icon icon icon
icon icon icon

Nirmala Sitharaman: దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ: నిర్మలా సీతారామన్‌

తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న భారాస తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

Updated : 21 Nov 2023 14:24 IST

హైదరాబాద్‌: తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న భారాస తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. కేంద్రప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలంటే భాజపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మధురానగర్‌లో భాజపా అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరఫున ఆమె ప్రచారం నిర్వహించారు. 

కాళేశ్వరం సహా అన్ని కుంభకోణాలపై విచారణ

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. ‘‘బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. హైదరాబాద్‌లో ఎప్పట్నుంచో ఉన్న పరిశ్రమలు చూపిస్తున్నారు తప్ప ఇతర జిల్లాల్లో అభివృద్ధి జరగలేదు’’ అని నిర్మల ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img