కాళేశ్వరం సహా అన్ని కుంభకోణాలపై విచారణ
భాజపా అధికారంలోకి రాగానే అవినీతిపరులను కటకటాల వెనక్కి పంపడం ఖాయమని పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. భారాస పాలన అవినీతి, కుంభకోణాలమయంగా మారిందని అన్నారు.
కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం
వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేస్తాం
భాజపా అగ్రనేత అమిత్షా
ఈనాడు, వరంగల్, కరీంనగర్- మెట్పల్లి, కోరుట్ల, నాచారం-న్యూస్టుడే: భాజపా అధికారంలోకి రాగానే అవినీతిపరులను కటకటాల వెనక్కి పంపడం ఖాయమని పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. భారాస పాలన అవినీతి, కుంభకోణాలమయంగా మారిందని అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఓఆర్ఆర్, మియాపూర్ భూములు, పాస్పోర్టులు, గ్రానైట్ కుంభకోణాలపై రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడగానే విచారణ చేసి అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన జనగామ, జగిత్యాల జిల్లా కోరుట్లలలో నిర్వహించిన భాజపా ఎన్నికల విజయ సంకల్ప సభల్లో అమిత్షా ప్రసంగించారు. బైరాన్పల్లి అమరవీరులకు నివాళి అర్పించారు. రాత్రి ఉప్పల్ భాజపా అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు మద్దతుగా నాచారంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్నారు. ఈయన వెంట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఉన్నారు. ఈ సభల్లో అమిత్షా మాట్లాడారు. ‘‘భాజపా తెలంగాణ ప్రజల పార్టీ. ప్రస్తుతం జరుగుతున్నవి శాసనసభ ఎన్నికలైనప్పటికీ.. రానున్న అయిదేళ్లలో తెలంగాణ, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని గుర్తించాలి. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నిర్ణయం తీసుకుని తెలంగాణకు విముక్తి కలిగించారు. సీఎం కేసీఆర్.. ఒవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడంలేదు. బైరాన్పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్తూపం నిర్మిస్తాం. కాంగ్రెస్, భారాసలు బలహీనవర్గాలకు అన్యాయం చేశాయి. కేసీఆర్ దళితుడిని సీఎంను చేస్తామని చెప్పి చేయలేదు. కానీ కుమారుడిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భాజపా మాత్రం బీసీని సీఎం చేసే బాధ్యతను చేపట్టింది. భారాస గుర్తు కారు.. దీని స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతిలో ఉంది. కాంగ్రెస్, భారాస, ఎంఐఎంలు కుటుంబ పార్టీలు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసి కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించాలి. ప్రధాని మోదీ పాలనలో జీ-20 సదస్సు నిర్వహణతో ప్రపంచంలో దేశ గౌరవం పెరిగింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన పార్లమెంట్ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి ప్రారంభించుకున్నాం. చంద్రయాన్తో మువ్వన్నెల జెండా చంద్రుడి వరకు చేరింది. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని అయిదో స్థానంలోకి తీసుకువచ్చిన ఘనత మోదీకే దక్కుతుంది.
బీసీ సీఎం భాజపా లక్ష్యం
తెలంగాణలో సామాజిక న్యాయం లక్ష్యంగా బీసీని ముఖ్యమంత్రిగా నియమించాలని భాజపా నిర్ణయించింది. మాదిగ సమాజానికి రిజర్వేషన్లలో అన్యాయం జరిగింది. దీన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మాదిగలకు న్యాయమైన రిజర్వేషన్ల కోసం వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మతపరమైన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం. పసుపుబోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రతి క్వింటా ధాన్యం రూ.3,100 మద్దతు ధరతో కొంటాం. పంటల బీమా ప్రీమియంకు రైతులు ఒక్క పైసా కట్టాల్సిన అవసరంలేదు. రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న మహిళలకు ఏటా 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. పేదలకు రూ.10 లక్షల వరకు వైద్యానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. భాజపా ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అయోధ్య దర్శనం చేయిస్తుంది. అర్వింద్ను గెలిపిస్తే పెద్ద పదవి ఇచ్చే బాధ్యత మాది.
హామీల అమలేది?
రాష్ట్రంలో 24 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. 7 లక్షల పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పి చేపట్టలేదు. రుణమాఫీ అమలు చేయలేదు. భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణను అగ్రస్థాయి రాష్ట్రంగా నిలుపుతాం’’ అని అమిత్షా అన్నారు.
సీఎం కేసీఆర్ హామీల అమలును విస్మరించారు. జనగామలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు వంటి హామీలనూ నెరవేర్చలేదు. అక్కడ భూఆక్రమణలకు మాత్రం పాల్పడ్డారు.
ఏటా సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి అమరవీరులకు నివాళి అర్పిస్తాం. బైరాన్పల్లి, పరకాల అమరవీరుల త్యాగాలను గుర్తిస్తూ ఏటా ఆగస్టు 27ను దుశ్చర్యదినంగా నిర్వహిస్తాం.
అమిత్ షా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Assembly: ప్రొటెం స్పీకర్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ
రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. -
TS Cabinet: కొత్త.. పాత కలయికగా మంత్రివర్గం
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుదీరనున్న మంత్రివర్గం కొత్త..పాత కలయికగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. -
బైక్పై 330కి.మీ. ప్రయాణించి అసెంబ్లీకి వచ్చిన కొత్త ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమలేశ్వర్ డొడియార్ అనే ఎమ్మెల్యే బైక్పై అసెంబ్లీకి వెళ్లారు. -
కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. -
పాలకులం కాదు.. సేవకులం
‘మేం పాలకులం కాదు.. సేవకులం. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది’ అని నూతన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్
తెలంగాణ శాసనసభ స్పీకర్గా వికారాబాద్ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్కుమార్ (59)ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహుడిగా ఉన్న ఆయన్ను అధిష్ఠానం అనూహ్యంగా సభాపతి పదవికి ఎంపికచేసింది. -
మధ్యప్రదేశ్లో ముఖానికి నల్ల రంగుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే హల్చల్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 50 సీట్లు గెల్చుకున్నా.. తన ముఖానికి నలుపు రంగు పూసుకుంటానంటూ సవాలు విసిరిన కాంగ్రెస్ నేత ఫూల్సింగ్ బరైయా దాదాపుగా అన్నంత పనీ చేశారు! -
సీఎంల ఖరారులో జాప్యంపై భాజపాను ప్రశ్నించరేం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఇప్పటివరకు ముఖ్యమంత్రులను ప్రకటించకపోవడంపై భాజపాను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ పార్టీ గురువారం నిలదీసింది. -
రిసార్టులో అయిదుగురు భాజపా ఎమ్మెల్యేలు!
రాజస్థాన్లో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నవేళ అయిదుగురు భాజపా ఎమ్మెల్యేలు ఓ రిసార్టులో బస చేయడం కలకలం సృష్టించింది. -
ఈ వారాంతంలో మూడు రాష్ట్రాల సీఎంల ఎన్నిక!
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కొత్త సీఎంల ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు భాజపా శుక్రవారం తమ పార్టీ తరఫున కేంద్ర పరిశీలకుల పేర్లను ఖరారు చేసే అవకాశాలున్నాయి. -
ఆ ఇద్దరు మంత్రులూ హెచ్సీయూ పూర్వ విద్యార్థులే
తమ పూర్వ విద్యార్థులు రాష్ట్ర మంత్రి వర్గంలో సభ్యులు కావడం పట్ల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యుల బృందం, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం రేవంత్రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
Revanth Reddy: రేవంత్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు: సోదరి సుమతి
‘రేవంత్రెడ్డి ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఉన్నతస్థానానికి వెళ్తారని, ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నా’ అని ఆయన సోదరి సుమతి అన్నారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
అగ్రనేతలంతా సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారానికి తరలి రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
ఏఐసీసీ అగ్రనేతలకు సీఎం, మంత్రుల స్వాగతం, వీడ్కోలు
ఏఐసీసీ అగ్రనేతలకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్రెడ్డి ఉదయం స్వాగతం, సాయంత్రం వీడ్కోలు పలికారు. -
మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో కోటీశ్వరులు 205 మంది
మధ్యప్రదేశ్లో తాజాగా ఎన్నికైన 230 మంది ఎమ్మెల్యేల్లో కోటీశ్వరులు ఏకంగా 205 మంది ఉన్నారు. రూ.296 కోట్ల ఆస్తులతో రత్లాం శాసనసభ్యుడు చైతన్య కశ్యప్ (భాజపా) రాష్ట్రంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. -
BJP: ఆ మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై ఇంకా వీడని సస్పెన్స్!
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా అక్కడ ప్రభుత్వాల ఏర్పాటుపై కసరత్తును ముమ్మరం చేసింది. -
Revanth Reddy: పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి..
ప్రమాణ స్వీకారానికి ముందు జూబ్లీహిల్స్లోని పెద్దమ్మతల్లి గుడికి రేవంత్రెడ్డి (Revanth Reddy) వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోనున్నారు. -
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి ముఖ్యనేతలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. -
Telangana New Ministers: తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
Revanth Reddy: నేనింకా ప్రమాణస్వీకారం చేయలేదు.. అధికారిక కాన్వాయ్కు నో చెప్పిన రేవంత్
దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రేవంత్రెడ్డి బుధవారం రాత్రి 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు
-
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..