icon icon icon
icon icon icon

ఏపీలో ఎన్నికల కోలాహలం.. నామినేషన్లు వేసిన తెదేపా ముఖ్యనేతలు

ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో కోలాహలం నెలకొంది.

Published : 22 Apr 2024 14:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో కోలాహలం నెలకొంది. నేడు నామినేషన్లు వేసిన వారిలో తెదేపా(TDP)కు చెందిన ముఖ్యనేతలు ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, విజయవాడలో తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌, పాయకరావుపేటలో వంగలపూడి అనిత, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, ఉండిలో రఘురామకృష్ణరాజు, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్‌, తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు, సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. ఎంపీ అభ్యర్థుల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (నెల్లూరు) పెమ్మసాని చంద్రశేఖర్‌ (గుంటూరు), మతుకుమిల్లి శ్రీభరత్‌ (విశాఖపట్నం) నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img