ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గట్టు మండలంలోని ఆరేగిద్ద గ్రామానికి చెందిన గోపాలమ్మ బుధవారం ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల

Published : 27 May 2020 16:29 IST

తల్లీ బిడ్డ క్షేమం

గట్టు: ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గట్టు మండలంలోని ఆరేగిద్ద గ్రామానికి చెందిన గోపాలమ్మ బుధవారం ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలమ్మ చికిత్స కోసం బుధవారం ఆరేగిద్ద నుంచి గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తోటి మహిళా ప్రయాణికులే ఆమెకు పురుడు పోశారు. దీంతో మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతనం అదే బస్సులో గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ మహిళకు చికిత్స అందించిన అనంతరం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని