఏకంగా తెదేపాలో చేరిపోవడంతో వైకాపా నేతలు కంగు తిన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 60 వేల మంది రాజీనామా చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వైకాపాపై అనుకూలతతో రాజీనామా చేసినవారు 5 శాతం మించి ఉండరు.
రూ.10 వేలకు పెంచుతామన్న కూటమి హామీతో భరోసా
పెరిగిన ధరలకు రూ.5 వేల వేతనం సరిపోవడం లేదని, పెంచాలని వాలంటీర్లు ఏడాది క్రితం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కొందరు వైకాపా నేతలు వారిని తూలనాడారు. వారి తీరు చాలా మంది వాలంటీర్లకు నచ్చకపోయినా ఏ ఉద్యోగమూ దక్కని పరిస్థితుల్లో కుటుంబ పోషణకు రూ.5 వేలు ఎంతో కొంత ఉపయోగపడుతుందని కొనసాగారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని తెదేపా హామీ ఇచ్చింది. ఇది చాలా మందికి భరోసానిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదే ఉత్సాహం ఓటేయడంలోనూ చూపాలి!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద శుక్రవారం మందుబాబులు బారులుతీరారు. -
వైట్ కాలర్ రాజకీయ మాఫియా!
ఆ సంస్థ ఒక వైట్ కాలర్ రాజకీయ మాఫియా.. విష ప్రచారానికి పుట్టినిల్లు.. అన్నీ కుట్రలు, కుతంత్రాలే.. అంతా మాయాప్రచారమే.. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు వక్రీకరించడమే. -
జగన్.. మీ తల్లీ చెల్లెళ్లకు సమాధానమివ్వండి: సీఎం రేవంత్ కౌంటర్
ఏపీ సీఎం జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. -
పవన్కల్యాణ్ను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దాం: ముద్రగడ కుమార్తె క్రాంతి
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపిద్దామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి కోరారు. -
ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామంలో తెదేపా కార్యకర్తపై వైకాపా దాడి
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామం ఎల్లవరంలో తెదేపా కార్యకర్తపై వైకాపా మూకలు దాడిచేసి గాయపర్చాయి. -
జులై 1న రూ.7,000 పింఛను
సామాజిక పింఛన్లు ప్రవేశపెట్టింది.. దాన్ని రూ.200 నుంచి 2 వేలు చేసిందీ తెదేపా ప్రభుత్వమేనని.. ఈసారి కూటమి అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. -
భాజపాకు ఏ టీం బాబు.. బీ టీం జగన్
‘భాజపాకు ఏ టీం చంద్రబాబు, బీ టీం జగన్మోహన్రెడ్డి... వీరిలో ఎవరికి ఓటేసినా భాజపాకు వేసినట్లే. -
ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు కడప ఎంపీ అవినాష్రెడ్డే అని సీబీఐ నిర్ధారించినా.. లోకమంతా కోడై కూస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నారని వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ప్రశ్నించారు. -
‘ప్రజల జీవితాల్లో సంతోషమే’ చంద్రబాబు ఆకాంక్ష
‘చంద్రబాబు నాయకత్వం గురించి ప్రజలకు తెలుసు. ఆయన తప్పకుండా అధికారంలోకి వస్తారు. ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. హామీలన్నింటినీ నెరవేరుస్తారు. అంతటితోనే ఆయన ఆగరు. -
ధగధగలా? దగానా?.. యువతా ఎవరు కావాలో తేల్చుకో?
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావడం కీలకం. కానీ, మన రాష్ట్రంలో అంతా రివర్స్ పాలన కదా! యువత ఉపాధి మార్గాలపై దెబ్బ కొట్టిన వైకాపా కావాలో.. కొలువులు అందించడంతోపాటు ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చిన తెదేపా కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. -
రాష్ట్రానికి పట్టిన అరిష్టం జగన్
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, జగన్ దిగిపోతే గానీ ఏపీకి పట్టిన అరిష్టం నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
నెల రోజుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఆర్టీసీ బస్సులో బాలకృష్ణ సతీమణి ప్రచారం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర శుక్రవారం వినూత్నంగా ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు. -
రూ.10కి మద్యం.. రూ.50కి బియ్యం బస్తా
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రశాంతత వైపు పల్నాడు ప్రజల చూపు!
పల్నాడు జిల్లాలో ప్రశాంతత తీసుకురావాలని ఓటర్లు భావిస్తున్నారు. రాజకీయ హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో అట్టుడికిపోతున్న ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఓటర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. -
ఆ నలుగురూ.. ఆ తాను ముక్కలే!
ఆంధ్రుల వాణిని దేశమంతా వినిపించాల్సినోళ్లు.. దిల్లీ వేదికగా తెలుగు వారి హక్కుల్ని సాధించాల్సినోళ్లు.. రాష్ట్ర ప్రజల అవసరాలను పక్కనబెట్టి.. సొంత మేలుకే పరుగులు పెట్టారు. -
పట్టుకుంటారని రూ.2 కోట్లు పడేశారు!
చిత్తూరు జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి గురువారం రాత్రి 1 గంట సమయంలో కారులో వైకాపా నాయకులు రూ.2 కోట్లను సంచుల్లో తీసుకొస్తున్నారు. -
గుడివాడలో అభివృద్ధి లేకే వలసలు: కుమారి ఆంటీ
కృష్ణా జిల్లా గుడివాడలో ఎటువంటి అభివృద్ధి లేకే తాను పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్లాల్సి వచ్చిందని ఇటీవల యూట్యూబ్ ద్వారా ఆదరణ పొందిన హోటల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ అన్నారు. -
కూటమికి మద్దతుగా కృష్ణంరాజు సతీమణి ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమికి మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే
‘వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే. వాటిని కాపాడుకోవాలంటే జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థులకు ఓటేయండి. -
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్ని ఓడించండి: మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ను ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు.