Ravidas Mehrotra: 251 సార్లు జైలుకెళ్లి..! రాజ్నాథ్ను ఢీకొడుతున్న ఆ నేత ఎవరు?
ఏకంగా 251 సార్లు జైలుకెళ్లిన ఓ సమాజ్వాదీ పార్టీ నేత.. లఖ్నవూ లోక్సభ స్థానంలో కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ను ఢీకొడుతున్నారు.
లఖ్నవూ: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 251 సార్లు జైలుకెళ్లారు.. లఖ్నవూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా మొదలైన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆయనే ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ స్థానం నుంచి బరిలో దిగిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రా (Ravidas Mehrotra). గతంలో యూపీ మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్పై పోటీ చేస్తున్నారు.
సామాజిక కార్యకర్త అయిన రవిదాస్ తొలిసారి 1989లో లఖ్నవూ తూర్పు స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో లఖ్నవూ సెంట్రల్ స్థానంనుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున విజయం సాధించారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2022లో మరోసారి గెలుపొందారు. అనేకసార్లు జైలుకు వెళ్లిన విషయంలో రవిదాస్ మాట్లాడుతూ.. ‘‘నాపై ఉన్న కేసులన్నీ యూనివర్సిటీ రోజుల్లో, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చేసిన ప్రదర్శనలు, నిరసనలకు సంబంధించినవే. ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు. నేను మొదటినుంచి ఓ పోరాట యోధుడిననే విషయాన్ని ఈ లెక్కలే చెబుతాయి’’ అని తెలిపారు.
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
రాజ్నాథ్పై పోటీ అంశంపై స్పందిస్తూ.. ‘‘ప్రజల ముందు పెద్ద పెద్ద యోధులే తలలు వంచారు. ఇవైతే ఎన్నికలు.. ఫలితం ఎవరిపైపు మొగ్గు చూపుతుందో ఎవరికీ తెలియదు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. లఖ్నవూ స్థానానికి ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్ నిర్వహించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలుత పార్టీయే నన్ను మోసం చేసింది
ఈ సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన లోక్సభ స్థానం సూరత్. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురవడంతో ఆయన్ను హస్తం పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. -
మాతృదినోత్సవ వేళ.. మోదీకి అమ్మకానుక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయనకు ఊహించని బహుమతి అందింది. -
యూపీ, ఝార్ఖండ్, మహారాష్ట్రల్లో కేజ్రీవాల్ ప్రచారం
ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో ఈ నెల 15న, ఝార్ఖండ్లోని జంశెద్పుర్లో 16న, మహారాష్ట్రలోని ముంబయిలో 17న ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున వచ్చే వారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించనున్నారు. -
ఉదయపు నడకలోనూ నేతల ప్రచారం
సార్వత్రిక ఎన్నికలకు వివిధ పార్టీల నాయకులు సభలు, ర్యాలీల్లో ప్రచారం చేయడమే కాకుండా ఉదయపు నడకకు వెళ్లినప్పుడు కూడా ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. -
రాహుల్ విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థా?
ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని అంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మోదీలాంటి వ్యక్తితో చర్చించే స్థాయి ఉందా? -
విపక్ష నేతల హెలికాప్టర్లనే తనిఖీ చేస్తారా?
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే నేతలను స్వేచ్ఛగా వదిలేస్తూ విపక్ష పార్టీ నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. -
దేశంలోని పేదలందరికీ ఉచిత విద్యుత్ : ఆప్
లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మోదీ గ్యారంటీలకు కౌంటర్గా గ్యారంటీలు ప్రకటించింది. -
పాక్ అణుబాంబుకు రాహుల్ భయపడతారేమో.. భాజపా మాత్రం కాదు
అణ్వస్త్ర సామర్థ్యమున్న పాకిస్థాన్ను భారత్ గౌరవించాలంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా ఘాటుగా స్పందించారు. -
ప్రధాని మోదీ ఎప్పుడైనా గ్రామాలకు వెళ్లారా?
వారణాసి ఎంపీగా పదేళ్లు ఉన్నారు... ఎప్పుడైనా ఆ నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్లారా? రైతుల కష్టసుఖాలను తెలుసుకున్నారా? అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రధాని మోదీని ప్రశ్నించారు. -
కాంగ్రెస్కు వచ్చే సీట్లు.. ‘యువరాజు’ వయసుకంటే తక్కువే
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు యువరాజు (రాహుల్గాంధీని ఉద్దేశించి) వయసు కంటే తక్కువ సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. -
నాలుగోదశ సమరం నేడే
లోక్సభ సమరంలో రెండో అతిపెద్దదైన నాలుగో దశ కింద సోమవారం పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. -
మోదీ మళ్లీ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీలకు బానిసత్వమే
ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడోసారి అధికారంలోకి వస్తే పేదలు, దళితులు, గిరిజనులను బానిసల్లా చూస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. -
పెళ్లికి ముందు వరుడు పారిపోతే.. మా తప్పా?
తమ అభ్యర్థిని దొంగిలించిన భాజపాకు నోటాతో బుద్ధి చెప్పాలంటూ మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కాంగ్రెస్ చేపడుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. -
నోటాకు 50 శాతానికి పైగా ఓట్లు వస్తేనే ఫలితాలపై ప్రభావానికి అవకాశం
‘‘ప్రస్తుతం నోటా ఒక గుర్తుగా మాత్రమే ఉంది. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం లేదు. దానికి 50 శాతంపైగా ఓట్లు వచ్చినప్పుడే ఎన్నికల ఫలితాలపై చట్టబద్ధ ప్రభావం ఉండేలా ఆలోచించేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ అభిప్రాయపడ్డారు. -
ఐదో దశ అభ్యర్థుల్లో మహిళలు 12% మందే
లోక్సభకు ఐదో దశలో పోలింగ్ జరగనున్న 49 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 12 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. -
ఈ 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.. రాహుల్కు అమిత్ షా సవాల్!
రాహుల్ గాంధీపై అమిత్ షా అయిదు ప్రశ్నలు ఎక్కుపెట్టారు. ఆ అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశాకే.. రాయ్బరేలీలో ఓట్లు అడగాలన్నారు. -
‘ఒకవేళ నేను మళ్లీ జైలుకెళ్తే..!’ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
అరవింద్ కేజ్రీవాల్.. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దేశ రాజధానిలోని మోతీనగర్, ఉత్తమ్నగర్లలో ఆదివారం రోడ్ షోల్లో పాల్గొని, ప్రసంగించారు. -
భాజపా నేతలది మొసలికన్నీరు.. నవీన్ పట్నాయక్
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భాజపా నేతలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. -
బెంగాల్కు మోదీ 5 గ్యారంటీలు
తాను అధికారంలో ఉన్నంత కాలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
‘నోటా’ ఓట్లు 50 శాతం దాటితే మాత్రం..! మాజీ సీఈసీ ఏమన్నారంటే..
ఇందౌర్ స్థానంలో ‘నోటా’కు ఓటేయాలంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే, ఎన్నికల ఫలితాలపై ‘నోటా’ ప్రభావం నామమాత్రమేనని మాజీ సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. -
అణుబాంబులకు రాహుల్ భయపడతారేమోగానీ..: అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్దేనని, దాన్ని తిరిగి తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
-
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
-
ఓటు కోసం ద్విచక్రవాహనంపై దంపతుల సాహస యాత్ర!
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు