Vyooham: ‘వ్యూహం’ సినిమాపై ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్‌

‘వ్యూహం’ సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Published : 28 Dec 2023 22:29 IST

అమరావతి: ‘వ్యూహం’ సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌పై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా పాత్రలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ను పునః సమీక్ష చేయాలని కోరారు. రాజేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని