icon icon icon
icon icon icon

Priyanka Gandhi: 24, 25 తేదీల్లో తెలంగాణలో ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ శుక్రవారం, శనివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Updated : 23 Nov 2023 20:57 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ శుక్రవారం, శనివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో, 1.30గంటలకు హుస్నాబాద్‌, సాయంత్రం 3గంటలకు కొత్తగూడెం ప్రచార సభలో ప్రియాంక పాల్గొంటారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహిస్తారు. 24వ తేదీ రాత్రి ఖమ్మంలోనే బస చేస్తారు. 25న ఉదయం 11 గంటలకు పాలేరు, 1.30 గంటలకు సత్తుపల్లి, 2.40 గంటలకు మధిర ప్రచార సభల్లో ప్రియాంక పాల్గొంటారు. అనంతరం విజయవాడ చేరుకుని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి వెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img