నిగూఢ సైన్యం!
సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలకు, నేతలకు నిరుద్యోగ ఇంజినీర్లు, ఎంబీఏ పట్టభద్రులు నిగూఢ సైన్యంగా పని చేస్తున్నారు. తమ డేటా నైపుణ్యాలతో అతి తక్కువ సమయంలో నేతల ప్రచారంలోని రాజకీయ సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఎన్నికల వ్యూహాల్లో ఐఐటియన్లు, ఎంబీఏ పట్టభద్రులు
కన్సల్టెన్సీల సేవలో నిరుద్యోగులు
యువ న్యాయవాదులకూ అవకాశం
ఈనాడు ప్రత్యేక విభాగం
సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలకు, నేతలకు నిరుద్యోగ ఇంజినీర్లు, ఎంబీఏ పట్టభద్రులు నిగూఢ సైన్యంగా పని చేస్తున్నారు. తమ డేటా నైపుణ్యాలతో అతి తక్కువ సమయంలో నేతల ప్రచారంలోని రాజకీయ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇందులో ఐఐటియన్లు, ఎంబీఏ పట్టభద్రులు, యువ న్యాయవాదులు తెర వెనుక ప్రచార వ్యూహాల్లో పాలు పంచుకుంటున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాలయాల నుంచి పట్టాలు అందుకున్న పలువురు యువత ఈ క్రతువులో పాల్గొంటున్నారు. ఈ యువ నిరుద్యోగుల పని పార్టీలకు ఓటెయ్యాలని అభ్యర్థించడం కాదు. సర్వేలు నిర్వహించడం, ఓటర్ల డేటాను విశ్లేషించడం. భాజపాకు పని చేస్తున్న ఓ యువకుడి మాటల్లో చెప్పాలంటే.. భాజపాకు ఓటేయని వారిని గుర్తించడం. అటువంటి వారిని వయసు, కులం, మతం, తెగ ఆధారంగా వర్గీకరించడం. వారిని భాజపాకు దగ్గర చేసేలా వ్యూహాలను రచించడం.
క్షేత్ర స్థాయిలో వందల మంది
కార్యాలయాల్లో కూర్చుని డేటాను విశ్లేషించే వీరికి క్షేత్ర స్థాయిలో పని చేసే వందల మంది సహకరిస్తుంటారు. వారంతా ఓటర్ల అభిప్రాయం, సమస్యలను డేటా కేంద్రానికి చేరవేస్తుంటారు.
ఐఐటీలు, ఐఐఎంల నుంచి..
కన్సల్టెన్సీల్లో పని చేసే వారిలో 20శాతం నుంచి 30శాతం మంది ఐఐటీల నుంచి, 5శాతం మంది ఐఐఎంల నుంచి వస్తున్నారు. వీరంతా ఎన్నికల సమయంలో కంప్యూటర్లు, పెద్ద ఎల్ఈడీ తెరలతో కుస్తీ పడుతుంటారు. కన్సల్టెన్సీలు ఫలానా డిగ్రీ ఉండాలని కోరుకోవు. కానీ గణితంలో ప్రతిభ ఉండాలని కోరుకుంటాయి. కోడింగ్లో నైపుణ్యంతోపాటు సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉండాలని అభిలషిస్తున్నాయి. ఇందులో ఐఐఎంలో చదివిన వారిని టీంలకు నాయకత్వం వహించడానికి, ఐఐటీల వారిని టెక్నాలజీలో వినియోగించుకోవడానికి సంస్థలు తీసుకుంటున్నాయి. ఇందులో చేరినవారు నిగూఢంగా పని చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో 24 గంటలూ పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ రంగంలో మహిళలకు అవకాశాలు తక్కువనే చెప్పాలి.
జేఈఈలో అత్యున్నత ప్రతిభ
ఇంజినీరింగ్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులే ఎక్కువ మంది ఈ కన్సల్టెన్సీ సంస్థల్లో పని చేస్తున్నారు. వారంతా లక్షల మందితో పోటీ పడి అత్యున్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొంది చదివినవారే. అటువంటి వారిలో కిశోర్ ఒకరు. ఆయనతోపాటు వందల మంది ఈ రాజకీయ వ్యూహ రచనలో భాగస్వాములయ్యారు.
30 కోట్ల డాలర్ల మార్కెట్
భారత్లో ఎన్నికల వ్యూహ రచన కన్సల్టెన్సీల మార్కెట్ 30 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇటువంటి సంస్థలను తప్పనిసరిగా తీసుకుంటున్నాయి. ఇందులో పని చేసే పట్టభద్రులు.. ఓటర్ల డేటాను విశ్లేషించి విలువైన సమాచారం అందించడంలో వేగంగా, కచ్చితత్వంతో పని చేస్తున్నారు. కన్సల్టెన్సీలు కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థల్లో చదివిన వారిని ఆకట్టుకునేందుకు అత్యధిక వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతోపాటు అధికార వ్యవస్థలకు దగ్గరగా ఉండే అవకాశం కూడా పట్టభద్రులను ఆకర్షిస్తోంది.
ప్రతి ఓటుపైనా దృష్టి
కన్సల్టెన్సీల్లో పని చేసే ఉద్యోగులు ప్రతి ఓటుపైనా దృష్టి సారిస్తారు. ఉదాహరణకు త్రిపురలోని కొండ ప్రాంతాల్లో ఉండే 80 మంది ఓటర్లను కలుసుకోవడానికి ఒక ఉద్యోగి 3 రోజులపాటు ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా చేసి ఆ ఓట్లను సాధించగలిగారు.
రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు
తెర వెనుక పనిచేసే ఈ యువతకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. వారికి కావాల్సిందల్లా వేతనం, గెలిచాక ఆనందం. అందుకే వారిని ‘రాజకీయ తటస్థ సమస్య సాధకులు’ అని పిలుస్తారు. ‘మేం మా పార్టీ తరఫున ఓట్లను సాధించడానికి చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కానీ మేం మాకిచ్చిన సమస్యను పరిష్కరించడానికే పని చేస్తాం’ అని ఇందులో పాలుపంచుకుంటున్న కొందరు ఉద్యోగులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. -
గెలవకున్నా.. గెలుపోటములను శాసిస్తారు!
ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. పలు స్థానాల్లో ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నారు. -
ఖమ్మం గుమ్మంలో గెలుపెవరిదో?
ఉద్యమాలకు గుమ్మం, రాజకీయ చైతన్యానికి ప్రతీక ఖమ్మం లోక్సభ నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పుతో రాష్ట్ర రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేస్తూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఏ స్థానంలో ఎవరికెన్ని విజయాలు
లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించి విజయం సాధించేందుకు తెలంగాణలో ప్రధాన పార్టీలు బరిలోకి దిగి ఢీ అంటే ఢీ అంటున్నాయి. -
దూరమైనా.. వారికి ఓటు భారం కాదు
అడవులు, కొండల్లో ఉండే ఆ గ్రామాలు ఈ సాంకేతిక కాలంలోనూ కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉన్నట్లే ఇక్కడి ప్రజలకూ హక్కులున్నా.. ఎన్నికలప్పుడు తప్ప నాయకులు, అధికారులు వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. -
అభి‘మతమే’ ముఖ్యం!
దేశ రాజకీయాలకు కేంద్ర స్థానమైన ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. కుల, మత రాజకీయాలకు కీలకమైన ప్రాంతాల్లో ఈ నెల 13వ తేదీన నాలుగో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం