icon icon icon
icon icon icon

Pawan Kalyan: సినిమా హీరోలంటే జగన్‌కు కుళ్లు.. చర్చలకు పిలిచి అవమానించారు: పవన్‌

లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే సీఎం జగన్‌కు కుళ్లు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు.

Updated : 20 Apr 2024 22:30 IST

కోరుకొండ: లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే సీఎం జగన్‌కు కుళ్లు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. అందరు సినీ హీరోల అభిమానులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

‘‘ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది నటులు ఇతర పార్టీల్లో ఉన్నారు. ఆయన్ను రాజకీయంగా విమర్శించే వారు. కానీ, ఎప్పుడూ కూడా ఎన్టీఆర్‌.. వారిని ఇబ్బంది పెట్టలేదు. అదీ.. ఆయన సంస్కారం. తెలుగుదేశం పార్టీతో గతంలో వ్యక్తిగతంగా విభేదాలున్నప్పటికీ నా సినిమాలను ఎప్పుడూ ఆపలేదు.

సినిమా టికెట్ల ధరల విషయమై సీఎం జగన్‌తో మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌ వెళితే వారిని అగౌరవపర్చారు. ఇంటి బయట ఎక్కడో వాహనాలు ఆపేసి.. నడిపించారు. ప్రైవేటు మీటింగ్‌ జరుగుతుంటే.. శాడిస్టిక్‌గా సీక్రెట్‌ కెమెరాలు, మైక్‌లు పెట్టారు. చిరంజీవి అందరి తరఫున మాట్లాడితే.. ఆ వీడియోలను బయటకు రిలీజ్‌ చేసి అగౌరవపరిచారు. లక్షలాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్‌కు కుళ్లు. కలుగులో ఎలుక లాంటి జగన్‌.. అది తట్టుకోలేరు. సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే చిరంజీవికి, హీరోలకి సంబంధం లేదు. అందుకోసం నిర్మాతల మండలి, ట్రేడ్‌ బాడీ ఉంది. అజాత శత్రువు చిరంజీవి.. ఆయన ఎవరి జోలికి వెళ్లరు. అలాంటి మనిషిని కూడా కించపరిచిన వ్యక్తి జగన్‌. ముఖ్యంగా ప్రభాస్‌, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ అభిమానులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి’’ అని పవన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img